Saturday, November 20, 2010

త్వరలో బిజెపి టీవీ చానెల్..

రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి దిన పత్రిక, టీవీ చానెల్ ఏదో ఒక పార్టికి ఉపగ్రహంలా పై చేయడం కాదనలేని నిజం. యువనేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక దిన పత్రిక, ఒక చానెల్ నడుపుతుండగా, చంద్ర బాబు నాయడు తన కుమారునితో స్టూడియో -ఎన్ చానెల్ నడిపిస్తున్నారు. ఇతర పత్రికలూ, చానెళ్ళు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. మీడియాపై కాంగ్రెస్, టి.డి.పి.ల పెత్తనం కారణంగా ఇతర పార్టీల కార్యక్రమాలకు సరైన ప్రచారం లభించడం లేదు. టి.ఆర్.ఎస్. వారికి రాజ్ న్యూస్ ఎలాగూ ఉంది. వామపక్షాలకు సొంత దిన పత్రికలూ ఉన్నాయి. కాని బి.జె.పి. అది కూడా లేక పోవడంతో వారి కార్యక్రమాలకు తగినంత ప్రచారం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అవసరమని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఒక టీవీ చానెల్ తేవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి నేరుగా పత్రిక చానెల్ పెట్టాడు. కొందరు సానుభూతి పరులైన పారిశ్రామికవేత్తలతో చానెల్ పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి ఇదే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.

కసాయి పాలన.. దుర్మార్గం..

సన్ సంస్థ ఎలా నమ్మి వెంకట సత్యనారాయణ అలియాస్ సాయిని జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్గా పెట్టుకుందో దేవుడెరుగు.. అతడి ఆగడాలు భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ మిడిమిడి మేధావి తనకు తోడు మరో మహా మేధావిని తెచ్చి పెట్టుకున్నాడు. మార్గం లక్ష్మీ నారాయణ అనే ఇతగాడు జర్నలిజంలో చాల జూనియర్.. ఒక సాధారణ సబ్ ఎడిటర్ ను పట్టుకొచ్చి అవుట్ పుట్ ఎడిటర్ను చేసేసారు. నిజమే.. జెమినిలో ఏదైనా సాధ్యమే. ఆఫ్ట్రాల్ రిపోర్టర్ సాయి ఏకంగా న్యూస్ హెడ్ కాగా లేనిది.. మార్గం అవుట్ పుట్ ఎడిటర్ కావడంలో ఆశ్చర్యం ఏముంది బ్రదర్. సాయి లాగే ఆముదం తాగిన ముఖంతో కనిపించే మార్గం, సీనియర్, జూనియర్ అనే తేడ లేకుండా తోటి ఉద్యోగులతో చాల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాడని జెమిని వర్గాలు వాపోతున్నాయి. చిటికెలు వేస్తూ ఏకవచనంతో తోటి జర్నలిస్టులపై రంకెలు వేస్తూ అరిచే ఇతగాడికి ' దుర్మార్గం ' అనే పేరు స్థిర పడిపోయింది.
ఇక మన కసాయి గారి విషయానికొద్దాం.. సీనియర్లను వెళ్ళగొట్టి తన బ్రాండ్ జర్నలిస్టులను తెచ్చుకోవడానికి సాయి తెగ కష్ట పడుతున్నాడు. ఇటీవల ఫెర్ఫార్మెన్స్ అప్రైసల్ పేరిట పెద్ద ప్రహసనమే జరిగింది. తన వర్గానికి మంచి మార్కులు వేసి, అంతకన్నా మంచిగా పని చేసే వారికీ నామ మాత్రం మార్కులు వేసి యాజమాన్యానికి పంపాడు. ఫలితంగా దీపావళి బోనస్లో చాలా మందికి అన్యాయం జరిగి పోయింది. జెమిని టీవీలో నడుస్తున్న గుడ్డి దర్బారుకు ఈ ఫెర్ఫోర్మన్స్ అప్రైసల్ చక్కని ఉదాహరణ. ఇక యాంకర్ల విషయంలో సాయి ప్రవర్తనపై చాలా పిర్యాదులు ఉన్నాయి. సునితమైన ఈ అంశంపై ఎక్కువగా రాయడం బాగుండదని ఇంతటితో వదిలేస్తున్నాం..
తాజా వార్త .. టి.టి.డి. సేవ కుంభకోణంలో ఉన్న సాయి.. ఈ కేసు నుండి బయట పడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలను ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన పరపతితో విజిలెన్స్ నివేదికను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. మరిన్ని కసాయి వార్తలు త్వరలో..

