
Thursday, November 13, 2008
జెమినిలో ఏం జరుగుతోంది?

బ్యూరో చీఫ్ పీఠం అధిష్టించిన మోనార్క్
అతనో మోనార్క్.. తానేదో గ్రహం నుండి ఊడి పడ్డ మానవాతీతుడినని భావిస్తుంటాడు.. ఇతరుల్ని అల్పులుగా భావిస్తాడు.. మార్క్స్ తర్వాత అంతటి గొప్ప వీర కమ్యూనిస్టుగా గొప్పలు చెప్పుకుంటాడు.. కానీ అణువణువునా బూర్జువా లక్షణాలు, వల్లంతా కుల గజ్జి.. ఒక వామపక్ష పత్రికలో పని చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చాడు. కానీ ఒక్క వాక్యం కూడా సక్రమంగా రాయలేడు. అవసరమైన చోటల్లా కులం కార్డ్ ఉపయోగించుకునే ఈ వీర మార్క్సిస్ట్, తాను పని చేసే ఛానెల్లో నిర్వహించిన చర్చా వేదికలకు ఆహ్వానించే నాయకుల వద్ద చేతివాటం ప్రకటించే సరికి యాజమాన్యం ఇతగాడిని కొంత కాల పక్కన పెట్టింది. పైరవీలకు తోడు, తోటి జర్నలిస్టులకు డబ్బు తీసుకొని ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాడని వినికిడి. అన్ని బీట్లు తనకే కావాలని అత్యాశపడే ఇతగాడితో సదరు ఛానెల్లోనే కాకుండా బయటి జర్నలిస్టులతో కూడా సత్సంబంధాలు లేవు. కులం చలవతో తోటి రిపోర్టర్లపై, కెమెరామెన్లపై యాజమాన్యానికి పితూరీలు చెప్పడం ఇతగాడి హాబీ. తాజాగా ఈ వీర కమ్యూనిస్టు కొత్తగా వస్తున్న ఊరవతలి చానెల్లో బ్యూరో చీఫ్ గా చేరినట్లు వినికిడి. ఇందు కోసం కులం కార్డును బలంగా ఉపయోగించుకున్నడని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇతగాడు అక్కడ చేరాడని తెలిసి ఇతర సీనియర్ జర్నలిస్టులు అక్కడ చేరేందుకు వెనుకాడుతున్నరనేది తాజా వార్త. ఇతగాడిని చేర్చుకునే ముందు సదరు ఛానెల్ ఫీల్డ్ లో విచారించి, రాత పరీక్ష కూడా జరిపి ఉంటే టాలెంట్ ఏపాటిదో తెలిసేది.
Monday, November 3, 2008
స్వకుచ మర్దనం

దిన పత్రికలా?.. కర పత్రలా?..
తెలుగు దిన పత్రికల్లో మునుపెన్నడూ లేని కొత్త సాంప్రదాయం గత కొద్ది నెలలుగా కనిపిస్తోంది. అదే జాకెట్ ఆడ్స్. గతంలో ప్రకటనల విష్యంలో మన దిన పత్రికలు కొన్ని విలువలను, నియంత్రణల్ని పాటించేవి. తొలి పేజీలో ఇయర్ పానల్స్ తో పాటు కుడి వైపు దిగువ ప్రాంతంలో పావు పేజీకి మించి ప్రకటనలు స్వీకరించేవి కాదు (ముఖ్యంగా ఈనాడు). ఆ తర్వాత తొలి పేజీలో అర పేజీ ప్రకటనలు ప్రారంభం అయ్యాయి. అనంతర కాలంలో మార్కెట్ వర్గాల వత్తిడి కారణంగా ఇంటర్నేషనల్ ఫార్మెట్ పేరిట దిన పత్రికల సైజు తగ్గినంది. తొలి పుట నిండా ఒకే ప్రకటన ఇచ్చే ధోరణి మొదలైంది. దీన్నే జాకెట్ యాడ్ అంటున్నారు. మన దేశంలో ఈ సాంప్రదాయానికి బహుషా టైంస్ ఆఫ్ ఇండియా ఈ దుష్ట సాంప్రదాయాన్ని ప్రారంభించిందని చెబుతారు. తేరగా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం మడిగట్టుకు కూర్చుంటారు?. ప్రస్తుతం మరో కొత్త ధోరణి తెలుగు దిన పత్రికల్లో ప్రారంభమైంది. ప్రభుత్వం తొలి పేజీలో బ్యానర్ వార్త స్థానంలో అచ్చం వార్త లాగే ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా ఏది వార్తో, ఏది ప్రకటనో పాఠకులు పోల్చుకోలేక పోతున్నారు. చంద్రబాబో, చిరంజీవో ఒక భారీ సభ పెడితే తొలి పుటలో హెడ్ లైన్ వార్తగా రావడం సహజం. అయితే ప్రభుత్వం పత్రికలకు జాకెట్ ఆడ్స్ ఇవ్వడంతో అసలు వార్తలు పక్కకు పోయి ముఖ్యమంత్రి ఘన కార్యాలు తొలి పేజీలో చోటు చేసుకుంటున్నాయి. జాకెట్ యాడ్స్ వికృతానికి పరాకాష్ట నవంబర్ ఒకటో తేది నాటి తెలుగు దిన పత్రికలు. ఈ దుష్ట సాంప్రదాయానికి అంతం లేదా? ఆదాయం కోసం పత్రికలు ఇంతగా దిగజారటం అవసరమా?
Sunday, October 26, 2008
ఆయన బిజినెస్ మూడు పూవులు.. ఆరు కాయలు..

