Sunday, August 26, 2007

టీవీ-9లో మాధవ్.. అవాక్కయ్యారా?..

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో రవిప్రకాశ్ ను అందరికన్నా ఎక్కువగా వ్యతిరేకించే వ్యక్తి మాధవ్. మాధవ్ ఈ శనివారం హఠాత్తుగా రవిప్రకాశ్ ను కలుసుకొని టీవీ-9లో చేరిపోయాడు. ఈ పరిణామంతో చాలా మంది జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. మాధవ్ ఒకప్పుడు రవిప్రకాశ్ కు ఎంతో సన్నిహితుడు. సిటీకేబుల్ కు రవిప్రకాశ్ రాజీనామా చేయగానే అప్పటి దాకా అక్కడే రిపోర్టర్ గా ఉన్న మాధవ్ కూడా ఆయన్నే అనుసరించి జెమినిలో చేరాడు. కాలక్రమంలో కరీం చేరువ కావడం రవిప్రకాశ్ అక్కడక్కడా సూటిపోటి మాటలు అనడం, అవి మాధవ్ కు తెలిసి బాధ పడటం వీరిద్దరితో పరిచయం ఉన్న సన్నిహితులకు బహిరంగ రహస్యమే. నమ్మకంగా పనిచేసే మాధవ్ ను రవిప్రకాశ్ నిర్లక్షం చేశాడని అంతా అనుకుంటుంటారు. రవిప్రకాశ్ జెమినిని వీడి టీవీ-9ని స్థాపించాక మాధవ్ కు కష్టాలు ఆరంభం అయ్యాయి. జెమిని యాజమాన్యం మాధవ్ ను రవిప్రకాశ్ ఏజెంట్ గా అనుమానించటంతో ఆ సంస్ఠకు రిజైన్ చేయక తప్పలేదు. కొంత కాలం జీ-తెలుగులో పనిచేసిన మాధవ్ ను జెమిని యాజమాన్యం మళ్ళీ పిలిపించి కో-ఆర్డినేటర్ జాబ్ ఇచ్చినంది. తిరిగి కొద్ది నెలల్లోనే మాధవ్ యాజమాన్యంతో పడక జెమినికి రాజీనామా ఇచ్చాడు. తాజాగా రవిప్రకాశ్ తో రాజీపడ్డ మాధవ్ ను విజయవాడ కో-ఆర్డినేటర్ గా నియమించారని టీవీ-9 వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి వరకు రవిప్రకాశ్ ని వ్యతిరేకించే జర్నలిస్టులకు అప్రకటిత నాయకుడిగా ఉన్న మాధవ్ తీసుకున్న తాజా నిర్ణయం వారందరిని ఖంగు తినిపించింది. పొట్ట తిప్పల కోసం తనకు నచ్చిని చోట రాజేపడి పని చేసే హక్కు ప్రతి జర్నలిస్టుకు ఉంటుంది.. కాదనలేం. కొత్త జాబ్ లో ఐనా మాధవ్ నిలకడగా పని చేస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే మాధవ్ ఎక్కడ పని చేసినా ఎక్కువ రోజులు ఉండడని ఆయన స్వభావం తిలిసిన రిపోర్టర్లు చెబుతుంటారు. ఎ అమాటకు ఆ మాటే చెప్పలి మాధవ్ చాలా సిన్సియర్ జర్నలిస్ట్..
కొసమెరుపు: మాధవ్ టీవీ-9లో చేరటం వల్ల రవిప్రకాశ్ క్రెడిబిలిటీ పెరిగినట్టే కదా..