
Sunday, December 30, 2007
దొంగ జర్నలిస్టులున్నారు జాగ్రత్త..

టిటివి వచ్చేస్తోంది..
తెలుగులో మరో కొత్త ఛానెల్ ' టిటివి ' త్వరలో రాబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం ' టిటివి 'కి సీఇవో-కం-ఎడిటర్ గా కె.రామచంద్ర మూర్తి పేరు వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఆంధ్రజ్యోతికి రాజీనామా ఇచ్చారని తెలుస్తోంది. ఇక టిటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పోస్టుకి ప్రస్తుతం ఖాళీగా ఉన్న భావనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ' టిటివి ' అంటే ఏమిటి? తెలుగు టీవీయా? తెలంగాణా టీవీయా? లేక 'ట్రూత్ టీవీ'యా అన్నది స్పష్టం కాలేదు. ప్రముఖ ఫర్టిలైజర్ కంపనీ ఈ ఛానెల్ పెడుతోందిట..
Tuesday, December 25, 2007
ధనార్జనా నీదే ఛానెల్?
చందూ జనార్ధన్ మరో కొత్త కొలువు సంపాదించాడు. ఇప్పుడాయన విస్సా ఛానెల్లో చేరిపోయాడు. ధనార్జనుడిగా అపఖ్యాతి తెచ్చుకున్న ఇతడి ఘన చరిత్రను మీడియా వర్గాలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నాయి. గతంలో జనార్ధనుడి లీలను ఎబౌట్ తెలుగు మీడియా చాటి చెప్పినా కుక్క తోక వంకర అన్నట్లు అతడి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. రాయడం చేత కాకున్నా జర్నలిస్టు ఫోజు కొట్టడం జనార్ధనుడికే చెల్లు. ఎర్రం నాయుడు రికమండేషన్ తో ' సీ-ఛానెల్ ' జనార్ధన్ ను నమ్మి బ్యూరోచీఫ్ ఉద్యోగం ఇస్తే పైరవీలు చేసుకుంటూ నెలల తరబడి అఫీసుకెల్లకుండా నరసిం హా రావు అనే నమ్మిన బంటుతో ఫోన్లపైనే మేనేజ్ చేశాడు. చివరకు సంస్థకే ఎసరు పెట్టబోయి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నటికీ వచ్చే అవకాశం లేని సత్యా టీవీ పేరు చెప్పుకొని తిరిగాడు. అక్కడి నుండి అప్పటి చెన్నై జెమిని న్యూస్ ఎడిటర్కి ముడుపులు సమర్పించుకొని ఢిల్లీ రిపోర్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఢిల్లీ నుండి ఏనాడు సరిగ్గా వార్తలు పంపకుండా పైరవీలకే పరిమితం అయ్యాడు. ఆ మధ్య పది రోజులు సెలవు పెట్టి జెమినికి రిజైన్ చేయకుండానే ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరోచీఫ్ ఉద్యోగం సంపాదించాదు. ఇందు కోసం కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పైరవీ చేయించుకున్నాడు. కానీ వారం రోజులు తిరక్కుండానే ఢిల్లి జెమిని ఉద్యోగంలో చేరిపోయాడు. ఈ వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఆంధ్ర ప్రభ ఏడిటర్ ఒక ఆర్టికల్ రాయమని జనార్ధన్ కు చెప్పారు. జనార్ధన్ ఆ పని చేయలేదు. అసలాయనకు రాయటం వస్తే కదా?.. జనార్ధన్ను ఎడిటర్ గారు మందలించే సరికి చెప్పా పెట్టకుండా ప్రభ ఆఫీస్ వది వచ్చాడు. తిరిగి ఢిల్లీ చేరిన జనార్ధన్ కు సతీష్ బాబు జెమిని ఛీఫ్ ఎడిటర్ కావడం పిడుగు లాంటి వార్త అయింది. జెమినిలో ఆటలు సాగవని అర్థమైన జనార్ధన్ సైలెంట్ గా 'విస్సా'లో చేరిపోయాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జనార్ధన్ ఇంకా జెమినికి రాజీనామా ఇవ్వలేదట. జెమిని వారు ఇంత గుడ్డిగా ఎలా ఉన్నారు?.. అసలు జనార్ధన్ లాంటి అవినీతి పరునికి విస్సా న్యూస్ టీం ఎలా ఉద్యోగం ఇచ్చింది?.. అసలు సాంకేతికంగా జనార్ధన్ జెమినిలో ఉన్నట్లా?.. విస్సాలో ఉన్నట్లా?.. ఇంతకీ నీదే ఛానెల్ ధనార్జనా?.. అసలు జనార్ధన్ లాంటి వ్యక్తికి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం, హౌసింగ్ సొసైటీ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తాయి?..
Sunday, December 23, 2007
ప్లాట్ల కోసం జర్నలిస్టుల పాట్లు

కొసమెరుపు: రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గనక దయతలిచి ఇళ్ళ స్థలాలు ఇస్తే చాలా మంది జర్నలిస్టులు వాటిని అమ్ముకొని కోటీశ్వరులైపోయి, పాత్రికేయ వృత్తికి గుడ్బై చెబుదామనుకుంటున్నారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొంది ఖరీదైన జీవితం అనుభవిస్తున్న జర్నలిస్ట్ మిత్రులే వారికి స్పూర్తి. అఫ్ కోర్స్ గతంలో ఇళ్ళ స్థలాలు పొంది వెంటనే అమ్ముకొని, తీరా వాటికి ధర పెరగటం చూసి నష్టపోయాం బాబో అని లబో దిబో అంటున్న జర్నలిస్టులు కూడా ఉన్నారనుకోండి.
Thursday, December 13, 2007
టీవీ-5 శవాల వ్యాపారం

కొసమెరుపు: శవాల వ్యాపారం స్థాయికి దిగజారిన టీవీ-5పై పోఅలీస్ కేస్ నమోదై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు టీవీ-5 వారు మీడియా స్వేచ్చ అంటూ సిగ్గు లేకుండా జర్నలిస్ట్ సంఘాల మద్దతు కోరుతున్నారు.
మహిళా జర్నలిస్టులకు చోటు లేదా?