Thursday, October 23, 2008
మీడియా గురవిందలు

ఇటీవల దాడికి గురైన జర్నలిస్ట్ ఛానెల్లోనే పని చేసే మరో సీనియర్ జర్నలిస్టుదీ ఇదే కథ. ఇతగాడు కట్టుకున్న భార్యను వంచించి ఒక అగ్ర సినీ దర్శకుని కార్యాలయంలో పని చేసే మహిళను పెళ్ళాడాడు(?) సదరు పుణ్య పురుషుడు గతంలో తాను పని చేసిన చానెల్ నుండి బోగస్ సర్టిఫికెట్ సృష్టించి తన ప్రియురాలికి ఇంటి జాగా కోసం దరఖాస్తు చేయించి పట్టు బడ్డాడు.
కర్మగా పేరొందిన ఒక శాడిస్ట్ జర్నలిస్టు రెండో ఇల్లు నడుపుతూ ధర్మపత్నికి అన్యాయం చేస్తున్నాడు. ఈ నెం.2 కూడా ఇతగాడి శాడిజాన్ని భరించలేక పోతోందిట.
ప్రతిక్షణం .. అంటూ వార్తల కోసం తహ తహ లాడే ఒక ఛానెల్లో పని చేసే ప్రబుద్దుడు తోటి (వివాహిత) మహిళా జర్నలిస్టుతో పెళ్ళి చేసుకోకుండానే కాపురం పెట్టాడు. వీరిద్దరూ గతంలో ప్రముఖ ఛానెల్లో కలిసి పని చేసిన వారేనట. ఈ ప్రబుద్దుడు సదరు మహిళా జర్నలిస్టుకు ఒక ఫ్లాట్ కూడా కొని పెట్టాడట.
టీవీ/పత్రిక నడిపే జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ పై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు తానే ఆధ్యున్నని చెప్పుకొనే ఓ ప్రముఖునిపై కూడా ఇదే తరహా ఆరోపణలు ఉన్నాయి.
గురవింద జర్నలిస్టులారా(ముఖ్యంగా ఎలక్ట్రానిక్).. సమాజానికి నీతులు చేప్పే ముందు మీ కింద ఒకసారి చూసుకోండి.
Sunday, October 12, 2008
ఓ యాంకర్ రాజీనామా..
క్రిమినల్ ఔట్ సోర్సింగ్ కింద నడిచే న్యూస్ ఛానెల్లో పని చేయనని ప్రకటించి ఒక యాంకర్ రాజీనామా చేసింది. తమిళ యాజమాన్యం కింద నడిచే సదరు ఛానెల్ సిబ్బంది తీవ్ర ఆందోళన పడుతున్నారు. తమ ఉద్యోగాల విషయంలో స్థానిక యాజమాన్యం పెదవి విప్పక పోవడంతో రాజీనామాలకు సిద్దం అవుతున్నారు. ఔత్ సోర్సింగ్ అనేది గాలి వార్తే అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ తీసుకుంటున్న ఆ ప్రముఖుడు కీలక ఉద్యోగాలను తన అనుచరులతో నింపేయడంతో తమ పరిస్థితి ఏమిటని సీనియర్లు ఆవేదనలో పడ్డారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న రిపోర్టర్ల స్థానంలో తమ వారిని భర్తీ చేసే ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ ఔట్ సోర్సింగ్ తతంగంలో చెన్నై చినబాబు, మూత పడ్డ బ్యాటరీ కంపనీ యజమాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బాధ్యత లేని ఛానెళ్ళు

