Wednesday, June 17, 2009

మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..

న్యూస్ చానెళ్లకు కష్ట కాలం వచ్చిందని భావిస్తున్న తరుణంలో ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళు కూడా న్యూస్ ను వదిలించుకోవడం జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారింది. ఏసియానెట్ సితార ఛానెల్ న్యూస్ ప్రారంభించకుండానే నమ్మి చేరిన జర్నలిస్టులను సాగనంపిన ఉదంతం మరువకముందే మా టీవీ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 తేదీ నుండి మాటీవీ న్యూస్ బులిటిన్లను నిలిపేస్తోంది. తమ జర్నలిస్టులందరికీ రెండు నెలల అడ్వాన్స్ జీతాలిచ్చి వదిలించుకుంది. ఫలితంగా మా టీవీ జర్నలిస్టులంతా రోడ్డు పాలయ్యారు. మా టీవీ యజమానులైన చిరంజీవి, నాగార్జున, మురళీకృష్ణం రాజు భిన్న రాజకీయ వైఖరులతో పరస్పరం ఘర్షణ పడుతూ, చివరకు ' న్యూస్ ' కు మంగళం పాడారని తెలుస్తోంది. ఇకపై మా టీవీ కేవలం వినోద ప్రధనమైన చానెల్ గానే కొన సాగుతుంది. న్యూస్ సిబ్బందిని పంపడం ఇష్టం లేక విధిలేని వరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న మురళీకృష్ణం రాజు కంట తడి పెట్టారని ' మా ' సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు లోకల్ టీవీ కూడా వార్తా ప్రసారాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా అక్కడి జర్నలిస్ట్ మిత్రులుకూడా రోడ్డు పాలయ్యే దుస్థితి ఏర్పడింది. స్టూడియో-ఎన్ చానెల్లో జర్నలిస్టుల జీతాలు తగ్గించడం మరో షాక్..