Sunday, September 6, 2009

మీడియా మిత్రుడికి జోహార్!
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అస్తమయం తెలుగు ప్రజలందరికీ విచారాన్ని కలిగించింది. రాజశేఖర రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా పని చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు కేసు కారణంగా ఇది కార్యరూపం దాల్చక వై.ఎస్.ను కోల్పోవడం బాధారం. జర్నలిస్టులకు మెడిక్లైం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పుణ్యమే.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఎబౌట్ తెలుగు మీడియా ఘనంగా నివాళులర్పిస్తోంది.

APEMJUను కబలించేందుకు APUWJకుట్ర

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఈ సంఘాన్ని విలీనం చేసుకునేందుకు ' ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ' పావులు కదిపింది. ఈ మేరకు APEMJU ముందు ప్రతిపాదన కూడా పెట్టిందిభావిస్తోంది. తాము APUWJలో విలీనం అయితే స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతామని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన పడుపున్నారు. తన దాయాది APWJFపై ఆదిక్యత సాధించేందుకే APEMJUను విలీనం చేసుకోవాలని APUWJభావిస్తోంది. ఈ కుట్ర లోని ఆంతర్యం తెలియని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గుడ్డిగా విలీనాని పచ్చ జెండా ఊపాలని ప్రయత్నిస్తున్నారు.
' ధనార్జన ' రాజకీయం
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ లో ముసలం మొదలైంది. సంఘం అధ్యక్షునిగా ఉన్న హరి ప్రసాద్ కు తెలియకుండానే తాను కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు చందు జనార్ధన్ ఐ అండ్ పీఅర్ కు ఒక లేఖ రాయడం ద్వారా ప్రకటించుకున్నాడు. ఈయన గారి కార్యవర్గంలో సాబేర్ ఉపాధ్యక్షునిగా, క్రాంతి కిరణ్ కార్యదర్శిగా ఉన్నారు. జనార్ధన్, సాబేర్, క్రాంతిల కుట్ర వెనుక APUWJహస్తం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అనైక్యతను సాకుగా చూపి తమలో విలీనం చేసుకోవాలన్నదే APUWJఎత్తుగడ. ఈ విషయమై ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చందు జనార్ధన్ ని నిలదీద్దామని ప్రయత్నించగా మొహం చాటేసి పారిపోగా, సాబేర్ మీటింగ్ ఏ డుమ్మా కొట్టాడు. గతంలో కూడా ఈ మహానుభావుల కారణంగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నిలువునా చీలిపోయింది. ఇప్పటికే ధనార్జన్.. సారీ జనార్ధన్, యూనియన్ అధ్యక్షున్నంటూ చందాలు పోగేస్తున్నాడట.

జెమినిలో మూడు స్థంబాలాట

సన్ నెట్ వర్క్ లోని తెలుగు టీవీ చానెళ్ళకు సీవోవో గా సంజీవ రెడ్డి జాయిన్ అయ్యారు. గతంలో జీ తెలుగు సీఈవోగా పని చేసిన సంజీవ రెడ్డి ఆ చానల్లో ఎన్నో వినూత్న ప్రోగ్రాంలు ప్రవేశ పెట్టి జెమినికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన పని తీరును మెచ్చిన సన్ యాజమాన్యం తన గ్రూప్ లోని తెలుగు చానళ్ళకు సీవోవో పోస్టును ఆఫర్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జెమినిలో మూడు స్థంబాలాట మొదలైంది. ఇప్పటికే మేనేజింగ్ డైరెటర్, జనరల్ మేనేజర్ ఆధిక్యతా పోరులో నలిగిపోతున్న జెమిని సిబ్బందికి తాజాగా వచ్చిన చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అధనపు భారంగా మారారట. ఈయన జీతం నెలకు ఐదు లక్షలేనట. తమ గొర్రె తోకంత జీతాలు పెంచరు కానీ లక్షలాది జీతాలకు కొత్త కొత్త అధికారులను తెచ్చి తమ నెత్తిన పెడతారని జెమిని ఉద్యోగులు సన్ యాజమాన్యంపై రుసరుస లాడుతున్నారు.