ఇటీవల ప్రముఖ బ్యాంక్ కష్టాల్లో ఉన్నట్లు వచ్చిన నిరాధార వార్త ఖాతాదారుల్ని భయ పెట్టింది. ఆ బ్యాంక్ ఏటీఎంల ముందు పెద్ద సంఖ్యలో ఖాతా దారులు బారులు తీరడంతో నిమిషాల్లో డబ్బు ఖాళీ అయింది. ప్రజలు దాడులు జరిపి బ్యాంక్ ఆస్థులకు నష్టం కలిగించారు.
ఎక్కడో బర్డ్ ఫ్లూ వస్తే దాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆపాదించడంతో ఫౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలింది. ఆ తర్వాత ముడుపులు తీసుకొని పాజిటివ్ వార్తలు ఇచ్చారట.
ఒంగోలులో ఒక వ్యక్తి కలేక్టరేట్లో విషం తాగి ఆత్మ హత్య చేసుకుంటుంటే అతడు చచ్చే దాక చిత్రీకరించిన ఛానెళ్ళ ప్రతినిధులు కనీసం ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయలేదు.
ఒక మాజీ శాసన సభ్యుడు హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కునుకు తీస్తే అతడు మరణించాడనే వార్త ప్రసారం చేసి ఖంగారు పెట్టారు.
వ్యక్తిగత విషయాలను కూడా సంచలన వార్తలుగా ప్రసారం చేస్తున్న కొన్ని ఛానెళ్ళు మున్ముందు శోభనాల్నీ వదవలవేమో. ఇలాంటి వార్తకు ఆగ్రహించిన ఒక సినీ నటుడు ఓ ఛానెల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడి ఉన్నత ఉద్యోగిని ఒక్కటి పీకి వచ్చాడట.
భార్య కూరలో ఉప్పు ఎక్కువేసిందని అలిగి టవరెక్కే వెధవాయిలకు కూడ లైవ్ కవరేజి ఇచ్చే రోజులు రాబోతున్నాయి.
Wednesday, October 1, 2008
క్రిమినల్ చేతిలో న్యూస్ ఛానెల్

ఈ ఛానెళ్ళు ఎంత కాలం ఉంటాయి?

Tuesday, September 9, 2008
పైరవీ కొద్దీ ఉద్యోగం..
సిబిసి, ఆర్ టీవీ ఇక రావా?
అదిగో వస్తుంది.. అంటూఅ చెప్పుకున్న సిబిసి చానెల్ ఇక రాదని రూడీ అయింది. కొద్ది నెలలుగా ప్రెస్ మీట్లు, ప్రోగ్రాం లకు మైకులు పట్టుకొని వచ్చి హంగామా చేసిన సిబిసి జర్నలిస్టులకు ఇక తమ చానెల్ వచ్చే అవకాశం లేదని తెలిసి ఇతర చానెళ్ళలో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. తెలుగుగులో పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్న న్యూస్ చానెళ్ళ ముందు పోటీ పడలేమని తెలిసే సదరు యాజమాన్యం చానెల్ ప్రతిపాదన విరమించుకున్నాట్లు బోగట్టా. ఇక రాయుడు టెలివిజన్(ఆర్టీవీ)దీ ఇదే పరిస్థితి. ఉప్పల్ లో అత్యాధునిక స్టూడియోలు నిర్మించుకున్న ఆర్టీవీ ఇంతవరకూ పూర్తి స్థాయిలో జర్నలిస్టులను నియమించుకోలేదు. ఆర్ టీవీ చీఫ్ ఎడిటర్ బాల గంగాధర్ చానెల్ ప్రారంభంలో జరుగుతున్న జాప్యాన్ని భరించలేక రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో జర్నలిస్ట్ యూనియన్ నేత ఆంజనేయులును నియమించారు. ఖర్చుకు వెనుకాడుతున్న ఆర్ టీవీ యాజమాన్యం తక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నందువల్లే జర్నలిస్టులేవరూ అక్కడ చేరటానికి ఆసక్తి చూపడం లేదని వినికిడి. ఆర్ టీవీలో న్యూస్ కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న పాత కాలం జర్నలిస్టు బసవేశ్వర రావు సదరు రాయుడు గారిని తప్పు దోవ పట్టిస్తున్నారట.
Saturday, August 23, 2008
ఏసియా నెట్ ' శివ ' లీలలు

