Wednesday, June 17, 2009

అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు

రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంతోంది. అసెంబ్లీలో మీడియాకి ముక్కుతాడు వేయాలన్నది ఇందులో ఒక నిర్ణయం. ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన టీవీ చానెళ్ళ హడావుడి అసెంబ్లీకి ఇబ్బంది కరంగా మారింది. ఉలక్ట్రానిక్ మీడియా వారు స్వీయ క్రమ శిక్షణ పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి, గుంపుగా కెమరాలతో మీద పడుతూ చిరాకు కలిగిస్తున్నారట. మీడియాలు నియంత్రించడమే ఇందుకు ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మీడియా పాసులకు కోత పెట్టడంతో పాటు, వీరందరినీ పబ్లిక్ గార్డెన్ కు పరిమితం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం జర్నలిస్టులకే కాకుండా నేతాజీలకు కూడా ఇబ్బందికరమే.. గొట్టాల ముందు వాగందే వారికి పూఅట గడవదు కదా?..