మీకిది తగునా బాబు..

ఒకప్పుడు మీడియాను నియంత్రించిన చందబాబు నాయుడు, జర్నలిస్టులను పురుగుల్ల చూసే వారని చెబుతుంటారు. ప్రెస్ మీట్లో తనను వేలెత్తి ప్రశ్నించిన రిపోర్టర్ల ఉద్యోగాలు ఊడగొట్టిమ్చిన సందర్బాలు గతంలో చాల ఉన్నాయి. అందుకే ఆయనకు జర్నలిస్తులంటే చులకన భావం సహజం తాజాగా తన కుమారునితో పెట్టించిన టీవీ ఛానల్ ' స్టూడియో ఎన్ ' లో జర్నలిస్టులను అన్యాయంగా ఉద్యోగంలో నుండి తీసేసినా పట్టించుకోవడం లేదు. స్టూడియో -ఎన్ లో ఉద్యోగాలుఊడిపోయి రోడ్డున పడ్డ జర్నలిస్టు పరిస్థితి చాల దీంగా ఉంది. నిన్నటి దాక అయ్యో.. అని సానుభూతి వ్యక్తం చేసిన వారు ఇప్పుడు కూడా ఏమి చేయలేక మిన్నకుండి పోయారు. ప్రతి నిత్యం అందోళన చేయటం అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఫలితంగా చేసేదేమీ లేక ఉద్యోగాలు పోయిన స్టూడియో ఎన్ జర్నలిస్టులు పస్తులతో, అప్పులతో భారంగా జీవితం వెల్ల దీస్తున్నారు. బయట అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగం కోల్పోయిన స్టూడియో ఎన్ ఉద్యోగుల విషయంలో జర్నలిస్టు సంఘాలు అంతంత మాత్రం ఉద్యమాలు చేసి చేతులు దులుపుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వీరిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.

Thursday, September 23, 2010

భారీ పెట్టుబడులతో కొత్త దిన పత్రిక

తెలుగులో భారీ పెట్టు బడులతో మరో కొత్త దిన పత్రిక రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ పత్రికను తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్రిక హెడ్లు కూడా నిర్ణయమై పోయారు కూడా.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ ఈ పత్రికకు ఎడిటర్గా నిర్ణయం అయిపోయారు. మల్టీ కలర్తో ఇప్పుడు ఉన్న పత్రికల కన్నా ఎక్కువ పేజీలు , తక్కువ ధరతో రానున్న ఈ పత్రిక మీడియా వర్గాలో చర్చనీయంశం అయింది. కొత్త పత్రికలో జర్నలిస్టులకు జీతాలు కూడా భారీగానే ఉంటాయంటున్నారు. ఈనాడు, సాక్షి పత్రికలకు ఈ కొత్త పత్రిక గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఇన్నాయి. ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ఇది నిజంగా 'శుభ వార్త'

ఉద్యోగులను సాగనంపుతున్న చానెళ్ళు

న్యాయం చేయడంలో విఫలం అయ్యారు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఎవరు? హరి ప్రసాదా? జనార్ధనా? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గడ్డు రోజుల్ని ఎదుర్కొంటున్నారు. టీవీ చానెల్స్ ఉద్యోగాల్లో కోత విధించే పనిలో పడ్డాయి. ఖర్చులు తగ్గించు కోవడంలో భాగంగా సీనియర్లను సాగనంపి, వారి స్థానంలో కొత్తవారిని తక్కువ జీతాలకు తీసుకుంటున్నాయి. ఎక్కడా కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. జర్నలిస్టు సంఘాలు నిద్ర నటిస్తూ వీరిని పట్టించు కోవడం లేదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నాయకులు అంతర్గత కుమ్ములాటలతో పైరవీలు చేసుకోవడానికే పరిమితం అవుతూ.. ఉద్యోగాలు పోయిన జర్నలిస్టులకు న్యాయం చేయడం లేదు. అసలు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సందం అధ్యక్షుడు ఎవరు? హరిప్రసాదా? జనార్ధనా? వారికే సరిగ్గా తెలియదు.

