Tuesday, July 1, 2008

వైట్ల రమేశ్ పై దాడి సంగతేంటి?

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు అరెస్టు ఎపిసోడ్లో మంద కృష్ణ మాదిగపై ఒంటికాలితో లేచిన మీడియా సోదరులు, జర్నలిస్టు సంఘాలు ఎన్-టీవీ రిపోర్టర్ వైట్ల రమేష్ పై చిరంజీవి అభిమానులు చేసిన దాడిపై అంతగా ఎందుకు స్పందించడం లేదు?.. నామమాత్రపు నిరసనతో ఎందుకు ఆగిపోయినట్లు? ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేయలేదు? ఇవి కేవల మంద కృష్ణ వేసున్న ప్రశ్నలు కాదు? ప్రతీ జర్నలిస్టు మదిలో ఉదయిస్తున్న సందేహాలు. వైట్ల సుందరయ్య హాలు వద్ద రమేష్ పై దాడి చేసిన చిరంజీవి అబిమానులను పోలీసులు ఇంతవరకూ అరెస్టు చేయలేదు. చిరంజీవి వైట్ల రమేష్ కు ఫోన్ చేసి సారీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ చేసి సారే చెబితే సరిపోతుందా? బహిరంగంగా క్షమాపణలు చెప్పల్సిన అవసరం లేదా? హీరో రాజశేఖర్ పై దాడి విషయంలో చిరంజీవి మీడియా సమక్షంలో సారీ చెప్పడం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయం చిరంజీవికి సంబందించినది కావడంతో ఎన్-టీవీ యాజమాన్యం రాజీ పడ్డస్తు వస్తున్న వార్తల్ని నమ్మక్ తప్పడం లేదు. ఆంధ్రజ్యోతికి ఒక న్యాయం, వైట్ల రమేష్ కు మరో న్యాయమా? జర్నలిస్టు సోదరులే చెప్పాలి.