Wednesday, September 19, 2007

'జీ తెలుగు 'లో మా 'కర్మ '.. 'రాజ్ 24'కి రమణ..

'జీ తెలుగు ' లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 'మా టీవీ'కి రాజీనామా చేసిన రాజేశ్వర్ శర్మ 'జీ'లో చేరి పోయాడు. ఇంత కాలం జీ తెలుగులో కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న ఎంవి రమణ 'త్వరలో రాబోతున్న 'రాజ్ 24' ఛానెల్ కి ఇన్ పుట్ ఎడిటర్ గా వెళ్ళి పోయాడు. సాలరీ ఏకంగా రూ.40 వేలని వినికిడి. ఇక జెమిని టీవీ క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ 'జీ'లో చేరి పోయాడు. 'జీ'లోనే సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్న సతీశ్ కమాల్ ను డెస్క్ కు బదిలీ చేశారు. ఇదిలా ఉంచితే మాటీవీలో అందరితో గొడవ పెట్టుకొని వెలివేతకు గురై 'మా కర్మ ' గా పేరొందిన రాజేశ్వర్ శర్మకు 'జీ తెలుగు 'హెడ్ శైలేశ్ రెడ్డి ఎలా అవకాశం ఇచ్చారో? శర్మ అక్కడైనా బుద్దిగా పని చేస్తాడని ఆశిద్దాం...