జెమినిలో క'సాయి' కతలు

కోతికి కొబ్బరి కాయ దొరికితే ఎలా ఉంటుంది.. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెడితే ఎలా ఉంటుంది.. ఎలాంటి అర్హతలు లేని విజయవాడకు చెందిన చుండురి వెంకట సత్యనారాయణ ఉరఫ్ సాయి ఏకంగా జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్ అయిపోయాడు. ఇదంతా కాస్ట్, ఏరియా మహత్యం. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా సాయి ప్రసిద్దుడని మీడియా వర్గాలు ఘోషిస్తున్న అదే పెద్ద అర్హత అన్నట్లుగా జెమిని-సన్ టీవీ యాజమాన్యం అతన్ని తీసుకుంది. ఇతగాడి ఆగడాలకు జెమిని న్యూస్ సిబ్బంది భరించలేక పోతున్నారు. అన్ని తనకే తెలుసు అనే మూర్ఖత్వం ఉన్న సాయి ప్రతి ఒక్కరితో గొడవకు దిగుతూ.. గిట్టని వారికి టెర్మినేషన్ - షోకాజ్ నోటీసులు ఇప్పిస్తున్నాడు. ఇప్పటికే నలుగురి సబ్ ఎడిటర్లు ఇతగాడికి బలయ్యారు. సీనియర్లను సాగనంపి పూర్తిగా తనవారిని రిక్యుట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఉత్తుత్తి ఇంటర్ వ్యూలు పూర్తి చేసి అప్రూవల్ కోసం లిస్టు చెన్నై పంపాడని వినికిడి. తను చెప్పిన పైరవీ పనులు చేసే వారికి, పాద పూజలు చేస్తూ జోకే వారికే ముఖ్యమైన బీట్లు ఇస్తున్నాడు.. సాయి. ప్రస్తుతం మన కసాయి గారు జెమిని న్యూస్ జిల్లా రిపోర్టర్లను తొలగించే పనిలో ఉన్నాడు. తనకు రెగ్యులర్గా మామూళ్ళు పంపే వారిని జిల్లా రిపోర్టర్లుగా పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి. పీల గొంతు, ఆముదం తాగిన దేబ్యం మొహం కారణంగా టీవీ-9 యాంకరింగ్, డిబేట్లు నిర్వహించే అవకాశం రాని సాయి, జెమిని న్యూస్ లో తన గుల తీర్చు కుంటున్నాడు..పాపం జెమిని న్యూస్ ప్రేక్షకులు.. కోజ్జాలు, సెక్స్ వర్కర్లతో డిబేట్లు పెట్టి ఆనందిస్తున్నాడు. ఇటీవలే ఒక వేశ్య తన భర్తతో గొడవ పడితే.. మన కసాయి గారు జెమిని న్యూస్లో డిబేట్ పెట్టి.. కేస్ లేకుండా రాజి కుదిర్చి, అవతలి వైపు డబ్బు మింగాడు అని తెలిసింది. టీవీ 9 ఉన్నప్పుడు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో అసాంఘిక శక్తులతో కలిసి భారీ ఆస్తులు వేనుకేసుకున్న సాయి.. లీలలు మరికొన్ని బయటకు రానున్నాయి.

ఛానల్ 4 కు కష్టాలు తప్పవా?

చానెళ్ళు ప్రారంభించడం.. ప్రారంభించగానే లేదా ప్రారంభానికి ముందే తప్పుకోవడం శివరామకృష్ణకు బాగా తెలుసు. సీనియర్ జర్నలిస్టు శివరామకృష్ణ అధ్వర్యంలో.. కొందరు పెద్ద పారిశ్రామిక, రాజకీయ నాయకుల సహకారంతో ప్రారంభం కానున్న చానెల్ 4 గురించి జర్నలిస్ట్ వర్గాలు ఆసక్తిగా చర్చించు కుంటున్నాయి. జర్నలిస్టులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూతపడ్డ హెచ్.వై. టీవిని కొనుగోలు చేసి చానెల్ 4 గా మారుస్తున్నారు. ఇప్పటికే రిక్యుట్మెంట్లు పూర్తీ అయ్యాయి. దసరాకు చానెల్ 4 ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే చానెల్ 4 లో జీతాలు పెద్దాగా ఇవ్వట్లేదని వినికిడి. అసలు చానెల్ 4 కు ఈ పేరు ఎందుకు పెట్టినట్లో?.. ఇప్పటికే ఈ చానెల్ 4 పేరుతో బ్రిటన్లో ఒక టీవీ చానెల్ నడుస్తోంది. అదే పేరును ఎక్కడ వాడటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో టీవీ 5 విషయంలోనూ ఇదే గందర గోళం ఉందని ఎబౌట్ తెలుగు మీడియా హెచ్చరించడం.. అది నిజం కావడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది.
ఎనీ హవ్.. విష్ యు అల్ ది బెస్ట్ చానెల్ 4 ..