Sunday, December 9, 2007
మీడియా ' చిరు ' భజన

అమ్మకానికి ఛానెళ్ళు

Tuesday, November 27, 2007
జెమినిలో ఇక సతీష్ బాబు మార్క్
జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ బాధ్యతలను చేపట్టిన సతీష్ బాబు ఛానెల్ ప్రక్షాళన ఆరంభించారు. జెమిని న్యూస్ ను సమూలంగా మార్చే దిశగా కొత్త యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లను కొత్తగా తీసుకుంటున్నారు . తనదైన కార్యక్రమాలతో ఛానెల్ కు కొత్త రూపం తేవాలన్నదే ఆయన తాపత్రయం. నాలుగు ఓబీ వ్యాన్లను కూడా తెప్పిస్తున్నారట. అయితే మార్పుల్లో భాగంగా సతీష్ బాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. జెమిని న్యూస్ లో తన వర్గానికి ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా యాజులును తప్పించి రామకృష్ణ అనే తన పాత కాపును తెచ్చి డెస్క్ ఇంఛార్జ్ గా నియమించారు. ఆయన వింత చేష్టలు డెస్క్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారాయట. అలాగే సబ్జెక్ట్ లేకుండానే అపర మేధావిగా చెలామణి అవుతున్న గమిడి శ్రీనివాస్ ను కో ఆర్డినేటర్ గా నియమించారు.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.
Friday, November 23, 2007
ఈనాడూ.. ఇదేం ధోరణి?

ఆర్తి విషయంలో మీడియా అతి

Friday, November 16, 2007
' సత్య ' వస్తుందా? రాదా?

'వార్త 'లా? ప్రకటనలా?

Tuesday, November 13, 2007
జర్నలిస్టుల అనైఖ్యత బట్టబయలు
Monday, November 5, 2007
అసెంబ్లీ నడవాలంటే ప్రత్యక్ష ప్రసారాలు రద్దు చేయాలి

Saturday, November 3, 2007
జెమిని న్యూస్ ఎడిటర్ గా సతీష్ బాబు..

రఘు కుమార్ ఔట్..
అవినీతి పరునిగా అపఖ్యాతి పాలైన రఘు కుమార్ జెమిని న్యూస్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశారు(?) తొలగింపబడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక న్యూస్ చానెల్ కు సహజంగా కార్యస్థానంలో ఎడిటర్ ఉండాలి. కాని రఘుకుమార్ హైదరాబాద్లో కాక చెన్నైలో ఉండి పనిచేసే వారు. నిజానికి హైదరాబాద్ నుండి ఎడిటై వచ్చే వార్తలను పెట్టుకోవడం తప్ప ఆయన చేసిన పనేంటో? రఘుకుమార్ జిల్లా రిపోర్టర్ పోస్టులను అమ్ముకున్నారని, ప్రతి నెలా జిల్లాల నుండి మామూళ్ళు దండుకునేవారని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మునిరాజు నాయకత్వంలో కొందరు రిపోర్టర్లతో కోటరీ ఏర్పాటు చెసుకున్నారనేది ప్రచారంలో ఉంది. రఘుకుమార్ వెళ్ళిపోతాడని ముందే తెలిసిన మునిరాజు మెల్లగా జెమిని నుండి జారుకున్నాడు. రఘుకుమార్ రాజీనామా తర్వాత ఈయన నియమించిన 'కరెప్ట్ నెట్ వర్క్' తమ భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది.
వారానికి ఐదు రోజులే..

Wednesday, October 24, 2007
జెమిని నుండి ఎన్-టీవీలో చేరిన ' హింసించే బూతురాజు '
'జెమిని న్యూస్ ' కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్న మునిరాజు ఈరోజు ఉదయమే ఎన్-టీవీలో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చెన్నై రఘుకుమార్ ప్రియ శిష్యుడైన మునిరాజు కొద్ది రోజులుగా అభద్రతాభావంతో జెమినిలో కొనసాగాడని అక్కడి వారు చెబుతున్నారు. అంతకు ముందు కో-ఆర్డినేటర్ గా ఉన్న మాధవ్ ని సాగనంపి మునిరాజ్ ను నియమించున్న జెమిని చెన్నై-హైదరాబాద్ యాజమాన్యాలు తాజా పరిణామానికి బిత్తరబోయాయి. రఘుకుమార్ ఏజంట్ గా హైదరాబాద్ కో-ఆర్డినేటర్ గా వచ్చిన మునిరాజు వచ్చిన రోజు నుండి తనకు గిట్టని వారిని వేదించటమే పనిగా పెట్టుకున్నాడు. తనకు పడని జిల్లా రిపోర్టర్ల వార్తల్ని తొక్కిపెట్టే వాడని ఆరోపణలు ఉన్నాయి. మునిరాజు ప్రవర్తనకు విసిపోయిన పలువురు జిల్లా, హైదరాబాద్ బ్యూరో రిపోర్టర్లు జెమినికి గుడ్ బై చెప్పేశారు. మునిరాజు గయ్యాలితనానికి ఎందరో రిపోర్టర్లు, డెస్క్ సిబ్బంది హడలిపోయేవారు . (ఎంతైనా రఘుకుమార్ మనిషి కదా) నోరు తెరిస్తే అలవోకగా బూతులు మాట్లాడే మునిరాజుకు 'పులకేశి ', 'హింసించే బూతురాజు ' అనే ముద్దు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జిల్లా రిపోర్టర్, స్ట్రింగర్ పోస్టులను అమ్ముకునే వాడనేది బహిరంగ రహస్యం. రంగారెడ్డి జిల్లా కీసర స్ట్రింగర్ పైన ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నా మునిరాజు నిర్లజ్జాగా డబ్బు తీసుకొని కొనసాగించాడని అంటారు. హైదరాబాద్ ఎల్లలైనా తెలియని మునిరాజును చెన్నై రఘుకుమార్ కో-ఆర్డినేటర్ గా పంపడమే ఒక వింత. మియాపూర్-బాలాపూర్ పక్కపక్కనే ఉంటాయనే అమాయకత్వంతో ఈ రెండు చోట్ల ఒకే రిపోర్టర్ని స్వల్ప వ్యవధితొ అసైన్మెంట్లు ఇచ్చి పంపే ఘనత ఆయనది. తన లీలలు బయటపడుతున్న కొద్దీ ఆందోళన పడ్డ మునిరాజు, కొద్ది రోజులుగా చెన్నై-హైదరాబాద్ మేనేజిమెంట్ల మద్య పోక చెక్కగా నలిగిపోయాడట. (మునిరాజు పై చాలా రోజులుగా 'ఎబౌట్ తెలుగు మీడియా'కు పిర్యాదులు వచ్చినా నిర్ధా రించుకోవడానికే ప్రచురించ లేకపోయాము. ఈ విషయంలో కొందరు మమ్మల్ని అపార్ధం చేసుకున్నారు, మేము ఎవరికి లొంగమని మరొకసారి వారికి తెలియజేస్తున్నాం)
నిరాశ పరచిన ' సూర్య '
తెలుగులో ఇప్పటికే ఉన్న దిన పత్రికలకు గట్టి పోటీ ఇస్తునందనుకున్నవారికి 'సూర్య ' నిరాశను మిగిల్చింది. సూర్య పత్రిక తొలి మూడు సంచికలు చూసిన వారు ఈ పత్రిక 'ఈనాడు 'కు కాదు కదా ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలకు కూడా పోటీ ఇవ్వలేదు అని అంటున్నారు. 'సూర్య ' మాస్ట్ హెడ్ మూసేసి చూస్తే అచ్చం 'ఆంధ్రజ్యోతి ' లానే కనిపిస్తుంది అని మరి కొందరంటున్నారు. సూర్య పేజీలన్నీ జ్యోతిలాగే కనిస్తున్నయి. నిజానికి ముద్రణలో జ్యోతే అందంగా కనిపిస్తోంది. తనదైన పాంట్స్ రూపొందించుకోవటంలో 'సూర్య ' విఫలమైందనే చెప్పవచ్చు. విజయదశమి తర్వాతి రోజున మార్కెట్ లోకి వచ్చిన 'సూర్య ' పట్ల ఏజంట్లు, హాకర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పత్రికను ఆలస్యంగా ఇచ్చారని కొందరు, అడిగినన్ని కాపీలు ఇవ్వలేదని మరి కొందరు ఆరోపిస్తున్నారు. తొలి రోజున తమకు గిప్ట్స్ ఇస్తామని చెప్పిన సూర్య మార్కెటింగ్ సిబ్బంది పత్తా లేకుండా పోయారని వారు విమర్శిస్తున్నారు. అన్నింటికన్నా పెద్ద జోక్ ఏమిటంటే 'సూర్య ' వెబ్ సైట్ అడ్రస్ పని చేయక పోవడం. http://www.suryatelugudaily.com/ లాగిన్ అయి చూస్తే ASTER WE INTEGRATED COMMUNICATIONS అనే సైట్ కనెక్ట్ అవుతోంది.
Thursday, October 18, 2007
మూడు ఛానెళ్ళ పెళ్ళి

