Thursday, September 13, 2007

ఎన్-టీవీకి కొమ్మినేని గుడ్ బై.. టీవీ-5లో చేరిక..

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కె.ఎస్.ఆర్) బుడ్ బై చెప్పారు. నరేంద్ర చౌదరి, రామానుజంలతో సరిపడక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ వ్యయంతో అట్టహాసంగా ప్రారంభమైన ఎన్-టీవీ ఆశించిన రీతిలో క్లిక్ కాకపోయేసరికి కొమ్మినేనిపై నరేంద్ర చౌదరి గుర్రుగా ఉన్నారని ఎన్-టీవీ వర్గాలు తెలిపాయి. ఇందుకు పూర్తిగా కొమ్మినేనినే బాధ్యున్ని చేయటంతో ఆయన మనస్థాపం చెందిని రాజీనామా చేశారని అంటున్నారు. మరో వాదన ప్రకారం కొమ్మినేని తెలుగుదేశం పక్షపాతి అయినందువల్లే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్-టీవీ ఆయన్ని వదిలించుకుందని అంటున్నారు. ఎన్-టీవీలో మంత్రి షబ్బీర్ అలీ కూడా భాగస్వామి అని వస్తున్న వార్తలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఏది ఏమైనా కొమ్మినేని విషయంలో ఎన్-టీవీ యాజమాన్యం తొందర పడిందేమో? (లేక కొమ్మినేనే తొందర పడ్డారా?) 'న్యూస్ టైం' పత్రికను నడపడంలో విఫలమైన రామానుజం ఇక ఎన్-టీవీని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి. ఎన్-టీవీ నుండి బయటకు వచ్చిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-5లో చేరబోతున్నారు. ఎవరికి వారే బాసులుగా ఫీలయ్యే టీవీ-5లో కొమ్మినేని ఎలా నెట్టుకొస్తారో చూడాల్సిందే. అసలు ప్రింట్ మీడియాలో సుధీర్ఘ అనుభవం ఉన్న కొమ్మినేని ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి తప్పు చేశారేమో?.. జర్నలిజంలో తలపండిన మేధవిగా, రాజకీయ విశ్లేషకునిగా పేరొందిన కొమ్మినేని శ్రీనివాస రావు టీవీ-9, జెమిని న్యూస్ చర్చా వేదికల్లో పాల్గొని తన వాదనలతో అందరినీ మెప్పించారు. ఈ అనుభవంతో ఆయన తొందరపడి ఎలక్ట్రానిక్ మీడియాలో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాలని ఆశపడి ఉంటారు. కాని 'గ్లామర్ ' ప్రపంచం ఆయన్ని గుర్తిస్తే కదా?.. చూద్దాం కొమ్మినేని టీవీ-5లో ఏ అద్భుతాలు సృష్టిస్తారో..