Monday, July 19, 2010

ఆ రెండు కోట్ల కథేంటి?

హైదరాబాద్ జర్నలిస్ట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. ఒక చానెల్ కు చెందిన ఘరానా రిపోర్టర్ ఒక భూమి వివాదం సెటిల్ చేయించడానికి రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ వ్యవహారం ఎక్కడో బెడిసి సదరు చానెల్ యాజమాన్యానికి తెలిసిపోయింది. ఎవరో వీడియో తీసి సీడీలు వారికీ పంపారట. సదరు యాజమాన్యం వారు వెంటనే ఈ రిపోర్టర్ చేత రిజైన్ చేయించారు. వారం రోజుల్లో ఈ కారణ జన్ముడికి మరో చానెల్లో ఏకంగా చీఫ్ ఎడిటర్ ఉద్యోగం దొరికింది. ఈ వాస్తవ కథలో పాత్రల పేర్లు సాయి, టీవీ-9 , జెమిని.. మరో మూడు మీడియా సంస్థల రిపోర్టర్ ల పేర్లు కూడా ఈ వ్యవహారంలో వినిపించినా, వారికి ఏ పాపం తెలియదని అందరు నమ్ముతున్నారు (?) జెమిని సంస్థ ఇంత సచ్చీలుడికి అంత పెద్ద ఉద్యోగం ఇవ్వడం లోని మతలబు ఏమిటో? అసలు జెమిని యాజమాన్యం ఇతగాడి గత చరిత్ర తెలుసుకొనే ఉద్యోగం ఇచ్చింద?
టీవీ 9 కు మాధవ్ రాజీనామా
టీవీ - 9 కు మరో షాక్. సీనియర్ జర్నలిస్ట్ మాధవ్ ఆ చానెల్కు రాజీనామా ఇచ్చేశాడు. జెమినిలో చేరడానికే రాజీనామా చేశాడని తెలిసింది. రవిప్రకాష్ నమ్మిన బంటు మాధవ్ రాజీనామాకు కారణం ఏమిటి? గతంలో రెండు సార్లు జెమినిలో పని చేసి అవమానకర పద్దతిలో రాజీనామా చేసిన మాధవ్ మళ్ళీ ఆ చానెల్లో ఎందుకు? చేరుతున్నాడు? నిజం నిలకడ మీదే తెలియాలి. మరో వైపు ఇటీవలే టీవీ 9 నుండి బయటకు వచ్చిన ఆలపాటి సురేష్, రవిప్రకాష్ మరో నమ్మిన బంటు గంగాధర్ కూడా జెమినిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది?

భారీ పెట్టుబడితో మరో కొత్త న్యూస్ ఛానల్

తెలుగులో మరో కొత్త న్యూస్ ఛానల్ రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తెలుగులో ఛానల్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. వారికి బెంగలూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో వార్త, వినోద టీవీ చానెళ్ళు తీసుకురావాలని ఈ సంస్థ భావిస్తోందని ఢిల్లీ జర్నలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే వారు తెలుగులో కొందరు సీనియర్లను సంప్రదించారని వినికిడి. జీతాలు కూడా భారీగానే ఇస్తారట. ఇప్పటికే తెలుగులో పలు ఛానళ్ళు నష్టాలతో నడుస్తుంటే వీరు ఏ ధైర్యంతో వస్తున్నారో మరి. బెస్టాఫ్ లాక్ దట్ ఛానల్.