Thursday, July 3, 2008
వేతనాలు పెంచి సాక్షికి పోటీగా నిలిచిన టీవీ-9

Tuesday, July 1, 2008
' ధనార్జన ' రాజకీయాలు
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వెగటు కలిగిస్తున్నాయి. చందూ జనార్ధన్ తనకు తాను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు టీవీల్లో స్క్రోలింగ్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకునే సరికి జర్నలిస్టు సోదరులంతా అవాక్కయ్యారు. అసలు ఎన్నిక ఎప్పుడు జరుగింది? ఎన్నుకున్నది ఎవరు? ఇదే విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా సంఘ సభ్యులు నిలదీసే సరికి జనార్ధన్ క్షమాపణలు చెప్పుకున్నడట. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. ఆంధ్రజ్యోతి ఎపిసోడ్లో భవిష్యత్తు పోరాటంపై చర్చించేందుకు ఎలక్ట్రానిక్ మీడియా సంఘం సమావేషమైంది. ఆ సమావేశానికి వచ్చిన జనార్ధనుడు అసలు ఈ సంఘానికి తానే అధ్యక్షున్నని, తాను ఉద్యోగ రీత్యా ఢిల్లీ పోయినప్పుడు తనకు తెలియకుండా హరిప్రసాద్ ఎన్నుకున్నారని గొడవ పడ్డాడు. తనను కనీసం గౌరవ అధ్యక్షునిగానైనా నియమించాలని వేడుకునే సరికి మిగతా సభ్యులు చూద్దంలే అన్నరట. అంతే జనార్ధనుడు రెచ్చి పోయాడు.. భంగపడ్డాడు.. జనార్ధనుని ధోరని మొదటి నుండీ వివాదాస్పదంగానే ఉంది. సీ-ఛానెల్ బ్యూరో చీఫ్ గా ఎన్నో అవకతవకలకు పాల్పడిన ఇతగాడు ఉద్యోగంలో నుండి తొలగింపబడ్డాడు. ఆ తర్వాత ఎప్పటికీ రాని సత్యాలో కొంత కాలం పని చేశాడు. మరి కొంతకాలం జెమిని టీవీకి ఢిల్లీ రిపోర్టర్ గా పని చేశాడు. ఇదే సమయంలో జెమినికి రాజీనామా చేయకుండానీ ఆంధ్రప్రభ హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ గా చేరాడు. సదరు పత్రిక ఎడిటర్ ఒక స్టోరీ రాయమని చెబితే అదిరాయడం చేతకాక చెప్ప చేయకుండా ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం విసా న్యూస్ బ్యూరో చీఫ్ గా వెలగబెడుతున్నాడు. పెన్ను పట్టి వార్తలు రాయడం చేతగాని జనార్ధన్ పైరవీలు చేయడంలో దిట్ట. ఎలక్ట్రానిక్ మీడియా సంఘాన్ని చీల్చి పోటీ సంఘాన్ని పెట్టిన ఇతగాడు ఎన్నో అక్రమార్జనలకు పాల్పడి ' ధనార్జన్ ' గా ప్రసిద్దికెక్కాడు. ఎన్నికలు వస్తున్న తరుణలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికై డబ్బులు దండుకోవాలని ధనార్జన్ కలలు కంటున్నాడు. జర్నలిస్ట్ సోదరులారా.. జర జాగ్రత్త..
ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి ఎన్నికలు జరగవా?
ప్రస్తుతం హరిప్రసాద్ అధ్యక్షతన కొనసాగుతున్న సంఘం కేవలం హడ్ హక్ కమిటీ మాత్రమే. ఈ కమిటీ ఏర్పడి సంవత్సరం అయినా ఇప్పటిదాకా సభ్యత్వ కార్యక్రమం, ఎన్నికలు జరగలేదు. తాజాగా ఆగస్టులోగా ఎన్నికలు జరుపుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కార్యవర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణలో అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం ఎలక్ట్రానికి మీడియా సంఘానికి ఎన్నికలు జరగడం సందేహమే..
ఎలక్ట్రానిక్ మీడియా సంఘానికి ఎన్నికలు జరగవా?
ప్రస్తుతం హరిప్రసాద్ అధ్యక్షతన కొనసాగుతున్న సంఘం కేవలం హడ్ హక్ కమిటీ మాత్రమే. ఈ కమిటీ ఏర్పడి సంవత్సరం అయినా ఇప్పటిదాకా సభ్యత్వ కార్యక్రమం, ఎన్నికలు జరగలేదు. తాజాగా ఆగస్టులోగా ఎన్నికలు జరుపుకోవాలని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం కార్యవర్గం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణలో అనుకున్న షెడ్యూల్డ్ ప్రకారం ఎలక్ట్రానికి మీడియా సంఘానికి ఎన్నికలు జరగడం సందేహమే..
వైట్ల రమేశ్ పై దాడి సంగతేంటి?