కొసమెరుపు: శ్రీజ ఎంతో ఇష్టపడి తండ్రికి చిక్కకుండా పెళ్ళి చేసుకున్న శిరిష్ భరద్వాజ్ పై సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు వెలుగు చూడటం దురదృష్టకరం. 2002లో భరద్వాజ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది.
మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్
మాటీవీ న్యూస్ ఎడిటర్ గా హరిప్రసాద్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. భావనారాయణ రాజీనామా తర్వాత చాలా కాలం మాటీవీ న్యూస్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కొత్తగా ఎడిటర్ గా వచ్చిన హరిప్రసాద్ గతంలో ఈనాడు, ఈటీవీ, మన తెలుగు టీవీల్లో పని చేశారు. ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియాల్లో హరిప్రసాద్ కు అపార అనుభవం ఉంది.
'సత్య 'లో కరీం
టీవీ-9 ఫేం రిపొర్టర్ కం యాంకర్ కరీం 'టీవీ-ఐదూకు గుడ్ బై చెప్పి 'సత్య ' టీవీలో చేరినట్లు సమాచారం. టీవీ-ఐదులో తనకు నిర్దుష్టంగా ఎలాంటి బాధ్యత అప్పగొచకపోవటంపై కరీం అసంత్రుప్తితో ఉన్నట్లు చెబుకుంటున్నారు. ఓవరాక్షంకు మారుపేరైన కరీంపై ఇప్పటికే టీవీ-ఐదు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న కరీంకు చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కారణంగానే టీవీ-ఐదులో ఉద్యోగం వచ్చిందంటారు. అసలు ఆరంభం అవుతుందో లేదో తెలియని 'సత్య 'కు కరీం ఎలా ఉపయోగపడతాడో చూడాలి.

Thursday, October 11, 2007
మళ్ళీ మీడియా వ్యాపారంలోకి దాసరి

ఎవరిని ఎవరు ఎందుకు అనుకరిస్తున్నారు?

Tuesday, October 9, 2007
'కల నెరవేరెనులే.. ఇంటి జాగా దొరుకునులే..'

రామానుజం రాజీనామా.. ఎన్-టీవీలో మరో సంక్షోభం..

Saturday, October 6, 2007
'సూర్య ' ప్రకాశిస్తుందా?..

Friday, October 5, 2007
టీవీ-5.. 'టీవీ-ఐదు ' గా ఎందుకు మారింది?..

Wednesday, September 26, 2007
'కేబుల్' తో సన్ 'డిష్'యూం..

Thursday, September 20, 2007
అక్టోబర్ 2న 'టీవీ-5' ప్రారంభం

Wednesday, September 19, 2007
'జీ తెలుగు 'లో మా 'కర్మ '.. 'రాజ్ 24'కి రమణ..

'జెమిని ' లో రిపోర్టర్ల వలసలు ఆరంభం
ఇప్పటికే కెమరామెన్ల వలసలతో సతమతం అవుతున్న 'జెమిని న్యుస్ 'లో రిపోర్టర్ల రాజీనామాలు ఆరంభమయ్యాయి. సీనియర్ రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ తెలుగు 'లో చేరిపోయాడు. ఈయనను అకారణంగా డెస్క్ కు బదిలీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. జెమినిలో ఏకైక లేడీ రిపోర్టర్ అజిత కూడా 'టీవీ 5' చేరిపోయింది. మరో ముగ్గురు రిపోర్టర్లు కూడా ఇతర ఛానెళ్ళలో చేరటానికి అగ్రిమెంట్లు కుదిర్చుకున్నారని వినికిడి. అత్తెసరు జీతాలకు తోడు యాజమాన్య వేధింపులే ఈ రాజీనామాల పర్వానికి కారణమని చెబుతున్నారు. కొత్త ఛానెళ్ళలో మంచి జీతాలతో ఆఫర్లు వచ్చి పడుతుంటే ఇంకా ఫ్యూడల్ మెంటాలిటీ 'జెమిని 'లో పని చేయడం అర్ధం లేని పని అని రాజీనామా చేసిన ఒక రిపోర్టర్ అంటున్నారు. ఈ పరిస్థితికి కారకుడైన కో ఆర్డినేటర్ మునిరాజు సెలవుపై వెల్లిపోయాడు. ఆయనా కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాడని వినికిడి. ఇంత జరుగుతున్నా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. 'వెల్లే వారు వెల్లిపోనీ ఇంతకన్నా తక్కువ జీతాలకు పని చేయడానికి చాలా మంది వస్తారు ' అని యాజమాన్యం బాహాటంగా చెప్పుకుంటోందిట. 'వినాశ కాలే విపరీత బుద్ది ' అంటే ఇదేనేమో...
Monday, September 17, 2007
Thursday, September 13, 2007
ఎన్-టీవీకి కొమ్మినేని గుడ్ బై.. టీవీ-5లో చేరిక..
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కె.ఎస్.ఆర్) బుడ్ బై చెప్పారు. నరేంద్ర చౌదరి, రామానుజంలతో సరిపడక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యయంతో అట్టహాసంగా ప్రారంభమైన ఎన్-టీవీ ఆశించిన రీతిలో క్లిక్ కాకపోయేసరికి కొమ్మినేనిపై నరేంద్ర చౌదరి గుర్రుగా ఉన్నారని ఎన్-టీవీ వర్గాలు తెలిపాయి. ఇందుకు పూర్తిగా కొమ్మినేనినే బాధ్యున్ని చేయటంతో ఆయన మనస్థాపం చెందిని రాజీనామా చేశారని అంటున్నారు. మరో వాదన ప్రకారం కొమ్మినేని తెలుగుదేశం పక్షపాతి అయినందువల్లే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్-టీవీ ఆయన్ని వదిలించుకుందని అంటున్నారు. ఎన్-టీవీలో మంత్రి షబ్బీర్ అలీ కూడా భాగస్వామి అని వస్తున్న వార్తలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా కొమ్మినేని విషయంలో ఎన్-టీవీ యాజమాన్యం తొందర పడిందేమో? (లేక కొమ్మినేనే తొందర పడ్డారా?) 'న్యూస్ టైం' పత్రికను నడపడంలో విఫలమైన రామానుజం ఇక ఎన్-టీవీని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి. ఎన్-టీవీ నుండి బయటకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5లో చేరబోతున్నారు. ఎవరికి వారే బాసులుగా ఫీలయ్యే టీవీ-5లో కొమ్మినేని ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే. అసలు ప్రింట్ మీడియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి తప్పు చేశారేమో?.. జర్నలిజంలో తలపండిన మేధవిగా, రాజకీయ విశ్లేషకునిగా పేరొందిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-9, జెమిని న్యూస్ చర్చా వేదికల్లో పాల్గొని తన వాదనలతో అందరినీ మెప్పించారు. ఈ అనుభవంతో ఆయన తొందరపడి ఎలక్ట్రానిక్ మీడియాలో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలని ఆశపడి ఉంటారు. కాని 'గ్లామర్ ' ప్రపంచం ఆయన్ని గుర్తిస్తే కదా?.. చూద్దాం కొమ్మినేని టీవీ-5లో ఏ అద్భుతాలు సృష్టిస్తారో..
Saturday, September 8, 2007
' స్టింగ్ ' పరేషాన్..