దక్కన్ క్రానికల్ 19 - 07 - 2010


Sunday, July 11, 2010

' ఎబౌట్ తెలుగు మీడియా ' త్వరలో సొంత పోర్టల్ ద్వారా మీ ముందుకు రాబోతోంది. ప్రింట్, ఇ-ఎడిషన్లను త్వరలోనే వస్తున్నాయి. ఆసక్తి గల జర్నలిస్టులు abouttelugumedia@gmail.com. కి దరఖాస్తులు పంపవచ్చు.

జెమినిలో ఆర్.పి. ఏజెంట్-2

టీవీ-9 సాయి అలియాస్ విజయవాడ సాయి ఆ చానెల్ కు రిజైన్ చేసాడని తాజా వార్త. ఇది నమ్మలేని వార్తే.. రవి ప్రకాష్ కు నమ్మిన బంటు సాయి టీవీ-9 కు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి ? ఇందులో ఏదో తిరకాసు లేదా? సాయి ' జెమిని న్యూస్ ' లో చేరుతున్నట్లు సమాచారం. విజయవాడలో ఉండే సాయిని హైదరాబాద్ తెచ్చి సి.ఎం. బీట్ ఇవ్వడం ఏమిటి? ఇప్పుడు ఆయన రిజైన్ చేయడం ఏమిటి? ఇది డ్రామా కాదా? సాయికి, రవి ప్రకాష్ కు మనస్పర్ధలు వచ్చి రిజైన్ చేసాడంటే నమ్మే వెర్రి వాళ్ళు ఉన్నారా? అసలే ఇబ్బందుల్లో ఉన్న జెమిని న్యూస్ కు సాయి వెళ్ళడంలో గుడార్ధం ఏమిటి? రవి ప్రకాష్ ఆశిస్సులతోనే సాయి జెమినికి వెల్లుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జెమినిలో ఒక ఆర్.పి. ఏజెంట్ పని చేస్తూ ఆ చానెల్ నషణలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు సాయి వంతా? సాయి ని జెమినికి తేవడంలో అక్కడ పని చేయకుండానే జీతం తీసుకునే కృష్ణా జిల్లా / విజయవాడ వ్యక్తి కీలక పాత్ర వహించినట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తులను నమ్ముకునే జెమిని దెబ్బ తిన్నది. ప్రస్తుత సిబ్బందికే సరైన జీతాలు ఇవ్వలేని జెమిని, సాయికి టీవీ-9 లో తీసుకుంటున్న జీతం కన్నా అధికంగా ఇవ్వగాలదా? ఇప్పటికే జెమినిలో పని చేసున్న జర్నలిస్టులు చేసిన పాపం ఏమిటి? మంచి జీతాలు ఇస్తే ఇంతకన్నా బాగా వారు పని చేయలేరా? పొరిగింటి పుల్ల కూర రుచి అంటే ఇదేనేమో? అన్నట్లు సాయి పని చేసిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల జర్నలిస్టులను విచారిస్తే అతడి అవినీతి బాగోతాలను కథలు కథలు గా చెబుతున్నారు. ఇతగాడికి ' కసాయి ' అనే నిక్ నేం కూడా ఉంది సుమండీ..

ఉప ఎన్నికల్లో పెయిడ్ ఆర్టికల్స్ పై ఇ.సి. నిఘా

రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ పెయిడ్ ఆర్టికల్స్ పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు పత్రికలూ, చానెళ్ళు అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ప్రత్యేక వార్తలు, స్టోరీలు ఇచ్చాయి. డబ్బు ఇవ్వలేని అభ్యర్థులకు మీడియాలో సరైన ప్రచారం జరగలేదు. ఈ అమ్ధంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రెస్ కౌన్సిల్ కూడా ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ పెయిడ్ వార్తలను అరికట్టడం పై దృష్టి సారించినట్లు తెలిసింది.

రేటింగ్ లలో నిజమెంత?

