Thursday, July 3, 2008

వేతనాలు పెంచి సాక్షికి పోటీగా నిలిచిన టీవీ-9

టీవీ-9 తన సిబ్బందికి భారీగా వేతనాలు పెంచింది. అంతా ఇంతా కాదు.. 100 నుండి 300 శాతం దాకా. నిజానికి టీవీ-9 మొదటి నుండీ వేతనాల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. 2003లో టీవీ-9 రాకముందు తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చాలా అధ్వానమైన జీతాలు ఉండేవి. తెలుగు జర్నలిస్టులకు అమ్మాయిలను ఇవ్వడానికి వెనుకాడేవారు. టీవీ-9 ప్రారంభంలోనే ఐ.టి., కార్పోరేట్ స్థాయి వేతనాలు ఇచ్చి తెలుగు జర్నలిస్టుల విలువ పెంచింది. ఇతర చానెళ్ళు, పత్రికలు ఇదే బాటలో నడవక తప్పలేదు. ఆ తర్వాత సాక్షి దిన పత్రిక ప్రింట్ జర్నలిస్టులకు ఇదే రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాలోకి కూడా అడుగిడిన సాక్షి అనూహ్య జీతాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఇతర చానెళ్ళు ఉలిక్కి పడ్డాయి. తన జర్నలిస్టుల వలసల్ని నివారించడంలో భాగంగా టీవీ-9 కూడా అదే బాటను ఎంచుకొని సాక్షికి ఎదురు సవాల్ విసిరింది. ఇతర ఛానెళ్ళు కూడా ఈ సవాల్ని స్వీకరిస్తాయేమో చూడాలి మరి. పెరుగుడ విరుగుట కొరకే అన్న నానుడి తెలుగు జర్నలిస్టుల విషయంలో నిజం కావద్దని ఆశిద్దాం. ఎందుకంటే ఆర్ధిక మాద్యం - ద్రవ్యోల్బనం ఊబిలో చిక్కిన అమెరికాలో పత్రికలు, చానెళ్ళు తమ సిబ్బందిని తగ్గించుకోవడమే కాక వేతనాలకు కోత పెడుతున్నాయట.

Tuesday, July 1, 2008

' ధనార్జన ' రాజకీయాలు

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వెగటు కలిగిస్తున్నాయి. చందూ జనార్ధన్ తనకు తాను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు టీవీల్లో స్క్రోలింగ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకునే సరికి జర్నలిస్టు సోదరులంతా అవాక్కయ్యారు. అసలు ఎన్నిక ఎప్పుడు జరుగింది? ఎన్నుకున్నది ఎవరు? ఇదే విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా సంఘ సభ్యులు నిలదీసే సరికి జనార్ధన్ క్షమాపణలు చెప్పుకున్నడట. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఆంధ్రజ్యోతి ఎపిసోడ్లో భవిష్యత్తు పోరాటంపై చర్చించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా సంఘం సమావేషమైంది. ఆ సమావేశానికి వచ్చిన జనార్ధనుడు అసలు ఈ సంఘానికి తానే అధ్యక్షున్నని, తాను ఉద్యోగ రీత్యా ఢిల్లీ పోయినప్పుడు తనకు తెలియకుండా హరిప్రసాద్ ఎన్నుకున్నారని గొడవ పడ్డాడు. తనను కనీసం గౌరవ అధ్యక్షునిగానైనా నియమించాలని వేడుకునే సరికి మిగతా సభ్యులు చూద్దంలే అన్నరట. అంతే జనార్ధనుడు రెచ్చి పోయాడు.. భంగపడ్డాడు.. జనార్ధనుని ధోరని మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. సీ-ఛానెల్ బ్యూరో చీఫ్ గా ఎన్నో అవకతవకలకు పాల్పడిన ఇతగాడు ఉద్యోగంలో నుండి తొలగింపబడ్డాడు. ఆ తర్వాత ఎప్పటికీ రాని సత్యాలో కొంత కాలం పని చేశాడు. మరి కొంతకాలం జెమిని టీవీకి ఢిల్లీ రిపోర్టర్ గా పని చేశాడు. ఇదే సమయంలో జెమినికి రాజీనామా చేయకుండానీ ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ గా చేరాడు. సదరు పత్రిక ఎడిటర్ ఒక స్టోరీ రాయమని చెబితే అదిరాయడం చేతకాక చెప్ప చేయకుండా ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం విసా న్యూస్ బ్యూరో చీఫ్ గా వెలగబెడుతున్నాడు. పెన్ను పట్టి వార్తలు రాయడం చేతగాని జనార్ధన్ పైరవీలు చేయడంలో దిట్ట. ఎలక్ట్రానిక్ మీడియా సంఘాన్ని చీల్చి పోటీ సంఘాన్ని పెట్టిన ఇతగాడు ఎన్నో అక్రమార్జనలకు పాల్పడి ' ధనార్జన్ ' గా ప్రసిద్దికెక్కాడు. ఎన్నికలు వస్తున్న తరుణలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై డబ్బులు దండుకోవాలని ధనార్జన్ కలలు కంటున్నాడు. జర్నలిస్ట్ సోదరులారా.. జర జాగ్రత్త..
ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి ఎన్నికలు జరగవా?
ప్రస్తుతం హరిప్రసాద్ అధ్యక్షతన కొనసాగుతున్న సంఘం కేవలం హడ్ హక్ కమిటీ మాత్రమే. ఈ కమిటీ ఏర్పడి సంవత్సరం అయినా ఇప్పటిదాకా సభ్యత్వ కార్యక్రమం, ఎన్నికలు జరగలేదు. తాజాగా ఆగస్టులోగా ఎన్నికలు జరుపుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కార్యవర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణలో అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం ఎలక్ట్రానికి మీడియా సంఘానికి ఎన్నికలు జరగడం సందేహమే..

