Saturday, August 22, 2009

కరీం రాకతో స్టూడియో-ఎన్ లో కలకలం

కామాంధుడూ, షాడిస్టు కరీం చేరికతో స్టూడియో-ఎన్ చానెల్లో సంక్షోభం నెలకొంది. నిత్య పెళ్ళి కొడుకుగా మహిళల జీవితాలతో ఆడుకొని చివరి(?) భార్య బంధువుల చేతిలో ఆసిడ్ దాడికి గురైన కరీం గత చరిత్ర ఎంతో వివాదాస్పదంగా ఉన్నా స్టూడియో-ఎన్ యాజమాన్యం కరీం ను ఎందుకు తీసుకుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒక పార్టీ అధినేత సిఫార్సుతో కరీం స్టూడియో-ఎన్ లో చేరాడని ప్రచారం జరుగుతోంది. కరీం చేరుతున్న వార్త తెలియగానే అంజయ్య, జయప్రసాద్ తదితర సీనియర్ స్థాయి జర్నలిస్టులు స్టుడియో-ఎన్ కు రాజీనామా ఇచ్చేశారు. స్టుడియో-ఎన్ ఎంటర్టైన్మెంట్ చానెల్ గా మారుతోంది.. న్యూస్ బులిటిన్లు తగ్గిస్తున్నారని మరో వార్త. ఇలాంటి పరిస్థితిలో కరీం ఏంచేయబోతాడో మరి. కరీంపై పొలీసు కేసులూ, నిఘా ఇంకా కొనసాగుతోందని తెలిసింది.

ఎన్-టీవీలో కొమ్మినేని

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5కి గుడ్ బై చెప్పి 'ఎన్-టీవీలో' చేరిపోయారు. ఇది టీవీ-5కి కొంత ఎదురు దెబే. ఎన్-టీవీ యాజమాన్యం శాస్త్రి కి ఉద్వాసన పలికేందుకే కొమ్మినేనిని తెచ్చి పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కారు తీసేసుకున్నారని ఎన్-టీవీ వర్గాల బోగట్టా. ఇది శాస్త్రికి పొమ్మనలేక పొగ పెట్టే పరిణామమే. గత కొన్ని నెల్లలుగా ఎన్-టీవీ సిబ్బంది శాస్త్రి అరుపులూ కేకలూ భరించలేక పోతున్నారు. తనకు నచ్చని ఎందరో జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడగొట్టడం ద్వారా వారి ఉసురు పోసుకున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు ఎన్-టీవీ నుండి వలస పోయారు.

మీడియా కామాంధులూ కబడ్దార్..

ఇటీవలి కాలంలో మీడియాలో కామంతో కళ్లు మూసుకు పోతున్న జర్నలిస్టులు పెరిగిపోతున్నారు. ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్న కొందరు సీనియర్లు కొత్తగా మీడియాలోకి వస్తున్న మహిళా జర్నలిస్టులు, యాంకర్ల పట్ల అగురవంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కామాంధుల భరతం పట్టాలని 'ఎబౌట్ తెలుగు మీడియా' నిర్ణయించింది. ఇలాంటివారి సమాచారాన్ని abouttelugumedia@gmail.com కి పంపించండి. ఈ మమాచారాన్ని నిర్దారించుకున్నాకే ప్రచురిస్తాం. అయితే మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకోసం వారి పేర్లను మటుకు రహస్యంగానే ఉంచతామని స్పష్టం చేస్తున్నాం..