టీవీ చానళ్ళ రేటింగ్ మయాజాలానికి అంతు లోకుండా పోతోంది. మన మీడియా సర్కిల్స్ లో ప్రతివారం చానెల్ రేటింగ్ పేరిట వస్తున్నఎస్.ఎం.ఎస్.ల మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఛానల్ రేటింగ్ల వెనుక ఏదో కుట్ర ఉందని పలువురు జర్నలిస్ట్ మిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు న్యూస్ చానెల్ రేటింగ్లు పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఈ రేటింగ్ లలో నిజమెంత? కొన్ని ఛానల్ లను ఆర్థికంగా నైతికంగా, మానసికంగా దెబ్బ తీయడమే ఈ రేటింగ్ల మాటలబా? ముఖ్యంగా ఒక చానెల్ టీవీ -9 తర్వాత స్థానంలో కనిపించడం లోని అర్థం ఏమిటి? నిజంగా ఆ చానెల్ కు అంత ప్రజాదరణ ఉందా అన్నది అనుమానమే? ఈ టీవీ - 2 ను రేటింగ్ లో 3 , 4 లేదా 5 స్థానానికి నెట్టడం లోని అంతర్యం ఏమిటి? ఇ.వి.ఎం. వోటింగ్ పైనే పలు సందేహాలు ఉన్న ఈ రోజుల్లో చానెల్ రేటింగ్ లను నమ్మడం ఎంత వరకు సమంజసం ? అసలు చానెల్ రేటింగ్లు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయి? చూసే వారెవరు? రేటింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ రేటింగ్ లెక్కల విశ్వసనీయత , చట్టబద్దత ఎంత? చాన్నాళ్ళ యాజమాన్యాలతో వీరికి ఉండే రహస్య సంబందాలు ఏమిటి?.. రేటింగ్లను అడ్డం పెట్టుకొని యాడ్లను తెచ్చుకుంటున్న చానెళ్ళు , తప్పుడు రేటింగ్ల కారణంగా యాడ్లు రాని ఛానళ్ళు .. ఈ రహస్య వ్యవహారాలపై ' ఎబౌట్ తెలుగు మీడియా ' నిఘా పెట్టింది. త్వరలో బండారం బయట పడనుంది.

Friday, January 29, 2010

ఎన్-టీవీలో స్టింగు రంగడి వేధింపులు..

ఐ-న్యూస్ వదిలిపెట్టి ఎన్-టీవీలో చేరిన రాజశేఖర్ తన వెంట సొంత పటాలాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ కీలక స్థానాల్లో ఉన్న జర్నలిస్టులను ప్రాధాన్యత లేని స్థానాలకు బదిలీ చేసి తన వారినందరినీ నింపేశాడు. కొంత మంది పాత జర్నలిస్టులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించేశారు. ఈ పరిణామాలు కొమ్మినేని శ్రీనివాస రావు లాంటి సీనియర్ జర్నలిస్టులకు మింగుడు పడకున్నా జాయమాన్య నిర్ణయాన్ని ఎదిరించలేక మౌనంగా తిలకిస్తున్నారు. స్టింగు రంగడి వేధింపుల నుండి తమను రక్షించాలని ఎన్-టీవీ జర్నలిస్టులు వేడుకుంటున్నారు.

