Saturday, August 22, 2009

మీడియా కమిటీపై ముదురుతున్న వివాదం

సూర్య దినపత్రిక (13 ఆగస్ట్, 2009) సౌజన్యంతో..
హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి: ‘మా సొంతగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మీడియా కమిటీ సూచనల ప్రకారమే చేస్తున్నాం- ముఖ్యమంత్రి వైఎస్‌
‘మీడియా కమిటీ చేసిన సూచనలను అమలు చేస్తు న్నాం. మీడియా అంటే మాకు ఎంతో గౌరవం’- స్పీకర్‌
‘మీడియా కమిటీ సూచనల మేరకే ఆంక్షలు విధిస్తు న్నాం. సెక్యూరిటీ దృష్ట్యా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నాం’
-శాసనసభా వ్యవహారాల మంత్రి కె.రోశయ్య
‘మేమెలాంటి ఆంక్షలు విధించలేదు. కమిటీ హాల్‌లో ప్రె స్‌ కాన్ఫరెన్సు పెట్టుకోవాలా? వద్దా అని చెప్పడానికి మాకేం అధికారం ఉంది? మా పాసుల వ్యవహారాలు, సౌకర్యాల వరకే కమిటీ పరిమితం. మిగిలివన్నీ స్పీకర్‌ అధికారాల కిందకే వస్తాయి’- మీడియా కమిటీ సభ్యుడు

గత కొద్దిరోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శంగా మారిన ‘అసెంబ్లీలో మీడియాపై ఆంక్షల వ్యవహా రం’లో వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలివి. ప్రభుత్వ పెద్దలు తమకేమీ తెలియదని చెబుతుంటే, మీడియా కమిటీ సభ్యు లేమో అంతా తమ మీద నెపం వేస్తున్నారని వాపోతున్నా రు. దీనితో తప్పెవరిదన్న చర్చ తెరపైకొచ్చింది. మీడియాపై ఆంక్షల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసన గళం వినిపిస్తుండటంతో అసెంబ్లీలో అసలేం జరుగుతోం దంటూ అన్ని వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. గతంలో స్పీకర్‌ సురేష్‌రెడ్డి అమలుచేసిన విధానాన్ని ప్రస్తుత స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి తొలగించి.. లాబీ, మీడియాపాయింట్‌ పాసు లంటూ ప్రత్యేకంగా జారీ చేశారు. దానికి మీడియా కమిటీ సిఫార్సులే కారణమని, అందులో తన ప్రమేయమేమీ లేద న్నది స్పీకర్‌ వివరణ. అసలు మీడియా కమిటీ అనేది ఏర్పా టుచేసే ముందు అన్ని పత్రికలకు సమాచారం పంపి, జర్నలిస్టులను నియమించడమనేది పాత సంప్రదాయం. అవేమీ లేకుండా ఎవరినడిగి కమిటీ వేశారు? ఎప్పుడు వేశారు? ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు ఏర్పా టుచేశారు? అజెండా ఏమిటి? కమిటీలో సభ్యుల నియా మకాలకు ప్రాతిపదిక ఏమిటి? పత్రికల స్థాయేమిటి? అన్నవి మాత్రం ప్రశ్నలుగా నే మిగిలిపోయాయి. ఈ వివాదానికి ఇదీ ఒక కారణమం టున్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో కూడా పక్షపా తం చూపి స్తున్నారని, తమ ఆందోళనను చూపించకుండా సెన్సార్‌ విధిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అ యితే, ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై వివాదం తలెత్తిన ప్రతి సారీ మీడియా కమిటీ సిఫార్సుల ప్రకారమే ఆంక్షలు విధిం చామంటూ కమిటీపై నెపం మోపడం మీడియా కమి టీలోని కొందరు సభ్యులకు అసంతృప్తి కలుగుతోంది. తా ము కేవలం పాసుల జారీ, సౌకర్యాలకే పరిమితమే తప్ప, లోపల ఎలా ఉండాలి అని తాము ఎలా నిర్దేశిస్తామని ప్రశ్ని స్తున్నారు. ఈ వైఖరిపై మనస్తాపం చెందుతున్న మెజారిటీ మీడియా కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘బయట మ మ్మల్ని అనవసరంగా కాంగ్రెస్‌ వర్కర్స్‌ కమిటీ (సిడబ్ల్యుసి) అని మా వాళ్లే నిందిస్తున్నారు. లోపల మాట్లాడే అవకాశం లేకుండా ఒకరిద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయి తే, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారన్న విమర్శలు ఎ దుర్కొంటున్న మరికొందరు సభ్యులుమాత్రం తమ కమి టీపై జరుగుతున్న దుష్ర్పచారంపై అన్ని పక్షాలకు లేఖలు రాద్దామని అభిప్రాయపడగా, అసలు లేఖలు రాయడానికి కమిటీకి ఏం అధికారం ఉందని మరికొందరు ప్రశ్నించి నట్లు సమాచారం. ఈమేరకు కొందరు సభ్యులు ప్రతిపక్షా లకు చెందిన సీనియర్లతో రాయబారాలు నడుపుతూ, తమ నిర్ణయాలు సరైనవేనని ఒత్తిడి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా, కొన్ని ప్రైవేట్‌ టివిఛానెళ్ల చర్చల్లో పా ల్గొంటున్న సర్కారీ జర్నలిస్టులు అసెంబ్లీలో మీడియాపై విధించిన ఆంక్షల వల్ల మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ వ్యాఖ్యానించడం జర్నలిస్టులకు ఆగ్రహం కలిగి స్తోంది. ‘ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా కొందరు జర్నలిస్టులు జనరలిస్టుల్లా మారా రు. వాళ్లు రోజూ వచ్చి ఇక్కడ కూర్చుని డ్యూటీలు చేస్తే ఆ కష్టమేమిటో తెలుస్తుంది. రాయబారాలే వ్యాపకమయిన వారికి అవన్నీ ఏం తెలుస్తాయి? మీడియాపై విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలన్నీ నిరసిస్తుంటే, జర్నలిస్టు సంఘాల నేతలు మాత్రం సమర్థిస్తున్నారంటే వాళ్లు ఎటువైపు ఉన్నారో అర్ధమవుతోంద’ని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.