Saturday, November 20, 2010

త్వరలో బిజెపి టీవీ చానెల్..

రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి దిన పత్రిక, టీవీ చానెల్ ఏదో ఒక పార్టికి ఉపగ్రహంలా పై చేయడం కాదనలేని నిజం. యువనేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక దిన పత్రిక, ఒక చానెల్ నడుపుతుండగా, చంద్ర బాబు నాయడు తన కుమారునితో స్టూడియో -ఎన్ చానెల్ నడిపిస్తున్నారు. ఇతర పత్రికలూ, చానెళ్ళు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. మీడియాపై కాంగ్రెస్, టి.డి.పి.ల పెత్తనం కారణంగా ఇతర పార్టీల కార్యక్రమాలకు సరైన ప్రచారం లభించడం లేదు. టి.ఆర్.ఎస్. వారికి రాజ్ న్యూస్ ఎలాగూ ఉంది. వామపక్షాలకు సొంత దిన పత్రికలూ ఉన్నాయి. కాని బి.జె.పి. అది కూడా లేక పోవడంతో వారి కార్యక్రమాలకు తగినంత ప్రచారం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అవసరమని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఒక టీవీ చానెల్ తేవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి నేరుగా పత్రిక చానెల్ పెట్టాడు. కొందరు సానుభూతి పరులైన పారిశ్రామికవేత్తలతో చానెల్ పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి ఇదే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.

కసాయి పాలన.. దుర్మార్గం..

సన్ సంస్థ ఎలా నమ్మి వెంకట సత్యనారాయణ అలియాస్ సాయిని జెమిని న్యూస్ ప్రిన్సిపల్ ఎడిటర్గా పెట్టుకుందో దేవుడెరుగు.. అతడి ఆగడాలు భరించలేని స్థితిలో ఉన్నాయి. ఈ మిడిమిడి మేధావి తనకు తోడు మరో మహా మేధావిని తెచ్చి పెట్టుకున్నాడు. మార్గం లక్ష్మీ నారాయణ అనే ఇతగాడు జర్నలిజంలో చాల జూనియర్.. ఒక సాధారణ సబ్ ఎడిటర్ ను పట్టుకొచ్చి అవుట్ పుట్ ఎడిటర్ను చేసేసారు. నిజమే.. జెమినిలో ఏదైనా సాధ్యమే. ఆఫ్ట్రాల్ రిపోర్టర్ సాయి ఏకంగా న్యూస్ హెడ్ కాగా లేనిది.. మార్గం అవుట్ పుట్ ఎడిటర్ కావడంలో ఆశ్చర్యం ఏముంది బ్రదర్. సాయి లాగే ఆముదం తాగిన ముఖంతో కనిపించే మార్గం, సీనియర్, జూనియర్ అనే తేడ లేకుండా తోటి ఉద్యోగులతో చాల అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నాడని జెమిని వర్గాలు వాపోతున్నాయి. చిటికెలు వేస్తూ ఏకవచనంతో తోటి జర్నలిస్టులపై రంకెలు వేస్తూ అరిచే ఇతగాడికి ' దుర్మార్గం ' అనే పేరు స్థిర పడిపోయింది.
ఇక మన కసాయి గారి విషయానికొద్దాం.. సీనియర్లను వెళ్ళగొట్టి తన బ్రాండ్ జర్నలిస్టులను తెచ్చుకోవడానికి సాయి తెగ కష్ట పడుతున్నాడు. ఇటీవల ఫెర్ఫార్మెన్స్ అప్రైసల్ పేరిట పెద్ద ప్రహసనమే జరిగింది. తన వర్గానికి మంచి మార్కులు వేసి, అంతకన్నా మంచిగా పని చేసే వారికీ నామ మాత్రం మార్కులు వేసి యాజమాన్యానికి పంపాడు. ఫలితంగా దీపావళి బోనస్లో చాలా మందికి అన్యాయం జరిగి పోయింది. జెమిని టీవీలో నడుస్తున్న గుడ్డి దర్బారుకు ఈ ఫెర్ఫోర్మన్స్ అప్రైసల్ చక్కని ఉదాహరణ. ఇక యాంకర్ల విషయంలో సాయి ప్రవర్తనపై చాలా పిర్యాదులు ఉన్నాయి. సునితమైన ఈ అంశంపై ఎక్కువగా రాయడం బాగుండదని ఇంతటితో వదిలేస్తున్నాం..
తాజా వార్త .. టి.టి.డి. సేవ కుంభకోణంలో ఉన్న సాయి.. ఈ కేసు నుండి బయట పడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలను ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన పరపతితో విజిలెన్స్ నివేదికను ప్రభావితం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. మరిన్ని కసాయి వార్తలు త్వరలో..

మీకిది తగునా బాబు..

ఒకప్పుడు మీడియాను నియంత్రించిన చందబాబు నాయుడు, జర్నలిస్టులను పురుగుల్ల చూసే వారని చెబుతుంటారు. ప్రెస్ మీట్లో తనను వేలెత్తి ప్రశ్నించిన రిపోర్టర్ల ఉద్యోగాలు ఊడగొట్టిమ్చిన సందర్బాలు గతంలో చాల ఉన్నాయి. అందుకే ఆయనకు జర్నలిస్తులంటే చులకన భావం సహజం తాజాగా తన కుమారునితో పెట్టించిన టీవీ ఛానల్ ' స్టూడియో ఎన్ ' లో జర్నలిస్టులను అన్యాయంగా ఉద్యోగంలో నుండి తీసేసినా పట్టించుకోవడం లేదు. స్టూడియో -ఎన్ లో ఉద్యోగాలుఊడిపోయి రోడ్డున పడ్డ జర్నలిస్టు పరిస్థితి చాల దీంగా ఉంది. నిన్నటి దాక అయ్యో.. అని సానుభూతి వ్యక్తం చేసిన వారు ఇప్పుడు కూడా ఏమి చేయలేక మిన్నకుండి పోయారు. ప్రతి నిత్యం అందోళన చేయటం అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఫలితంగా చేసేదేమీ లేక ఉద్యోగాలు పోయిన స్టూడియో ఎన్ జర్నలిస్టులు పస్తులతో, అప్పులతో భారంగా జీవితం వెల్ల దీస్తున్నారు. బయట అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగం కోల్పోయిన స్టూడియో ఎన్ ఉద్యోగుల విషయంలో జర్నలిస్టు సంఘాలు అంతంత మాత్రం ఉద్యమాలు చేసి చేతులు దులుపుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వీరిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తే ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.