Sunday, September 6, 2009

APEMJUను కబలించేందుకు APUWJకుట్ర

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఈ సంఘాన్ని విలీనం చేసుకునేందుకు ' ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ' పావులు కదిపింది. ఈ మేరకు APEMJU ముందు ప్రతిపాదన కూడా పెట్టిందిభావిస్తోంది. తాము APUWJలో విలీనం అయితే స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతామని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన పడుపున్నారు. తన దాయాది APWJFపై ఆదిక్యత సాధించేందుకే APEMJUను విలీనం చేసుకోవాలని APUWJభావిస్తోంది. ఈ కుట్ర లోని ఆంతర్యం తెలియని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గుడ్డిగా విలీనాని పచ్చ జెండా ఊపాలని ప్రయత్నిస్తున్నారు.
' ధనార్జన ' రాజకీయం
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ లో ముసలం మొదలైంది. సంఘం అధ్యక్షునిగా ఉన్న హరి ప్రసాద్ కు తెలియకుండానే తాను కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు చందు జనార్ధన్ ఐ అండ్ పీఅర్ కు ఒక లేఖ రాయడం ద్వారా ప్రకటించుకున్నాడు. ఈయన గారి కార్యవర్గంలో సాబేర్ ఉపాధ్యక్షునిగా, క్రాంతి కిరణ్ కార్యదర్శిగా ఉన్నారు. జనార్ధన్, సాబేర్, క్రాంతిల కుట్ర వెనుక APUWJహస్తం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అనైక్యతను సాకుగా చూపి తమలో విలీనం చేసుకోవాలన్నదే APUWJఎత్తుగడ. ఈ విషయమై ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చందు జనార్ధన్ ని నిలదీద్దామని ప్రయత్నించగా మొహం చాటేసి పారిపోగా, సాబేర్ మీటింగ్ ఏ డుమ్మా కొట్టాడు. గతంలో కూడా ఈ మహానుభావుల కారణంగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నిలువునా చీలిపోయింది. ఇప్పటికే ధనార్జన్.. సారీ జనార్ధన్, యూనియన్ అధ్యక్షున్నంటూ చందాలు పోగేస్తున్నాడట.