మీడియా కమిటీపై ముదురుతున్న వివాదం

సూర్య దినపత్రిక (13 ఆగస్ట్, 2009) సౌజన్యంతో..
హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి: ‘మా సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీడియా కమిటీ సూచనల ప్రకారమే చేస్తున్నాం- ముఖ్యమంత్రి వైఎస్‌
‘మీడియా కమిటీ చేసిన సూచనలను అమలు చేస్తు న్నాం. మీడియా అంటే మాకు ఎంతో గౌరవం’- స్పీకర్‌
‘మీడియా కమిటీ సూచనల మేరకే ఆంక్షలు విధిస్తు న్నాం. సెక్యూరిటీ దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నాం’
-శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య
‘మేమెలాంటి ఆంక్షలు విధించలేదు. కమిటీ హాల్‌లో ప్రె స్‌ కాన్ఫరెన్సు పెట్టుకోవాలా? వద్దా అని చెప్పడానికి మాకేం అధికారం ఉంది? మా పాసుల వ్యవహారాలు, సౌకర్యాల వరకే కమిటీ పరిమితం. మిగిలివన్నీ స్పీకర్‌ అధికారాల కిందకే వస్తాయి’- మీడియా కమిటీ సభ్యుడు

గత కొద్దిరోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శంగా మారిన ‘అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల వ్యవహా రం’లో వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలివి. ప్రభుత్వ పెద్దలు తమకేమీ తెలియదని చెబుతుంటే, మీడియా కమిటీ సభ్యు లేమో అంతా తమ మీద నెపం వేస్తున్నారని వాపోతున్నా రు. దీనితో తప్పెవరిదన్న చర్చ తెరపైకొచ్చింది. మీడియాపై ఆంక్షల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసన గళం వినిపిస్తుండటంతో అసెంబ్లీలో అసలేం జరుగుతోం దంటూ అన్ని వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. గతంలో స్పీకర్‌ సురేష్‌రెడ్డి అమలుచేసిన విధానాన్ని ప్రస్తుత స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి తొలగించి.. లాబీ, మీడియాపాయింట్‌ పాసు లంటూ ప్రత్యేకంగా జారీ చేశారు. దానికి మీడియా కమిటీ సిఫార్సులే కారణమని, అందులో తన ప్రమేయమేమీ లేద న్నది స్పీకర్‌ వివరణ. అసలు మీడియా కమిటీ అనేది ఏర్పా టుచేసే ముందు అన్ని పత్రికలకు సమాచారం పంపి, జర్నలిస్టులను నియమించడమనేది పాత సంప్రదాయం. అవేమీ లేకుండా ఎవరినడిగి కమిటీ వేశారు? ఎప్పుడు వేశారు? ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు ఏర్పా టుచేశారు? అజెండా ఏమిటి? కమిటీలో సభ్యుల నియా మకాలకు ప్రాతిపదిక ఏమిటి? పత్రికల స్థాయేమిటి? అన్నవి మాత్రం ప్రశ్నలుగా నే మిగిలిపోయాయి. ఈ వివాదానికి ఇదీ ఒక కారణమం టున్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కూడా పక్షపా తం చూపి స్తున్నారని, తమ ఆందోళనను చూపించకుండా సెన్సార్‌ విధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అ యితే, ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై వివాదం తలెత్తిన ప్రతి సారీ మీడియా కమిటీ సిఫార్సుల ప్రకారమే ఆంక్షలు విధిం చామంటూ కమిటీపై నెపం మోపడం మీడియా కమి టీలోని కొందరు సభ్యులకు అసంతృప్తి కలుగుతోంది. తా ము కేవలం పాసుల జారీ, సౌకర్యాలకే పరిమితమే తప్ప, లోపల ఎలా ఉండాలి అని తాము ఎలా నిర్దేశిస్తామని ప్రశ్ని స్తున్నారు. ఈ వైఖరిపై మనస్తాపం చెందుతున్న మెజారిటీ మీడియా కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘బయట మ మ్మల్ని అనవసరంగా కాంగ్రెస్‌ వర్కర్స్‌ కమిటీ (సిడబ్ల్యుసి) అని మా వాళ్లే నిందిస్తున్నారు. లోపల మాట్లాడే అవకాశం లేకుండా ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయి తే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు ఎ దుర్కొంటున్న మరికొందరు సభ్యులుమాత్రం తమ కమి టీపై జరుగుతున్న దుష్ర్పచారంపై అన్ని పక్షాలకు లేఖలు రాద్దామని అభిప్రాయపడగా, అసలు లేఖలు రాయడానికి కమిటీకి ఏం అధికారం ఉందని మరికొందరు ప్రశ్నించి నట్లు సమాచారం. ఈమేరకు కొందరు సభ్యులు ప్రతిపక్షా లకు చెందిన సీనియర్లతో రాయబారాలు నడుపుతూ, తమ నిర్ణయాలు సరైనవేనని ఒత్తిడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా, కొన్ని ప్రైవేట్‌ టివిఛానెళ్ల చర్చల్లో పా ల్గొంటున్న సర్కారీ జర్నలిస్టులు అసెంబ్లీలో మీడియాపై విధించిన ఆంక్షల వల్ల మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ వ్యాఖ్యానించడం జర్నలిస్టులకు ఆగ్రహం కలిగి స్తోంది. ‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు జర్నలిస్టులు జనరలిస్టుల్లా మారా రు. వాళ్లు రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని డ్యూటీలు చేస్తే ఆ కష్టమేమిటో తెలుస్తుంది. రాయబారాలే వ్యాపకమయిన వారికి అవన్నీ ఏం తెలుస్తాయి? మీడియాపై విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలన్నీ నిరసిస్తుంటే, జర్నలిస్టు సంఘాల నేతలు మాత్రం సమర్థిస్తున్నారంటే వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్ధమవుతోంద’ని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

