Sunday, September 6, 2009

జెమినిలో మూడు స్థంబాలాట

సన్ నెట్ వర్క్ లోని తెలుగు టీవీ చానెళ్ళకు సీవోవో గా సంజీవ రెడ్డి జాయిన్ అయ్యారు. గతంలో జీ తెలుగు సీఈవోగా పని చేసిన సంజీవ రెడ్డి ఆ చానల్లో ఎన్నో వినూత్న ప్రోగ్రాంలు ప్రవేశ పెట్టి జెమినికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన పని తీరును మెచ్చిన సన్ యాజమాన్యం తన గ్రూప్ లోని తెలుగు చానళ్ళకు సీవోవో పోస్టును ఆఫర్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జెమినిలో మూడు స్థంబాలాట మొదలైంది. ఇప్పటికే మేనేజింగ్ డైరెటర్, జనరల్ మేనేజర్ ఆధిక్యతా పోరులో నలిగిపోతున్న జెమిని సిబ్బందికి తాజాగా వచ్చిన చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అధనపు భారంగా మారారట. ఈయన జీతం నెలకు ఐదు లక్షలేనట. తమ గొర్రె తోకంత జీతాలు పెంచరు కానీ లక్షలాది జీతాలకు కొత్త కొత్త అధికారులను తెచ్చి తమ నెత్తిన పెడతారని జెమిని ఉద్యోగులు సన్ యాజమాన్యంపై రుసరుస లాడుతున్నారు.