Monday, June 1, 2009

ఎన్నికల ఫలితాలపై మీడియా హాపీ

ఈమధ్యే ముగిసిన ఎన్నికల ఫలితాలు మీడియా సోదరులకు ఆనందాన్ని కలిగించాయి. మేనేజిమెంట్ల వైఖరి ఎలా ఉన్నా కాంగ్రెస్ గెలుపుపై జర్నలిస్టులంతా దాదాపుగా ఆనందంగానే ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, సెక్రెటేరియట్ బీట రిపోర్టర్లకు ఇంకా హాపీ. గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్యూరెన్స్, ఆరోగ్య శ్రీ ఫథకాలు అమలు చేయటమే కాకుండా ఇండ్ల స్థలాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోసారి అధికారం చేపట్టిన వైఎస్ మరిన్ని మేళ్ళు చేస్తాడని జర్నలిస్టులు భావిస్తున్నారు. చంద్రబాబు మీడియా మేనేజిమెంట్లకు మాత్రమే లబ్ది చేకూరిస్తే, వైఎస్ జర్నలిస్టుల పక్షపాతి అని అంటారు. విచిత్రంగా తెలుగుదేశం బీట్ జర్నలిస్టులు సైతం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ గెలవడం పై ఆనందంగా ఉన్నారు. తాను అధికారానికి వస్తే ఇళ్ళస్థలాలు ఇస్తానని ఆయన చెప్పిన మాటల్ని వెవరూ నమ్మలేదు. టిడిపి ఓటమి మీడియాలో ఒక వర్గానికి మాత్రమే విచారాన్ని కలిగించింది.