జెమినిన్యూస్ చీఫ్ ఎడిటర్ గోవింద రెడ్డి

చుక్కాని లేని నావలా పయనిస్తున్న జెమిని న్యూస్ చానెల్ కు ఎడిటర్ గా సాక్షి టీవీ ఔట్ పుట్ ఎడిటర్ గా పని చేసున్న బి.టి.గోవింద రెడ్డి పేరు ఖాయమైందని తెలుస్తోంది. ఈ పోస్ట్ కోసం జెమిని పాత కాపులైన భావ నారాయణ, సతీష్ బాబు పేర్లు కుడ వినిపించాయి. సన్ నెట్ వర్క్ యాజమాన్యం మాత్రం జెమిని సీఈవో సంజయ్ రెడ్డి ప్రతిపాదనల మేరకు గోవింద రెడ్డి పేరు మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. సంజయ్ ' రెడ్డి 'తో గోవింద ' రెడ్డి 'కి ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని మీడియా వర్గాల సమాచారం. వీరికి 'జీ' టీవీలో పని చేస్తున్నప్పటి నుండి స్నేహ సంబంధాలు కొన సాగుతున్నాయి. గోవింద రెడ్డి వెంట జీ 24 క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ కూడా జెమినికి వస్తున్నాడు. గోవింద రెడ్డి వెంట జీ 24 క్రైం రిపోర్టర్ గౌసుద్దీన్ కూడా జెమినికి వస్తున్నాడు. ప్రస్తుతం గోవింద రెడ్డికి సాక్షిలో, గౌసుద్దీన్ కు జీ24లో కష్టకాలం మొదలైంది. అందుకే జీటీవీలో ఉన్నప్పుడు తనకు గన్ లైసెన్స్ ఇప్పించడంతో పాటు వ్యక్తిగత పనులు చేసిపెట్టిన కృతజ్ఞతతో సంజయ్ రెడ్డి వీరిద్దరికి జెమినిలో పునరావాసం కల్పిస్తున్నారని తెలుస్తోంది. ఆడవారంటే చొంగ కార్చుకునే గోవింద రెడ్డి, గౌసుద్దీన్ ల లీలలు మీడియా లోకంలో ఇప్పటికే ప్రసిద్దికెక్కాయి. గోవిందుడి లీలలపై జీ24 వైజాగ్ రిపోర్టర్ ఒక బహిరంగ లేఖనే రాశాడు. వీరిద్దరు తమ వెంట పెద్ద పటాలాన్నే జెమినికి తీసుకెళుతున్నట్లు సమాచారం. వీరి రాక సమాచారం తెలిసి జెమిని ఉద్యోగులు బిక్కు బిక్కుమంటున్నారు. ముఖ్యంగా మహిళలు...

జర్నలిస్టులకు గుణపాఠం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎలాంటి పరిశోధన లేకుండా ఒక చానెల్ మరో చానెల్ను చూసి గుడ్డిగా వార్తలు ప్రసారం చేయడం అందరికీ తెలిసిందే. ఎక్కడో రష్యాలో ఉన్న ఒక నిషేధిత పత్రికకు చెందిన పొర్టల్ రాజశేఖర రెడ్డి మరణంపై అల్లిన కల్పిత వార్తను గుడ్డిగా ప్రసారం చేయడం ద్వారా రాష్ట్రంలొ విధ్వంసానికి కారణమైన మన టీవీ చానెళ్ళను చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. ఇందులో తప్పెవరిదైనా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఖండించాల్సిందే. ఈ సంఘటనలో అసలు కారకులను గుర్తించకుండా కేవలం జర్నలిస్టులపైనే కేసులు పెట్టడం అన్యాయమే.

జర్నలిస్టులకు ప్లాట్లు ఇక లేనట్లేనా?

అందరూ ఊహించినట్లే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుంది. హైకోర్టు తీర్పుతో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇంతకాలం ఇళ్ళ స్థలాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకున్న జర్నలిస్టులకు నిరాశే మిగిలింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నా తీర్పు ఎన్నేళ్ళకు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఇతర మార్గ్ల్లో పొరాటం మేయాలని నిర్ణయించింది. అయితే ఇంత కాలం లక్ష రూపాయలు ఇరుక్కున్నాయని భయ పడ్డ జర్నలిస్టులకు సొసైటీ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయటం ఊరట కలిగించే విషయం. ఆలస్యంగా అయినా సొసైటీ పాలక వర్గం సభ్యులందరితో సమాచేశం నిరవహించి అపొహలు దురం చేయడం మంచిదైంది. లేకపోతే సొసైటీ సొమ్మునంతా దివాళా తీసిన రాజస్థానీ కంపనీలో పెట్టి నిండా ముంచిందని మీడియా టైంస్ రాసిన తప్పుడు రాతల్ని నమ్మల్సి వ్చ్చేది. ఈ సమయంలో రాజశేఖర రెడ్డే ఉన్నుంటే వెంటనే ప్రత్యమ్నాయ మార్గల్లో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించి ఉండేవారని జర్నలిస్టు మిత్రులు అంటున్నారు. తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ విషయంలో ఇప్పట్లో విధాన పరమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించటం లేదు.

Sunday, January 24, 2010

తివారి సంగతి సరే.. మన కతేంటి?

ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారి రాసలీలపై సాహసోపేతమైన వార్తను ప్రచారం చేసి ఆయన్ని సాగనంపడంలో సక్సెస్ అయింది. నిజంగా వారి పరిశోధన అద్భుతం. అయితే మన రాష్ట్ర మీడియాలో కూడా ఇలాంటి శృంగార పురుషులు ఉన్నారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి వారి లీలలు లోకానికి తెలియాల్సిన అవసరం లేదా?.. మీడియాలో మహిళ శీలాలతో ఆడుకుంటున్న నీచులు చాలా మందే ఉన్నారు. మీడియలో ఉద్యోగాలు ఇప్పిస్తామనో, మంచి బీట్లు ఇస్తామనో మహిళలను లోబరుచుకుంటున్న కొందరు ఘరానాల ఘన కార్యాలను వెలికి తీసే ' ఎబౌట్ తెలుగు మీడియా ' కృషికి సహకరించాల్సిందిగా మనవి.

సొమ్ము చేసుకున్న మీడియా

ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు కోసం మరొకడు ప్రయత్నించాడట. తెలుగు మీడియాకు ఈ సామెత సరిగ్గా అతుకుతుంది. రాష్ట్రంలో తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల ంధ్య మీడియాలో చీలిక చాలా స్పష్టం. టీవీ చానళ్ళు, పత్రికలు రెండు ఉద్యమాలకు వెనుక నుండి చక్కని సహకారాని అందిస్తున్నాయి. ఇందులో ఎవరి స్వార్ధం వారికి ఉంది మరి. తెలంగాణా వస్తుందో, సమైక్యంధ్రే నిలుస్తుందో తెలియదు కానీ ప్రజల మధ్య విభేదాలు శాశ్వతంగా నిలవడానికి మీడియా దోహద పడుతోంది. సమైక్యాంద్ర ఉద్యమానికి మద్దతుగా లగడపాటి రాజగోపాల్ దగ్గర లక్షలాది రూపాయల యాడ్స్ రాబట్టిన టీవీ చానళ్ళు అంతకు ఎక్కువే ప్రచారం చేసి పెట్టి సమైక్య నేతలకు సహకారాన్ని అందించాయి. మరో వైపు మేచినేని శ్రీనివాస రావు కూ టీవీ ప్రకటనలతో చక్కని ప్రచారం లభించింది.

విడిపోయిన మీడియా..

తెలంగాణా ఉద్యమం తెలుగు మీడియాలో అంతులేని విభేదాలను సృష్టించింది. రాష్ట్ర జర్నలిస్టులు ప్రాంతాల వారిగా విడిపోయారు. హైదరాబాద్ జర్నలిస్టులో సాధారణంగా తెలంగాణా జర్నలిస్టులే అధికం సహజంగా వీరంతా ప్రాంతీయ మమకారంతో తెలంగాణా ఉద్యమానికి బాహటంగా మద్దతు ఇస్తారు. ఈ విషయం ఆంధ్రా, రాయలసీమ జర్నలిస్టులకు మింగుడు పడనిదిగా మారింది. తెలంగాణా జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో సీమాంద్ర నాయకులను క్రాస్ క్వషన్లతో ఇబ్బంది పెడుతున్నారు. తమన్ అంటరానివారిగా చూస్తున్నారని సీమాంద్ర జర్నలిస్టులు వాపోతున్నారు. నిన్నటి దాకా మీదు మా ప్రాంతాన్ని, భాషను గేలి చేయలేదా, ఇప్పుడు కూడా మాపై ఆధిక్యత ప్రదర్షిస్తే ఎలా సహిస్తామని తెలంగాణా జర్నలిస్టులు ప్రష్నిస్తున్నారు. తెలంగాణా జర్నలిస్టులు తెలంగాణా జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసుకుంటే ప్రతిగా సీమాంధ్ర జర్నలిస్టులు సమైక్యంధ్ర జర్నలిస్టుల వేదికను పెట్టుకొని పని చేస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మద్య వచ్చిన చీలికను చూసి నేషనల్ మీడియా నవ్వుకుంటోంది. ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులు కొందరు తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా తమ వంతు లేబీయింగ్ నడుపుతూ కాంగ్రెస్ అధిస్టానానికి సమాచారాన్ని అందిస్తున్నారు. తెలుగు జర్నలిస్టుల మధ్య వచ్చిన ఈ చీలిక చాలా దురదృష్టకరం. జర్నలిస్టులు కుల, మత, వర్గ, ప్రాంత దృక్పదాలకు అతీతంగా వ్యవహరిసే సగం సమస్య పరిష్కారం అయినట్లే..