వైట్ల రమేశ్ పై దాడి సంగతేంటి?

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు అరెస్టు ఎపిసోడ్లో మంద కృష్ణ మాదిగపై ఒంటికాలితో లేచిన మీడియా సోదరులు, జర్నలిస్టు సంఘాలు ఎన్-టీవీ రిపోర్టర్ వైట్ల రమేష్ పై చిరంజీవి అభిమానులు చేసిన దాడిపై అంతగా ఎందుకు స్పందించడం లేదు?.. నామమాత్రపు నిరసనతో ఎందుకు ఆగిపోయినట్లు? ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేయలేదు? ఇవి కేవల మంద కృష్ణ వేసున్న ప్రశ్నలు కాదు? ప్రతీ జర్నలిస్టు మదిలో ఉదయిస్తున్న సందేహాలు. వైట్ల సుందరయ్య హాలు వద్ద రమేష్ పై దాడి చేసిన చిరంజీవి అబిమానులను పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయలేదు. చిరంజీవి వైట్ల రమేష్ కు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ చేసి సారే చెబితే సరిపోతుందా? బహిరంగంగా క్షమాపణలు చెప్పల్సిన అవసరం లేదా? హీరో రాజశేఖర్ పై దాడి విషయంలో చిరంజీవి మీడియా సమక్షంలో సారీ చెప్పడం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయం చిరంజీవికి సంబందించినది కావడంతో ఎన్-టీవీ యాజమాన్యం రాజీ పడ్డస్తు వస్తున్న వార్తల్ని నమ్మక్ తప్పడం లేదు. ఆంధ్రజ్యోతికి ఒక న్యాయం, వైట్ల రమేష్ కు మరో న్యాయమా? జర్నలిస్టు సోదరులే చెప్పాలి.

ఆంధ్రజ్యోతి ఎపిసోడ్.. కొన్ని సందేహాలు..

పత్రికా స్వేచ్చను చావు దెబ్బ తీసిన ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టును ప్రతీ జర్నలిస్ట్ ఖండించాల్సిందే.. ఈ ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా?. చట్టం తన పని తాను చేసుకుపోయిందా?.. ఆంధ్రజ్యోతి అతిగా వ్యవహరించి చట్టనికి చిక్కిందా?.. మంద కృష్ణ ఎందుకిలా వ్యవహరిసున్నారు?.. తదితర ప్రశ్నలు వినిపించాయి. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. అదే జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాల మధ్య చీలిక.. ఆంధ్రజ్యోతి ఎడిటర్, రిపోర్టర్ల అరెస్టు, తదనంతర పరిణామాల వార్తలకు అన్ని పత్రికలు ప్రాధాన్యతను ఇచ్చాయి. సాక్షి, సూర్య తప్ప. ఎందుకో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్లో మంచి చెడుల విషయానికి పోదలచుకోలేదు. కానీ పత్రికా స్వేచ్చ ప్రమాదంలో పడినప్పుడు ఐక్యంగా ఉద్యమించాల్సిన జర్నలిస్టులు ఎవరికి వారుగా మొక్కుబడి నిరసనలు తెలపడం బాధాకరం. అంతో, ఇంతో ఎలక్ట్రానిక్ మీడియా నిరసనలు ఐక్యంగానే జరిగాయి. కాని ఎపీయూడబ్ల్యుజె, ఎపీడబ్ల్యుజేఎఫ్ లు మాత్రం ఐక్యతను ప్రదర్శించ లేదు. ఇక ఎడిటర్, విలేఖరుల విడుదల తర్వాత ప్రెస్ క్లబ్ లో జరిగిన విజయోత్సవంలో అంతా ఆంధ్రజ్యోతి సిబ్బందే కనిపించారు. ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. అరెస్టు మరునాటి ఆంధ్రజ్యోతి పత్రిక నొడా కేవలం ఎడిటర్ శ్రీనివాస్, ఎండీ రాధాకృష్ణ ఫోటోలే ప్రముఖంగా కనిపించాయి. కానీ రిపోర్టర్లు శ్రీనివాస్, వంశీల ఫోటోలు లేవు. ఎందుకు? కంట్రిబ్యూటర్లనే చిన్న చూపా? జరిగిన తప్పును ఆంధ్రజ్యోతి జాజమాన్యం మరునాటికి సవరించుకుంది లెండి.