Sunday, August 2, 2009

మీడియాపై ఆంక్షలా.. సిగ్గు సిగ్గు..

రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి శాసన సభలో మీడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. జర్నలిస్టులను లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాసుల పేరిట విడగొట్టారు. శాసన సభ ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా కెమరాలను కట్టడి చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మంచిదే.. ఆంక్షల పేరిట వారికి తాగు నీరు, ఆహారం, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలకు దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. గ్యాలరీ, మీడియా పాయింట్ పాసులున్న జర్నలిస్టులను, కెమెరామెన్లను, పోటోగ్రాఫర్లను క్యాంటీన్ల దగ్గరకు వెళ్ళనీయకుండా దుర్మార్గం. తమ కష్టాలు చెప్పుకోవడానికి స్పీకర్ వద్దకు పోదామనుకున్న జర్నలిస్టులపై పోలేసులు తమ దమన నీతిని ప్రదర్శించబోయారు. ఫలితంగా జూలై 31న జర్నలిస్టులంతా అసెంబ్లీ మీడియా పాయింట్లో కవరేజీలను బహిష్కరించారు.
నపుంసక మీడియా కమిటీ..

తోటి జర్నలిస్టులపై దుర్భర ఆంక్షలకు అసెంబ్లీ మీడియా కమిటీ చేతగాని తనమే కారణం అనేది సుస్పష్టం. మీడియా కమిటీ సలహా ప్రకారమే పాసులు కుదించి ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జర్నలిస్టు ముందుకు రాలేక మీడియా కమిటీ ముఖం చాటేసింది. అసలు అసెంబ్లీ మీడియా కమిటీలో ఉన్నదెవరు? వారికి జర్నలిస్టుల సాదక బాధకాలు తెలుసా? అసెంబ్లీ కవరేజీకి వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలా మందిని దూరం పెట్టి ' తమ ' వారికే కమిటీలో చోటు ఇచ్చారని అంతా చెబుకుంటున్నారు. కొదరు జర్నలిస్టులైతే ' ఇది మీడియా కమిటీ కాదు.. సీ.ఎల్.పి. కమిటీ.. అని బాహటంగా నోరు పారేసుకుంటున్నారు.