Saturday, August 22, 2009

కరీం రాకతో స్టూడియో-ఎన్ లో కలకలం

కామాంధుడూ, షాడిస్టు కరీం చేరికతో స్టూడియో-ఎన్ చానెల్లో సంక్షోభం నెలకొంది. నిత్య పెళ్ళి కొడుకుగా మహిళల జీవితాలతో ఆడుకొని చివరి(?) భార్య బంధువుల చేతిలో ఆసిడ్ దాడికి గురైన కరీం గత చరిత్ర ఎంతో వివాదాస్పదంగా ఉన్నా స్టూడియో-ఎన్ యాజమాన్యం కరీం ను ఎందుకు తీసుకుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒక పార్టీ అధినేత సిఫార్సుతో కరీం స్టూడియో-ఎన్ లో చేరాడని ప్రచారం జరుగుతోంది. కరీం చేరుతున్న వార్త తెలియగానే అంజయ్య, జయప్రసాద్ తదితర సీనియర్ స్థాయి జర్నలిస్టులు స్టుడియో-ఎన్ కు రాజీనామా ఇచ్చేశారు. స్టుడియో-ఎన్ ఎంటర్టైన్మెంట్ చానెల్ గా మారుతోంది.. న్యూస్ బులిటిన్లు తగ్గిస్తున్నారని మరో వార్త. ఇలాంటి పరిస్థితిలో కరీం ఏంచేయబోతాడో మరి. కరీంపై పొలీసు కేసులూ, నిఘా ఇంకా కొనసాగుతోందని తెలిసింది.