Wednesday, July 18, 2007

'మా' శర్మ ఔట్.. 'జెమిని 'లో పైరవీలు..

మాటీవీ బ్యూరో చీఫ్ రాజేశ్వర్ శర్మ ఆ సంస్థకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. 'మా' కర్మగా పేరు తెచ్చుకున్న శర్మ అవమానకర పరిస్తితుల్లో విధులకు డుమ్మ కొట్టాల్సివచ్చింది. ప్రతి ఒక్కరిని అనుమాన దృష్టితో చూసే శర్మ శాడిజానికి విసుగెత్తిన రిపోర్టర్లంతా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. శర్మ అవినీతి వ్యవహారాలను తెలుసుకున్న 'మా' యాజమాన్యం ఆయన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గా రివర్ట్ చేసింది. దీన్ని ఎంతో అవమానంగా భావించిన శర్మ ఆ 'మా' నుండి వైదొలగాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. వెలుతూ వెలుతూ శర్మ అందరికి మిఠాయిలు పంచాడట. శర్మను సాగనంపటంలో 'విస్సా శ్రీధర్ ' పాత్ర ఉందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రాజేశ్వర్ శర్మ తన మాతృ సంస్థ 'జెమిని ' కి బ్యూరోచీఫ్ గా వెల్లేందుకు చెన్నై వెళ్ళి పైరవీలు చేస్తున్నాడు. ఇక జెమినిన్యూస్ సిబ్బందిని ఆ దేవుడే కాపాడాలి. పూర్వాశ్రమంలో జెమిని రిపోర్టర్లు కూడా కర్మ బాధితులే..