ఆంధ్రజ్యోతి సంపాదకీయం, ఆగస్ట్ 13, 2009


Sunday, August 2, 2009

మీడియాపై ఆంక్షలా.. సిగ్గు సిగ్గు..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.
నపుంసక మీడియా కమిటీ..

తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.

రెండు పడవల ప్రయాణం

జర్నలిస్టుగా కొనసాగాలా, రాజకీయాల్లోనే ఉండాలా తేల్చుకోలేక సతమతం అవుతున్న క్రాంతి కిరణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇన్ కేబుల్, టీవీ9, టీవీ5 ఛానెళ్ళలో పని చేసిన క్రాంతి కి అత్యాశ ఎక్కువ అన్ని పదవులు తనకే కావాలంటాడు. రెండు పడవల పయనం అంటే ఇతడికి ఎంతో ఇష్టం.. నోటి తీట ఎక్కువే కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతి కిరణ్ ఆంధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోనంత ఘోరంగా ఓడిపోవడం అందరికీ తెలుసు. టీవీ9లో పని చేస్తున్న సమయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేసి రామచంద్రాపురం నుండి కాంగ్రెస్ జడ్పీటీసెగా గెలిచాడు. కానీ ఆశించిన పదవి దక్కలేదు. ఆ తర్వాత జడ్పీటీసీ పదవికి రాజీనామా ఇచ్చానంటూ మళ్ళీ మీడియాలోకి వచ్చి టీవీ5లో చేరాడు. నిజంగా రాజీనామా చేసి ఉంటే రామచంద్రాపురం స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు జరగ లేదు అనే ప్రశ్న ఎవరూ వేయలేక పోయారు. అనంతరం టీఆరెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నించి భంగపడ్డాదు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి పదవిలో శాశ్వతంగా కొనసాగుతున్న ఇతగాడి చర్యల కారణంగా ఆ సంఘం గుర్తింపు ప్రమాదంలో పడింది. సక్రమంగా ఎన్నికలు, సమావేశాలు ఏనాడు జరగని ఈ సంఘం అసలు ఉందా లేదా కూడా తెలియడం లేదు. సంఘం రికార్డులన్నీ క్రాంతి కిరణ్ దాచిపెట్టాడట. మళ్ళీ జర్నలిస్టుగా వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.