Tuesday, August 7, 2007

ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం దౌర్భాగ్యం..

ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రస్తుతం ఒక సంఘమనేది ఉందా? ఉంటే ఏంచేస్తోంది? శైలేశ్ రెడ్డి పై అసంతృప్తితో పోటీ సంఘాన్ని పెట్టి దానికి జనార్ధన్ అనే సీ చానెల్ బ్యూరోచీఫ్(ఇప్పుడు మాజీ) ను ప్రసిడెంట్ గా పెట్టిన పెద్ద మనుషులు ఇప్పుడేం చేస్తున్నారు? ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టుల సంఘంగా చెప్పుకునే నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పైరవీలు చేసుకోవడం తప్ప జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నదేమీలేదు. ఇళ్ళ స్థలాల పేరిట తరచూ మభ్యపెడుతుండే ఈ సంఘం జర్నలిస్టుల కోసం ఒక్క శిక్షణా శిభిరమైనా నిర్వహించిన పాపాన పోలేదు. సదరు అధ్యక్షుల వారు సీ చానల్ నుండి తొలగింపబడి కొత్త చానళ్ళలో అవకాశాల కోసం తిరుగుతున్నారు. జెమిని బ్యూరో చీఫ్ గా వెల్లుతున్నానని బయట చెప్పుకుంటున్నాడట(?) జనార్ధన్ అధ్యక్షతన ఏర్పడ్డ ఈ పోటీ సంఘానికి రెండున్నర ఏళ్ళవుతున్నా ఎన్నికలు జరపలేదు. అంటే జనార్ధన్ జీవిత కాల అధ్యక్షుడుగా ఉండాలని సోకాల్డ్ పెద్దలు కోరుకుంటున్నారా?

మరోవైపు చక్కని కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న కెమెరామెన్ల సంఘం ఇటీవలే ఎన్నికలు జరుపుకుంది. వీరిని చూసైనా జర్నలిస్టుల సంఘం బుద్ది తెచ్చుకోవడం మంచిది.