జెమినిలో కక్ష సాధింపు బదిలీలు?

Wednesday, September 5, 2007
కళానిధి మారన్ జీతం రూ. 23,26,00,000/- .. సరే మరి జెమిని ఉద్యోగుల జీతాల మాటేమిటి?..

జెమిని నుండి వలసలు
జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు వలసలు ఉదృతం అయ్యాయి. జీతాలు చాలక వెళ్ళి పోతున్న వారి విషయంలో లోకల్ మేనేజిమెంట్ చేతులెత్తేసినట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోనుంది. కొత్త వారిని చేర్చుకునే విషయంలో సన్ యాజమాన్యం మీన మేషాలు లెక్కించడం ఆశ్చర్యకరం. ఇక్కడి దరిద్రపు జీతాలకు ఎవరొస్తారు?
Sunday, September 2, 2007
టీవీ-5లో కరీం

ఆధ్యాత్మిక ఛానెళ్ళ అవసరం ఉందా?

ఎన్-టీవీది మూడో స్థానమేనా?..

Wednesday, August 29, 2007
అనైతికం అనవచ్చా?..

గొట్టాల కొట్లాట

కొత్త పదాలు : గొట్టంగాళ్ళు = ఎలక్ట్రానిక్ మీడియా, పోటుగాళ్ళు = ప్రింట్ మీడియా
Sunday, August 26, 2007
టీవీ-9లో మాధవ్.. అవాక్కయ్యారా?..

కొసమెరుపు: మాధవ్ టీవీ-9లో చేరటం వల్ల రవిప్రకాశ్ క్రెడిబిలిటీ పెరిగినట్టే కదా..
Wednesday, August 22, 2007
జెమిని న్యూస్ బ్యురొచీఫ్ కానున్న 'అవినీతి సామ్రట్'

'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారంతా ప్రచారంలో ఉన్న ఒక వార్త విని షాక్ తిన్నారు. ఈ వార్త లేదా వదంతి జెమిని వర్గాలను కూడా కలవర పరుస్తోంది. 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా ఆ చానెల్లోనే బిజినెస్ రిపోర్టర్ గా పని చేస్తున్న స్టెర్జీ రాజన్ ని నియమించాలని సన్ యాజమాన్యం నిర్ణయించిందట(?) బిజినెస్ రిపోర్టింగ్ ముసుగులో స్టెర్జీ పాల్పడే అవినీతిని మీడియా వర్గాలు కథలు, కథలుగా చెబుకుంటాయి. ఒక్కో వార్తకు ఆయన 2-5 వేల దాకా తీసుకుంటాడు. వార్తా క్లిప్పింగ్లపై వచ్చే ఆదాయం అధనం. ఈ ఆదాయం అంతా ఆయన వ్యక్తిగత, రహస్య ఖాతాలో జమ అవుతుంది. స్టెర్జీ జెమిని నుండి వచ్చే జీతం అంతగా ఖర్చు పెట్టడు. ఈ విషయం ఆయన సాలరీ అకౌంట్ గమనించి నిర్ధారించు కోవచ్చు. బిజినెస్ న్యూస్ ద్వారా జెమిని సంస్థకు దమ్మిడి ఆదాయం ఉండదు. కానీ స్టెర్జీ రాజన్ వ్యక్తిగత ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తున్నాయి. జెమిని సంస్థకు ఒక్క యాడ్ రికమెండ్ చేయక పోగా వ్యాపార, కార్పోరేట్ సంస్థలకు జెమినిలో ఉచిత ప్రచారం కల్పిస్తాడీయన (తన జేబుకు గిట్టు బాటైతే చాలు). బిజినెస్ న్యూస్ తో పాటు స్టెర్జీ అధనపు బాధ్యతలు చూస్తున్న సిటిలైట్ ప్రోగ్రాంలో తరచూ ఆయన కుటుంబ సభ్యులు కనిపిస్తుంటారు. బిజినెస్ ప్రెస్ మీట్లకు కూడా కుటుంబ సభ్యులను తీసుకెలతాడని వినికిడి. ఇలాంటి కళాకారున్ని సన్ యాజమాన్యం ఏకంగా 'జెమిని న్యూస్' బ్యూరో చీఫ్ గా నియమిస్తే ఎంత 'ఛీప్'గా ఉంటుందో ఆలోచించండి. దొంగ చేతికి తాలం ఇచ్చినట్లే.. బ్రహ్మాండంగా చానెల్ను మార్కెట్ చేసి పడేస్తాడు (అమ్ముకుంటాడు) కదూ..
సంచలనాలకు కేంద్రం కానున్న ఎన్-టీవీ

