Monday, May 11, 2009

కమ్ముకుంటున్న సంక్షోభ ఛాయలు

అంతా అనుకున్నట్లే ఎలక్ట్రానిక్ మీడియాలో సంక్షోభంప్రారంభం అయింది. ఎన్నికలు ముగిసి ఫలితాలైనా రాకమునుపే యాజమాన్యాలు ఉద్యొగాలకు కోత పెట్టడం ప్రారంభించాయి. ఎన్-టీవీలో పలువురు జర్నలిస్టులకు ఉద్వాసన పలికారు. అదే బాటలో లోకల్ టీవీ సిబ్బందిని తగ్గించుకుంది. టీవీ-9లో కుడా సిబ్బందిని తగ్గించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. జీ 24 గంటలు చానెల్ లోని జర్నలిస్టులకు జీతంలో 15 శాతం కోత విధించారు. జెమిని సిబ్బంది ఇంక్రిమెంట్ ముష్టి 5 శాతం మాత్రమే పెరిగింది. కొత్తగా వచ్చిన ఐ-న్యూస్ సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఈ చానెల్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. అదే బాటలో హెచ్.ఎం.టీవీ పరిస్థితి కూడా. టీవీ5 చానెల్ పై కూడా అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. తెలుగు చానెల్లన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నయి. ఎన్నికల పుణ్యమా అని ఇంత కాలం నెట్టు కొచ్చిన యాజమాన్యాలు ఇక నిర్వహణా భారాన్ని తగ్గించుకోవడం పై ద్రుష్టి పెట్టాయి. ఇందులో భాగం గానే ఉద్యోగుల కుదింపు, జీతాల తగ్గింపు.