ఆంధ్రజ్యోతి ఎపిసోడ్.. కొన్ని సందేహాలు..

Sunday, June 22, 2008
పుట్టుకొస్తున్న కొత్త ఛానెళ్ళు.. జర్నలిస్టుల కొరత..

స్టింగు రంగడి ఛానెల్..

Tuesday, June 3, 2008
మూతపడ్డ సిటీకేబుల్

ఎవరా బాడుగ నేతలు?
Friday, May 23, 2008
శివ రామ ప్రసాద్ రాజీనామా.. టీవీ-5లో సంక్షొభం..

'సీటీవీ'లో ఆకలి కేకలు

Wednesday, May 14, 2008
Monday, May 12, 2008
జెమినిలో సమ్మె?

అయినవారికి కంచాల్లో..
తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సన్ వర్గాలను ఒప్పించడంలో విఫలమైన జెమిని ఎం.డి. కిరణ్ తన వారు అనుకున్న వారికి మాత్రం వ్యక్తిగతంగా నగదు ఇస్తున్నారని వినికిడి. ఇలా కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ధోరణి ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోంది. కొందరికి మాత్రమే ఇలా చెల్లించడంలోని ఆంతర్యం ఏమిటి? మిగతావారేం పాపం చేశారు? విభజించి పాలించడం అంటే ఇదేనా?
maaరింది.. బాగుంది..

Saturday, May 3, 2008
జెమిని జీతాల పెరుగుదల 5 శాతమేనా?..

జీ-తెలుగు సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్
జీ నెట్ వర్క్ ' జీ-తెలుగు ' సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.50,000ల నుండి లక్ష దాకా లబ్ది చేకూరింది. అలాగే జీతాలు కూడా భారీగా పెరిగాయి. మాటీవీ కూడా తమ సిబ్బందికి 25 శాతం దాకా జీతాలు పెంచింది. ఈటీవీ, టీవీ-9, టీవీ-5, ఎన్-టీవీ ఛానెళ్ళు కూడా జీతాలు భారీగానే పెంచాయి.. పెంచుతున్నాయి.. ఇవన్నీ విన్నారా జెమిని యాజమాన్యం వారూ..
Friday, May 2, 2008
వార్త చీఫ్ ఎడిటర్ కొమ్మినేని?

ఈటీవీలో ముగిసిన వెంకటకృష్ణ ఎపిసోడ్

Sunday, April 27, 2008
పత్రికల అంతర్యుద్దం



సాక్షి రంగప్రవేశంతో తెలుగు దిన పత్రికల మధ్య పోరాటం ప్రారంభమైంది. అది సర్క్యులేషన్లోనో, వార్తల కవరేజీలోనో కాదు. పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడంలోనే ఈ పోరాటం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు పోటీగా అత్యాధునిక టెక్నాలజీ, అన్ని పేజీలు రంగుల్లో, ఒకేసారి 23 ఎడిషన్లతో వచ్చిన సాక్షి సరికొత్త చరిత్ర సృష్టించిందనడంలో అనుమానం లేదు. అయితే ఈనాడులో వచ్చిన స్టోరీ(జడ్చర్ల ఎస్.ఇ.జడ్)ని సాక్షి సమీక్షించడం, సాక్షిపై ఈనాడు ఎదురు తిరగడం పాఠకులను ఆశ్చర్యపరిచింది. ఈనాడులో వచ్చిన స్టోరీ అసత్యమైతే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ సాక్షి ఎందుకు జోక్యం చేసుకున్నట్లు? అలాగే తాను అమ్ముతున్నట్లుగానే ఇతర తెలుగు దిన పత్రికలు కూడా రూ.2/-కే అమ్మాలని సాక్షి డిమాండ్ చేయడం ఎంతవరకూ సబబు. ఎవరి సరుకుకు వారు ధర నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంటారు. తాను అమ్మే ధరకే ఇతరులూ అమ్మాలని ఏ వ్యాపారి కూడా శాసించజాలడు. ఏ ధరకు ఏ సరుకు కొనాలో నిర్ణయించుకునేది వినియోగదారుడే. ఈ సూత్రం పత్రికలకూ, పాఠకులకూ వర్తిస్తుంది. అంతర్జాతీయ టెక్నాలజీతో, అన్ని పేజీలు రంగుల్లో కేవల రూ.2/- కే ఇస్తున్న సాక్షితో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీపడలేవని అర్థమైపోయింది. ఈ విషయాన్ని ఆ రెండు దిన పత్రికలే అంగీకరించాయి. ఎలాగు సాక్షి సర్క్యులేషన్ 13 లక్షలు దాటింది. యుద్దమొలో గెలిసిన తర్వాత కూడా శత్రువుని హింసించాలా?.. క్షమించి వదిలేయవచ్చుకదా?..
Tuesday, April 22, 2008
కొంప ముంచిన మురళీకృష్ణ
ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఇచ్చిన స్టే జర్నలిస్టులందరినీ నిరాశ పరచింది. ఈ స్టే కు ప్రధాన కారకుడైన రావు చెలికాని ప్రధానంగా జర్నలిస్టులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు? పరిశోధిస్తే ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. చెలికాని రావును ఉసి గొలిపి కేస్ పెట్టించింది ఈనాడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ మురళీకృష్ణ. నిబంధనల ప్రకారం ఐదేళ్ళ సర్వీస్ కూడా లేని మురళీకృష్ణ రాజమండ్రికి చెందిన కొన్ని చిన్న పత్రికల నుండి బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు దాఖలు చేసి దొరికి పోయాడు. అతని అప్లికేషన్ తిరస్కరణకు గురికావడం జీర్ణించుకోలేక మొత్తం ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియకే విఘాతం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. బ్లాగుల్లో 'పెద్దలా? గద్దలా?' కరపత్రం అతడు రాసిందేనట(?) మురళీకృష్ణ కొద్ది నెల క్రితం ఇదే బ్యానర్ తో ఈనాడులో భూ కుంభకోణం వార్తలు రాశాడట(?) చెలికాని రావు కోర్టుకు ఇచ్చిన పిర్యాదులో కొందరు జర్నలిస్టులకు సొంత ఇళ్ళు ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాల కొసం దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులోఅ చాలా వరకు ఈనాడు, ఈటీవీ ఉద్యోగులవి. ఈ ఫ్లాట్ల ఫోటోలన్నీ చెలికాని రావుకు మురళీకృష్ణ ఇచ్చాడట. అది సరే మరి చెలికాని రావు జర్నలిస్టులపై ఎందుకు పగబట్టాడు? మున్ముందు ఈ విషయాలన్నీ బయట పడతాయి.
.

ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్లే అయిందా?

bv 9

Tuesday, April 15, 2008
'ఏసియానెట్'లో చేరిన సతీష్ బాబు
జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.
పాపం 'ఈవారం'

ఇళ్ళ స్థలాల కోసం ఇంత రచ్చా?