తెలుగు నాట నరేంద్ర చౌదరి ఆరంభిస్తున్న ఎన్-టీవీ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఎన్-టీవీ ఎలక్ట్రానిక్ మీడియాలో సరికొత్త ప్రయోగం కానుంది. అత్యున్నత ప్రమాణాలతో వస్తున్న ఈ చానెల్ ఈటీవీ, టీవీ-9లకు గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పవచ్చు. వార్తా సేకరణ కోసం విస్తృతంగా ఓబీ వాన్లను రంగంలోకి దింపుతున్న ఎన్-టీవీ, జిల్లా రిపోర్టర్లకు 'లాప్ టాప్'లను ఇస్తోంది. వీటి ద్వారా స్పాట్ నుండే 3ఎంబి లైన్లో ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని లైవ్ గా ఇస్తారట. ఎన్-టీవీ వేగాన్ని తట్టుకునేందుకు ఈటీవీ, టీవీ-9 ఇదే మార్గంలో వెల్లక తప్పదు. ఆగస్ట్ 30 తేదీన ఎన్-టీవీ, భక్తి టీవీ చానెళ్ళు లాంచ్ అవుతున్నాయి.
Wish you all the best NTV team..
Monday, August 20, 2007
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇక లేనట్లేనా?..

ఇళ్ళ స్థలాల కోసం ఆశగా చూస్తున్న జర్నలిస్టుల ఆశలపై నీరు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసు సాకుతో ప్రభుత్వం ఇన్ని రోజులుగా పెండింగ్ పెడుతూ వచ్చిన ఈ సమస్యను ఇక పట్టించుకోక పోవచ్చు. కేంద్రంలోని పరిణామాలను గమనిస్తే ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అప్పుడు ఎన్నికల కోడ్ సాకుగా చూపి మరి కొన్ని నెలలు ఇళ్ళ స్థలాల సమస్యను పెండింగ్ పెడతారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాల్లో, ప్రభుత్వం పాలనా విధుల్లో బిజీగా ఉంటుంది. ఆలోగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడతాయి. ఇక జర్నలిస్టులకు ఇంటి జాగాలు ఇచ్చేదెపుడు? ఏ ప్రభుత్వానికైనా జర్నలిస్టు కరివేపాకు లాంటి వాడే. తెలుగు దేశమైనా, కాంగ్రెసైనా జర్నలిస్టులను అవసరం ఉన్నంత వరకే వాడు కుంటారు. ప్రభుత్వంలో పైరవీలు చేసుకొనే వారికే బినామీగా ఇళ్ళూ, భూములు వచ్చి పడతాయనేది బహిరంగ రహస్యం. వైఎస్ ప్రభుత్వం కొంత నయం కనీసం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఆలోచించింది. కానీ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులు ఇంటి జాగాలపై ఆశలు వదులు కోవలసిందే. టిడిపి ప్రభుత్వం మీడియా యాజమాన్యాలకు తప్ప జర్నలిస్టులకు చేసిందేమి లేదు (కొద్ది మందికి మినహా). పత్రికా స్వాతంత్రం అంటే మీడియా యజమానుల వ్యాపారాలకు ఇబ్బంది కలగ రాదేది వారి ఉద్దేశ్యం. వైఎస్ ప్రభుత్వం ఇంకా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వక ముందే ఇచ్చేసినట్లు గవర్నర్ కు ఇచ్చిన ఒక ఫిర్యాదులో టిడిపి ప్రచారం చేసింది.
జర్నలిస్టులూ, నేతలు ఇకనైనా తొందర పడకపోతే ఇంటి జాగాలు ఒక జీవిత కాలం లేటనే వాస్థవాన్ని గ్రహించాలి..
జర్నలిస్టులూ, నేతలు ఇకనైనా తొందర పడకపోతే ఇంటి జాగాలు ఒక జీవిత కాలం లేటనే వాస్థవాన్ని గ్రహించాలి..
Saturday, August 18, 2007
ఆశ బారెడు.. పీక సన్నం.. 'టీవీ-5'
ప్రారంభం అయితే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఫీల్డ్ లో 'టీవీ-5' చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మారుతీ ఓమ్నీకి డమ్మీ డిష్ పెట్టుకొని నగర వీధుల్లో పరుగులు తీస్తున్న టీవీ-5 బృందం ఇప్పటికే నడుస్తున్న చానళ్ళ కన్నా ఎక్కువ హడావుడి చేస్తున్నారు. వారి నిబద్దతను తప్పు పట్టలేం కానీ ఈ చానెల్ ఫీల్డ్ లో ఎంత వరకు తట్టుకొని నిలబడగలదన్నదే ప్రశ్న. టీవీ-5లో అంతగా పేరున్న జర్నలిస్టులు కనిపించడం లేదు. అంతగా అనుభవం లేని వారినే రిపోర్టర్లుగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ లోపాన్ని పూరించడానికా అన్నట్లు టీవీ-5 యాజమాన్యం టీవీ-9 మాజీలు కరీం, రాజశేఖర్ లను తీసుకుంటున్నట్లు వినికిడి. వీరిద్దరూ ఎలాంటి స్కామ్లలో ఇరుక్కొని టీవీ-9నుండి తొలగించబడ్డారో మీడియా మిత్రులందరికీ తెలుసు. అసలు టీవీ-5 అనే పేరు చానెల్ కు ఎంత వరకూ నప్పుతుందంటారు? వారేదో 'తిండి, బట్టా, గూడూ..' అనే సిద్దాంత చెబుతున్నా.. టీవీ-9కి కాపీ లాగే కనిపిస్తోంది. ఇలాంటి ఆశయాల సాధన కోసం స్వచ్చంద సంస్థ నడుపుకోవచ్చు కదా? చానెల్ ఎందుకు? టీవీ-5 పేరిట ఇప్పటికే ప్రపంచంలో పలు భాషల్లో చానెళ్ళు ఉన్నాయి. ఇక జీతాల సంగతికొస్తే జెమిని సిబ్బంది కన్నా బెటరే.. జర్నలిస్టుల ఉపాధి కోసమైనా ఇలాంటి చానెళ్ళు ఉండటం అవసరం.
Friday, August 17, 2007
జెమిని ఢిల్లీ రిపోర్టర్ 'ధనార్జన్ '
అందరూ ఊహించినట్లే జెమిని ఢిల్లీ రిపోర్టర్ గా చందు జనార్ధన్ చేరిపోయాడు. ఈ పోస్ట్ కోసం జనార్ధన్ ఎడిటర్ రఘుకుమార్ కు బాగానే చెల్లించుకున్నాడని మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. పైరవీలకు పేరుగాంచిన జనార్ధన్ వసూళ్ళలో ఘనాపాటి. ఎలక్ట్రానిక్ మీడియాకు సోకాల్డ్ ప్రసిడెంట్ గా చెలామని అవుతున్న జనార్ధన్ కు ఈ పోస్ట్ ఇప్పించడంలో రఘుకుమార్ ప్రియ శిష్యుడు హైదరాబాద్ కో ఆర్డినేటర్ మునిరాజు మధ్యవర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రఘుకుమార్ కు డిల్లీ నుండి కూడా గిట్టుబాటు అవుతుందన్న మాట. తొలగించ బడ్డట్టే ప్రచారం జరిగి ఏ మాయతోనో తిరిగి ఎడిటర్ గా సిఫార్స్ చేయించుకున్న రఘుకుమార్ బుద్ది ఇంకా మార లేదని జెమిని వర్గాలు చెబుతున్నాయి.
