Tuesday, November 27, 2007

జెమినిలో ఇక సతీష్ బాబు మార్క్

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ బాధ్యతలను చేపట్టిన సతీష్ బాబు ఛానెల్ ప్రక్షాళన ఆరంభించారు. జెమిని న్యూస్ ను సమూలంగా మార్చే దిశగా కొత్త యాంకర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లను కొత్తగా తీసుకుంటున్నారు . తనదైన కార్యక్రమాలతో ఛానెల్ కు కొత్త రూపం తేవాలన్నదే ఆయన తాపత్రయం. నాలుగు ఓబీ వ్యాన్లను కూడా తెప్పిస్తున్నారట. అయితే మార్పుల్లో భాగంగా సతీష్ బాబు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. జెమిని న్యూస్ లో తన వర్గానికి ఉపాధి కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా యాజులును తప్పించి రామకృష్ణ అనే తన పాత కాపును తెచ్చి డెస్క్ ఇంఛార్జ్ గా నియమించారు. ఆయన వింత చేష్టలు డెస్క్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారాయట. అలాగే సబ్జెక్ట్ లేకుండానే అపర మేధావిగా చెలామణి అవుతున్న గమిడి శ్రీనివాస్ ను కో ఆర్డినేటర్ గా నియమించారు.
' బ్లాగులున్నాయి జాగ్రత్త.. '
సతీష్ బాబు ఛీఫ్ ఎడిటర్ గా చేరగానే జెమిని న్యూస్ సిబ్బందితో సమావేషమై ' మనం చర్చించుకునే విషయాలు బయటకు చెప్పకండి. బ్లాగుల్లో పెడతారు ' అని హెచ్చరించారట. తాను జెమిని ఎడిటర్ గా వస్తున్న విషయం బ్లాగ్ల ద్వారా ముందుగానే ప్రచారం కావటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ' ఎబౌట్ తెలుగు మీడియా ' అకారణంగా ఎవరిపైనా బురద చల్లదని, సతీష్ బాబుపై అపార గౌరవం ఉందని.. ఆయన చేస్తున్న మంచి పనులకు తోడ్పాటు అందిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం.