Wednesday, June 17, 2009

' సాక్షి ' అధికార దర్పం

ముఖ్యమంత్రిగా రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టాక ఆయన కుటుంబానికి చెందిన సక్షి టీవీ, దిన పత్రికలకు ప్రభుత్వంలో రాచ మర్యాదలు లభిస్తున్నాయి. ఇతర మీడియా ప్రతినిధులకు ఇది కంటగింపుగా మారిది. అధికారులు సాక్షి సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తూఅ మిగతా మీడియా సిబ్బందిని చిన్న చూపు చూస్తున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి సాక్షికి తప్ప ఇతర మీడియాకు ప్రవేశం లేదు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయిలో నిబంధనలకు సాక్షి కెమెరామెన్ ను ప్రత్యేకంగా తీసుకెళ్ళుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని సమావేశమందిరంలోకి స్పీకర్ ఎన్నిక సందర్భంగా సాక్షి కెమెరామెన్ ను తప్ప ఇతరులను అనుమతించ లేదు. ఏమిటీ వివక్ష అని ఇతర మీడియా సిబ్బంది గొంతు చించుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు.