Thursday, September 20, 2007

అక్టోబర్ 2న 'టీవీ-5' ప్రారంభం

తెలుగులో మరో శాటిలైట్ ఛానెల్ 'టీవీ-5' అక్టోబర్ 2న ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ ఛానెల్ దగ్గరా లేనంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని టీవీ-5 ఉపయోగించ బోతోందని సమాచారం. టెక్నాలజీ + మీడియా పేరిట హైదరాబాద్ లోని పలు కూడళ్ళలో టీవీ-5 ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే టీవీ-5 టెస్ట్ సిగ్నల్ ఆరంభమైంది. ఫీల్డ్ పైన్ టీవీ-5 రిపోర్టర్లు గత 5-6 నెలలుగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. టీవీ-5లో ఎందరో హేమాహేమీ జర్నలిస్టులు కనిపిస్తున్నారు. బి.ఆర్. నాయుడు ఛైర్మన్ గా, శివరామ ప్రసాద్ ఎం.డి.గా ఇటీవలే అక్కడ చేరిన కొమ్మినేని శ్రీనివాస్ రావు, కరీం మొదలు బ్రహ్మానంద రెడ్డి, కందుల రమేష్, ఐ.సత్యనారాయణ, భాస్కర్, కన్నెగంటి.. టీవీ-5ను లీడ్ చేయబోతున్నారు. అయితే రిపోర్టర్లలో పేరున్న తలకాయలు అంతగా కనిపించడం లేదన్నది 100 శాతం సత్యం. అందరూ పల్లకి ఎక్కిన వాల్లే (బాస్) కనిపిస్తున్న టీవీ-5 తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ప్రారంభమైతే కానీ తెలియదు. టీవీ-5 యాజమాన్యం ఇటీవలే చేరిన కరీం ఏదో చేస్తాడని గట్టిగా నమ్ముకుంటోందట. ఈ మాజీ రవిప్రకాశ్ శిష్యున్ని చంద్రబాబు నాయుడు టీవీ-5కు రికమండ్ చేశారని ప్రచారం జరుగుతోంది.. టీవీ-5 కూడా 'ఎన్-టీవీ'లా నిరుత్సాహ పరచదని ఆశిద్దాం.. Best of Luck TV5