Thursday, December 13, 2007

టీవీ-5 శవాల వ్యాపారం

తెహల్కా వాళ్ళు ఒకసారి స్టింగ్ ఆపరేషన్ల కోసం వ్యభిచారిణులను వాడుకోవడంపై పెద్ద రచ్చ జరగటం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీవీ-5 ఛానెల్ అంతకన్నా నీఛానికి ఒడిగట్టింది. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలను అమ్ముతున్నారని నిరూపించేందుకు టీవీ-5 వారు ఏకంగా శవాలను కొన్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. శవాను కొన్నాక ఏమి చేసుకోవాలో తెలియక అక్కడే వదిలి వెళ్ళారు. మార్చురీ సిబ్బంది కంగారులో మూసీలోకి తోయడం, మరునాడు రచ్చ జరిగి పోవడం అందరికీ తెలిసిన విషయాలే. సంచలన వార్తల కోసం ఇంత కక్కుర్తి పడటం సరైన పనేనా? టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి ఇంత అసహ్యమైన పనులకు దిగజారడం అవసరమా. వీరికన్నా వయభిచారిణులే నయం. వారు పొట్ట కూటికే వ్యభిచరిస్తారు తప్ప సమాజానికి అంతగా హాని చేయరు.
కొసమెరుపు: శవాల వ్యాపారం స్థాయికి దిగజారిన టీవీ-5పై పోఅలీస్ కేస్ నమోదై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు టీవీ-5 వారు మీడియా స్వేచ్చ అంటూ సిగ్గు లేకుండా జర్నలిస్ట్ సంఘాల మద్దతు కోరుతున్నారు.