దేవుడా జెమిని న్యూస్ ను రక్షించ లేవా?..
దేవుడా జెమిని న్యూస్ ను రక్షించ లేవా?..
Wednesday, August 15, 2007
ఖబడ్దార్ హాకర్స్..
తెలుగు మీడియాకు సంబందించిన సమాచారాన్ని తోటి జర్నలిస్టులతో పంచుకోవడానికి వేదికైన 'ఎబౌట్ తెలుగు మీడియా'ను హాక్ చేయడానికి కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించినట్లు పసిగట్టాం. సదరు హాకర్లు ఈ బ్లాగ్ లోని కొన్ని తాజా వార్తల్ని తొలగించారు. వారెవరో మాకు తెలిసిపోయింది. వారి ఆటలు ఇకపై సాగవని గ్రహిస్తే మంచిది.
ఖబడ్దార్ హాకర్స్..
ఖబడ్దార్ హాకర్స్..
Tuesday, August 7, 2007
ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం దౌర్భాగ్యం..
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రస్తుతం ఒక సంఘమనేది ఉందా? ఉంటే ఏంచేస్తోంది? శైలేశ్ రెడ్డి పై అసంతృప్తితో పోటీ సంఘాన్ని పెట్టి దానికి జనార్ధన్ అనే సీ చానెల్ బ్యూరోచీఫ్(ఇప్పుడు మాజీ) ను ప్రసిడెంట్ గా పెట్టిన పెద్ద మనుషులు ఇప్పుడేం చేస్తున్నారు? ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘంగా చెప్పుకునే నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పైరవీలు చేసుకోవడం తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నదేమీలేదు. ఇళ్ళ స్థలాల పేరిట తరచూ మభ్యపెడుతుండే ఈ సంఘం జర్నలిస్టుల కోసం ఒక్క శిక్షణా శిభిరమైనా నిర్వహించిన పాపాన పోలేదు. సదరు అధ్యక్షుల వారు సీ చానల్ నుండి తొలగింపబడి కొత్త చానళ్ళలో అవకాశాల కోసం తిరుగుతున్నారు. జెమిని బ్యూరో చీఫ్ గా వెల్లుతున్నానని బయట చెప్పుకుంటున్నాడట(?) జనార్ధన్ అధ్యక్షతన ఏర్పడ్డ ఈ పోటీ సంఘానికి రెండున్నర ఏళ్ళవుతున్నా ఎన్నికలు జరపలేదు. అంటే జనార్ధన్ జీవిత కాల అధ్యక్షుడుగా ఉండాలని సోకాల్డ్ పెద్దలు కోరుకుంటున్నారా?
మరోవైపు చక్కని కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కెమెరామెన్ల సంఘం ఇటీవలే ఎన్నికలు జరుపుకుంది. వీరిని చూసైనా జర్నలిస్టుల సంఘం బుద్ది తెచ్చుకోవడం మంచిది.
మరోవైపు చక్కని కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కెమెరామెన్ల సంఘం ఇటీవలే ఎన్నికలు జరుపుకుంది. వీరిని చూసైనా జర్నలిస్టుల సంఘం బుద్ది తెచ్చుకోవడం మంచిది.
ఎన్ టీవీలో సం'కుల ' సమరం
ఇంకా ప్రారంభమైనాకాలేదు అప్పుడే ఎన్ టీవీలో వర్గ పోరాటాలు ప్రారంభమైనాయి. రామానుజం-కొమ్మినేని-మూర్తి త్రయంల అంతర్గత పోరాటం వెగటు పుట్టిస్తోంది. బ్రాహ్మణ-కమ్మ రాజకీయాల నడుమ సిన్సియర్ జర్నలిస్టులు నలిగి పోతున్నారు. తాజాగా మూర్తి(మాజీ ఈటీవీ) కొమ్మినేని వర్గంతో తగాదా పెట్టుకొని సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. బహుషా మూర్తి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఎన్ టీవీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అటు కొమ్మినేని ఇటు రామానుజం 'ఇతర ' అవకాశాలు వెతుక్కుంటున్నారనే వదంతులున్నాయి.
Saturday, August 4, 2007
జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ తొలగింపు..
జెమిని చీఫ్ న్యూస్ ఎడిటర్ రఘుకుమార్ కు సన్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. రఘుకుమార్ పై అవినీతి ఆరోపనల నేపధ్యంలో తొలగించక తప్పలేదు. అయితే రఘుకుమార్ తానే రాజీనామా చేశానని చెప్పుకుంటున్నారు. జెమిని వార్తా విభాగం దుస్తితికి రఘుకుమార్ చేయాల్సినంత కృషి చేశారు. జిల్లా రిపొర్టర్ల నుండి ఈయన బాగానే దండుకున్నారనే ఆరోపనలు ఉన్నాయి. రిపోర్టర్ పోస్టుల్ని రఘుకుమార్ అమ్ముకునేవారని జెమిని వర్గాలు చెవులు కొరుక్కుంటాయి. రఘుకుమార్ తన ఇంట్లో పెళ్ళికి జిల్లా రిపోర్టర్ల నుండి భారీగా వసూలు చేశాడంటారు. ఈయన చీఫ్ ఎడిటర్ కాగానే పలు జిల్లా రిపోర్టర్లను తొలగించి తన అనుయాయుల్ని, డబ్బు దండిగా ఇచ్చిన వారిని పెట్టుకున్నారని ఆరోపనలు ఉన్నాయి. తాగిచ్చే రిపోర్టర్లంటే బాగా ఇష్టపడతాడు. చెన్నై కేంద్రంగా పని చేసే రఘుకుమార్ కు హైదరాబాద్ బ్యూరోతో పెద్దగా పరిచయం లేకపొవడం ఆశ్చర్యకరమైన విశయం. హైదరాబాద్ కు వచ్చినప్పుడల్ల హొటల్లో విడిది చేసి తన వర్గం రిపోర్టర్లతో విందు వినోదాలతో గడిపి వీలుంటే చుట్టపు చూపుగా జెమిని న్యూస్ ఆఫీస్ కి వెలతాడు. రఘుకుమార్ తొలగింపుతో 'జెమిని'కి పట్టిన గ్రహణం కొద్దిగా తొలగిందనే చెప్పవచ్చు.
రఘుకుమార్ ఉధ్వాసన వాసన ముందుగానే పసిగట్టిన ఆయన విశ్వసనీయ చీఫ్ సబ్ ఎడిటర్ వాసుదేవన్ చాలా రోజుల ముందే లాంగ్ లీవ్ పెట్టి కొత్త ఉద్యోగ వేటలో పడ్డాడని జెమిని వర్గాల కథనం. ఈ పాటికే ఆయనకు కొత్త ఉద్యోగం వచ్చి ఉండవచ్చు. పాపం రఘుకుమార్ ప్రియతముడైన హైదరాబాద్ న్యూస్ కోఆర్డినేటర్ మునిరాజు భవిశ్యత్తు కాలమే తేలుస్తుంది. ('మీడియా అబ్జర్వర్ 'కు ప్రత్యేక ధన్యవాదాలు)
మరికొన్ని జెమిని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి "ఎబౌట్ తెలుగు మీడియా"
రఘుకుమార్ ఉధ్వాసన వాసన ముందుగానే పసిగట్టిన ఆయన విశ్వసనీయ చీఫ్ సబ్ ఎడిటర్ వాసుదేవన్ చాలా రోజుల ముందే లాంగ్ లీవ్ పెట్టి కొత్త ఉద్యోగ వేటలో పడ్డాడని జెమిని వర్గాల కథనం. ఈ పాటికే ఆయనకు కొత్త ఉద్యోగం వచ్చి ఉండవచ్చు. పాపం రఘుకుమార్ ప్రియతముడైన హైదరాబాద్ న్యూస్ కోఆర్డినేటర్ మునిరాజు భవిశ్యత్తు కాలమే తేలుస్తుంది. ('మీడియా అబ్జర్వర్ 'కు ప్రత్యేక ధన్యవాదాలు)
మరికొన్ని జెమిని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి "ఎబౌట్ తెలుగు మీడియా"
Sunday, July 29, 2007
బురద చల్లం కానీ ఉతికేస్తాం..
అతి కొద్ది సమయంలోనే 'ఎబౌట్ తెలుగు మీడియా' పాపులర్ కావడం మాకు సంతోశాన్నిస్తోంది. ఈ సందర్భంగా మా బ్లాగ్ వీక్షకులకు ఒక విశయాన్ని మనవి చేయదలచుకున్నాం.. మీడియాలో మాకు గిట్టని వర్గాలను టార్గెట్ చేసుకొని బురద చల్లడం మా అభిమతం కాదు.. అలాగని జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోం.. మీడియాలో చోటు చేసుకునే పరినామాలను, మంచీ-చెడులను నలుగురితో పంచుకునేందుకే ఈ బ్లాగ్ ఏర్పాటు చేశాం.. జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను (తోటి జర్నలిస్టులతో కూడా) ఎదిరించడం మా ప్రధాన లక్ష్యం. వ్యక్తిగత నిందలకు మేం దూరం.. అయితే జర్నలిస్టులకు ద్రోహం చేస్తున్నవారిని చూస్తూ ఊరుకోం.. రాతలతో తగిన విధంగా వాతలు పెడతాం.. ఈ పోరాటం మా ఒక్కరిదే కాదు.. జర్నలిస్టులందరిది.. మాకు ఆశీసుల్లందించండి.
మీ వద్ద ఉన్న సమాచారాన్ని మాకు రెండు మార్గాల ద్వారా అందించ వచ్చు. ప్రతి వార్త కింద ఉండే comments ని క్లిక్ చేసి పంపవచ్చు. లేదా atmap@rediffmail.com కి మెయిల్ చేయండి.
మీ వద్ద ఉన్న సమాచారాన్ని మాకు రెండు మార్గాల ద్వారా అందించ వచ్చు. ప్రతి వార్త కింద ఉండే comments ని క్లిక్ చేసి పంపవచ్చు. లేదా atmap@rediffmail.com కి మెయిల్ చేయండి.
శర్మకు శత్రువులెందుకు?
తెలుగు మీడియా బ్లాగులాలో మంచికో, చెడుకో అందరికన్నా ఎక్కువగా కనిపించే పేరు శర్మదే అంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. జర్నలిస్టుల్లో అవినీతిపరులకు కొదవలేదు. అయితే అందరూ శర్మ వెంట ఎందుకు పడుతున్నారు? మీడియాలో శర్మకు మిత్రులు చాలా తక్కువ. ఉన్నా బయట పడరు. ఏ జర్నలిస్టుకు లేనంతగా ఆయనకు శత్రువులున్నారు. ప్రతి ఒక్కరితో తగాదాలు పెట్టుకోవడం, అందరినీ అనుమాన దృష్టితో చూడటమే ఇందుకు కారణం. అందుకే మీడియా బ్లాగులకు ఆయన టార్గెట్ అయ్యాడు. శర్మ ఇకనైనా తన పద్దతులు మార్చుకుంటే సమాజానికి, ముఖ్యంగా మీడియాకు మంచిది..
కొసమెరుపు: అందరు అనుకుంటున్నట్లుగా శర్మ మాటీవీకి ఇంకా రాజీనామా చేయలేదు. స్పెషల్ కరస్పాండెంట్ హోదాలో ఆఫీస్లోనే ఒక మూల కూర్చొని కాలక్షేపం చేస్తున్నడని మాటీవీ వర్గాల భోగట్టా. జెమినిలో ఢిల్లీ రిపొర్టర్ పోస్టు కోసం ప్రయత్నాలు మాత్రం జోరుగా జరుపుతున్నాడని తెలిసింది.
కొసమెరుపు: అందరు అనుకుంటున్నట్లుగా శర్మ మాటీవీకి ఇంకా రాజీనామా చేయలేదు. స్పెషల్ కరస్పాండెంట్ హోదాలో ఆఫీస్లోనే ఒక మూల కూర్చొని కాలక్షేపం చేస్తున్నడని మాటీవీ వర్గాల భోగట్టా. జెమినిలో ఢిల్లీ రిపొర్టర్ పోస్టు కోసం ప్రయత్నాలు మాత్రం జోరుగా జరుపుతున్నాడని తెలిసింది.
Thursday, July 26, 2007
మాటీవీ జీతాలు పెరిగాయి.. బ్యూరోచీఫ్..సత్యనారాయణ
ఎట్టకేలకు మాటీవీ న్యూస్ సిబ్బంది జీతాలు పెరిగాయి. 50 నుండి 100 శాతం దాకా పెరిగిన వేతనాలు 'మా' జర్నలిస్టులకు ఆనందాన్ని కలిగించాయి. పెరుగుదల ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మాటీవీలో ఇతర డిపార్ట్ మెంట్ల సిబ్బందికి గతంలోనే వేతనాలు పెంచారు. న్యూస్ వారికి జీతాల పెరుగుదలో జాప్యం వల్ల ఎన్నో అపోహలు, వదంతులు వినిపించాయి. ఈ కారణంగానే భావనారాయణ రాజీనామా ఇచ్చిన విశయం అందరికి తెలిసినదే..
మాటీవీ బ్యూరోచీఫ్ గా ఎవరు రానున్నరనే ఊహాగానాలకు తెరదించుతూ మాటీవీ డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్ సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు.
మాటేవీ జర్నలిస్టుల జీతాలు భారీగా పెరగటం జెమిని ఉద్యోగులకు ఇబ్బందిని కలిగించింది. పాపం వారు ఇంతకన్నా చేయగలిగేది ఏం ఉంటుంది. మతిలేని యాజమాన్యాన్ని నిందించుకోవడం తప్ప..
మాటీవీ బ్యూరోచీఫ్ గా ఎవరు రానున్నరనే ఊహాగానాలకు తెరదించుతూ మాటీవీ డెస్క్ సీనియర్ సబ్ ఎడిటర్ సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు.
