Wednesday, June 17, 2009

తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి

రోజులు మనవికానప్పుడు అనుకువగా ఒదిగి ఉండడమే మేలని మన పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి దీన్ని చక్కగా ఆచరిస్తున్నట్లు కనిపిస్తోంది. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రికావదం తధ్యమని గంపెడాశలు పెట్టుకున్న ఈ రెండు పత్రికలకి ప్రస్తుతం రోజులు బాగా లేవు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గతంలో మాదిరి దూకుడుగా బ్యానర్లు పెట్టి రాయకుండా సమ్యమణం పాటించడమే మేలని ఈనాడు, ఆంధ్రజ్యోతి భావిస్తున్నాయట. వీలైతే ప్రభుత్వాన్ని అవసరైనప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తడానికైనా వెనుకాడరాదని నిర్ణయించాయట. తెలుగుదేశంతో ఉన్న సంబంధ బాంధవ్యాల కారణంగా ఇప్పడికే ఉండవల్లి భారిన పడి మూడు చెరువుల నీరు తాగిన రామోజీరావు ఇక పోరాడే స్థితిలో లేరట?.. ఇక తన వంతేమోనని రాధాకృష్ణ హడలిపోతున్నారట?..