Monday, June 1, 2009

సాక్షి జర్నలిస్టుల పంట పండింది

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు తమ చైర్మన్ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్ సభుడిగా భారీ మెజారిటీతో గెలవడం సాక్షి పత్రిక, సాక్షి టీవీ జర్నలిస్టులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. తెలుగుదేశం గెలిస్తే తమ మీడియాకు ఇబ్బందులు తప్పవని భయపడ్డ సాక్షి జర్నలిస్టులంతా త భవిష్యత్తుపై ఇప్పుడు ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆనందంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాక్షి సిబ్బందికి జీతాలు పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే సీనియర్లందరికీ కార్లు, టూ వీలర్లు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నిక తర్వాత సిబ్బందిని తగ్గించే ప్రణాళిక తయారు చేసిన సాక్షి యాజమాన్యం ఆ ప్రతిపాదనను అటకెక్కించిందట. పాపం ఇతర పత్రికలు, టీవీల జర్నలిస్టులు. వీరెవరికి ఈసారి జీతాలు పెరగక పోగా, కొందరికి కోత పడిందట. ఎంతైనా సాక్షి జర్నలిస్టులది పూర్వజన్మ సుకృతం..