Sunday, August 2, 2009

రెండు పడవల ప్రయాణం

జర్నలిస్టుగా కొనసాగాలా, రాజకీయాల్లోనే ఉండాలా తేల్చుకోలేక సతమతం అవుతున్న క్రాంతి కిరణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇన్ కేబుల్, టీవీ9, టీవీ5 ఛానెళ్ళలో పని చేసిన క్రాంతి కి అత్యాశ ఎక్కువ అన్ని పదవులు తనకే కావాలంటాడు. రెండు పడవల పయనం అంటే ఇతడికి ఎంతో ఇష్టం.. నోటి తీట ఎక్కువే కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రాంతి కిరణ్ ఆంధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోనంత ఘోరంగా ఓడిపోవడం అందరికీ తెలుసు. టీవీ9లో పని చేస్తున్న సమయంలో మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై కన్నేసి రామచంద్రాపురం నుండి కాంగ్రెస్ జడ్పీటీసెగా గెలిచాడు. కానీ ఆశించిన పదవి దక్కలేదు. ఆ తర్వాత జడ్పీటీసీ పదవికి రాజీనామా ఇచ్చానంటూ మళ్ళీ మీడియాలోకి వచ్చి టీవీ5లో చేరాడు. నిజంగా రాజీనామా చేసి ఉంటే రామచంద్రాపురం స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు జరగ లేదు అనే ప్రశ్న ఎవరూ వేయలేక పోయారు. అనంతరం టీఆరెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నించి భంగపడ్డాదు. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే ఫలితం ఏమయిందో అందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి పదవిలో శాశ్వతంగా కొనసాగుతున్న ఇతగాడి చర్యల కారణంగా ఆ సంఘం గుర్తింపు ప్రమాదంలో పడింది. సక్రమంగా ఎన్నికలు, సమావేశాలు ఏనాడు జరగని ఈ సంఘం అసలు ఉందా లేదా కూడా తెలియడం లేదు. సంఘం రికార్డులన్నీ క్రాంతి కిరణ్ దాచిపెట్టాడట. మళ్ళీ జర్నలిస్టుగా వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు.