Monday, May 11, 2009

టికెట్ల కేటాయింపులో జర్నలిస్టులకు మొండి చేయి

అసెంబ్లీలో మైక్ పట్టుకొని 'అధ్యక్షా..' అని మాట్లాడదామని కలలు కన్న పలువురు జర్నలిస్టులకు రాజకీయ పార్టీలు మొండి చేయి ఇచ్చాయి. ఇంత కాలం తాము ఆ పార్టీలను నమ్ముకొని చేసిన చాకిరీకి ఇదా ప్రతిఫలం అంటూ వాపోతున్నారు పాపం. ముఖ్యంగా ముగ్గురు జర్నలిస్టులకు టికెట్లు ఇస్తామని ప్రచారం చేసుకున్న టి.ఆర్.ఎస్. రామలింగారెడ్డికి తిరిగి టికెట్ ఇవాడం తప్ప కొత్తగా ఎవరికి ఇవ్వలేదు. ఆంధోల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ టీవీ జర్నలిస్ట్ క్రాంతి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. టికెట్ కోసం ప్రయత్నించిన సీనియర్ జర్నలిస్ట్ అయోధ్య రెడ్డికి సైతం మొండిచేయి ఇచ్చారు. తెలంగాణా వాదినంటూ డబ్బా కొట్టుకునే మాజీ కమ్యూనిస్టు పల్లె రవికి అటు కె.సి.ఆర్. ఇటు దేవేందర్ గౌడ్ చేయి ఇచ్చారట. తెలుగు దేశం కొత్తగా ఏ జర్నలిస్టుకు టికెట్ ఇవ్వలేదు. టీవీ5 రిపోర్టర్ కప్పర ప్రసాద్ కొద్దిలో బి.జె.పి. టికెట్ మిస్సయాడు. ఇతగాడు టికెట్ వస్తుందనే ఆశతో టీడీపీ, కాంగ్రేస్ అభ్యర్థులతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడట. ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే నమ్ముకున్న కన్న బాబుకు టికెట్ ఇచ్చి రుణం తీర్చుకుంది.