మాటేవీ జర్నలిస్టుల జీతాలు భారీగా పెరగటం జెమిని ఉద్యోగులకు ఇబ్బందిని కలిగించింది. పాపం వారు ఇంతకన్నా చేయగలిగేది ఏం ఉంటుంది. మతిలేని యాజమాన్యాన్ని నిందించుకోవడం తప్ప..
Saturday, July 21, 2007
గొర్రెతోక బెత్తెడు..జెమిని జీతం..
ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యంత నికృష్ట జీతాలు ఇచ్చే సంస్థగా 'జెమిని ' పేరు తెచ్చుకుంది. లోకల్ కేబుల్ చానళ్ళలో కూడా అంత తక్కువ వేతనాలు ఉండవేమో. విలసాల కోసం డబ్బును మంచినీరులా ఖర్చు చేసే సన్-జెమిని యాజమాన్యం జర్నలిస్టులకు మంచి జీతాలు ఇచ్చే విషయంలో కక్కుర్తి పడుతోంది. వార్తా సేకరణ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొన్నట్లు చెప్పుకునే సన్ యాజమాన్యం తన గ్రూప్ లో అత్యంత ప్రధానమైన జెమిని న్యూస్ ఉద్యోగులకు కడుపు నిండా తిండి పెట్టే జీతాలు మాత్రం ఇవ్వదు. ఒకవైపు కొత్తగా వస్తున్న చానళ్ళు మంచి జీతాలు అఫర్ చేస్తుంటే సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఇప్పటికే 75 శాతం ఉద్యోగులు సంస్థను వదిలిపోయినా సన్-జెమిని యాజమాన్యంలో చలనం లేదు. కెమెరామెన్ల జీతాలయితే మరీ ధారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ స్ట్రింగర్లకు చేరి మూడేళ్ళయినా ఇంత వరకు రెమ్యునరేషన్ ఇవ్వక పోవడంతో పైరవీలు చేసుకొని పొట్టనింపుకుంటున్నారు. కొత్తగా తీసుకుంటున్న సిబ్బందికి పాతవారికన్నా ఎక్కువ జీతాలు నిర్నయించడంతో సీనియర్లు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో నిమగ్నమైనారు. పే-ఛానల్స్ రూపంలో రాష్ట్రం నుండి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న తమిళ సన్ యాజమాన్యం తమ తెలుగు ఛానల్ జెమిని ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వకపోవడం ధారుణం. ఏడాది కాలంగా ఊరిస్తూ ఇటీవలే పెంచిన్ జీతాలపై ఉద్యోగులంతా అసంత్రుప్తితో ఉన్నారు. పెరిగింది గొర్రెతోకంతే.. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాక నగరంలో, శివారు ప్రాంతంలో అద్దెలు రెండింతలైనాయి. ఈ పరిస్తుతుల్లో జెమిని ఉద్యోగులు నగరంలో బతకలేని పరిస్తితులు ఏర్పడ్డాయి.
( జెమిని జీతంతో బతకలేక కొత్తగా రానున్న ఛానల్లో చేరిన జర్నలిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా )
( జెమిని జీతంతో బతకలేక కొత్తగా రానున్న ఛానల్లో చేరిన జర్నలిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా )
Thursday, July 19, 2007
కొత్త పత్రికల భవిశ్యత్తు ఏమిటి?
సాక్షి, సూర్య పత్రికలపై మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 'ఆ' రెండు పత్రికలకు పోటీగా వస్తున్న ఈ పత్రికలు జర్నలిస్టులకు జీతాలు పెద్ద మొత్తంలో ఎర వేస్తున్నాయి.. ఈ విశయంలో జర్నలిస్టులంతా హాపీగానీ ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అండ దండలతో వస్తున్న ఈ పత్రికల భవిశ్యత్తు ఏమిటి అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రెండేళ్ళ తర్వాత కర్మగాలి కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతే పరిస్తితి ఏమిటి?. వై.ఎస్. సర్కారు ఇప్పుడు ఈనాడును ముప్పుతిప్పలు పెడుతున్నట్లే తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి, సూర్యల పని పట్టదా?. ఆమెన్ పాపము శమించు గాక.. జర్నలిస్టు ఎక్కడ పని చేస్తున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం.. కాని అధిక జీతాలకు ఆశ పడి తొందర పాటు నిర్నయాలు తీసుకోవద్దనే మా సలహా..
Wednesday, July 18, 2007
'మా' శర్మ ఔట్.. 'జెమిని 'లో పైరవీలు..
మాటీవీ బ్యూరో చీఫ్ రాజేశ్వర్ శర్మ ఆ సంస్థకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 'మా' కర్మగా పేరు తెచ్చుకున్న శర్మ అవమానకర పరిస్తితుల్లో విధులకు డుమ్మ కొట్టాల్సివచ్చింది. ప్రతి ఒక్కరిని అనుమాన దృష్టితో చూసే శర్మ శాడిజానికి విసుగెత్తిన రిపోర్టర్లంతా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. శర్మ అవినీతి వ్యవహారాలను తెలుసుకున్న 'మా' యాజమాన్యం ఆయన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గా రివర్ట్ చేసింది. దీన్ని ఎంతో అవమానంగా భావించిన శర్మ ఆ 'మా' నుండి వైదొలగాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. వెలుతూ వెలుతూ శర్మ అందరికి మిఠాయిలు పంచాడట. శర్మను సాగనంపటంలో 'విస్సా శ్రీధర్ ' పాత్ర ఉందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజేశ్వర్ శర్మ తన మాతృ సంస్థ 'జెమిని ' కి బ్యూరోచీఫ్ గా వెల్లేందుకు చెన్నై వెళ్ళి పైరవీలు చేస్తున్నాడు. ఇక జెమినిన్యూస్ సిబ్బందిని ఆ దేవుడే కాపాడాలి. పూర్వాశ్రమంలో జెమిని రిపోర్టర్లు కూడా కర్మ బాధితులే..
Subscribe to:
Posts (Atom)