జూనియర్లూ.. ఎందుకీ తొందర?
ఇళ్ళ స్థలాలు రాకపోతే జీవితమే వృధా అన్నంతగా హడావిడి పడుతూ ఆందోళనకు దిగారు జూనియర్లు (ఐదేళ్ళ లోపు సర్వీసు గలవారు) ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియలో కొన్ని నియమ నిబంధనలు ఉండటం సహజం. ఇందులో భాగంగానే చిన్న పత్రికలు, నాన్ స్టార్టర్ ఛానెళ్ళలొ పనిచేసిన అనుభవాన్ని, కంట్రిబ్యూటర్ సర్వీసును లెక్కలోకి తీసుకోలేదు (ఇప్పుడు సభ్యత్వం దొరికిన వారంతా పతివ్రతలే అని మేము అనటం లేదు.. దొరకని వరకే దొరలు). ఏళ్ళ తరబడి జర్నలిస్టులుగా బతుకులు వెళ్ళ దీస్తున్న సీనియర్లకు ముందుగా ప్లాట్లు దక్కాలని కొరుకుందాం. జూనియర్లు వయసు రీత్యా ఈ వృత్తి కాకపోతే మరో ఉద్యోగం చూసుకోవచ్చు. కాని సీనియర్లకు అలాంటి అవకాశాలు దొరకవు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇక ఇళ్ళ స్థలాలు ఇవ్వదన్నదే జూనియర్ల ఆవేదన. ఇదే నిజమని ఎందుకనుకోవాలి? పోరాడే శక్తి కొరవడిందా? ముందు మన పోరాటం అనర్హులకు ప్లాట్లు దక్కకుండా చూడటమే..
కొసమెరుపు: ఈ బ్లాగ్ రచయిత కూడా జూనియరే.. ప్లాట్ రావడం లేదు అని తెలిసినా బాధ లేదు..
Sunday, March 30, 2008
వెంకట ' కృష్ణ లీలలు '
దురదృష్ట వశాత్తు ప్రతిభ ఉన్న మీడియాలో గుర్తింపు రాక మరుగున పడ్డ జర్నలిస్టులెందరో ఉన్నారు. గుర్తింపు రావాలంటే ప్రతిభ ఒక్కటే చాలదు. కులం, కాకా పట్టే విద్య కూడా కావాలి. ఆ లక్షణాలన్నీ ఉండబట్టే పర్వతనేని వెంకటకృష్ణ ఈటీవీలో ఒక వెలుగు వెలుగున్నాడు. లేకపోతె వరంగల్ జిలా పర్వతగిరి కాంట్రబ్యూటర్ గానే కొనసాగే వాడేమొ? ' పట్టు ' కళలో ఆరితేరిన వెంకటకృష్ణ ఈటీవీలో సీనియర్లందరిని సాగనంపాడు. కొందరు సీనియర్లు ' ఫిలింసిటీ ' దాటి బయటకు రాకుండా కట్టడి చేయగలిగాడు. ప్రస్తుతం వెంకటకృష్ణను ఫోర్జరీ కేసు వెంటాడుతోంది. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ స్థలాల కోసం రామోజీ ఫిలింసిటీలో ఉండే చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు అప్లికేషన్లు అందకుండా వెంకటకృష్ణ అడ్డుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దరఖస్తు చేసుకున్నా వారిలో 15కు పైగా అనర్హులు ఉన్నారని తెలుస్తోంది. ఈటీవీ నుండి దరఖాస్తు చేసుకున్న కొందరు సీనియర్ జర్నలిస్టుల పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదు. తనకు గిట్టని వారి పేర్లు అర్హుల జాబితాలో చోటు చేసుకోకుండా వెంకటకృష్ణ సాయశక్తులా ప్రయత్నించాడు. ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ స్క్రూటినీ కమిటీ సమావేశంలో ఈటీవీ నుండి ఒక పేరు కచ్చితంగా ఉండాలని వెంకటకృష్ణ గట్టిగా పట్టు పట్టదు. ఆ పేరు వెంకటకృష్ణ ప్రియురాలిది. ఈటీవీలో చాలా కాలంగా పని చేస్తున్నట్లు ఒక ఫోర్జరీ లేఖను ఈ దరఖాస్తు వెంట దాఖలు చేశాడు. అసలు ఈమె ఎవరా అని విచారిస్తే ఆవిడకి ఈటీవీతో ఎలాంటి సంబందం లేదని బయట పడింది. ఆమె ఒక అగ్ర దర్శకుడి పీ.ఆర్.ఓ. వెంకటకృష్ణ ఫొర్జరీ వ్యవహారం ఈటీవీ యాజమాన్యం దృష్టికి వెళ్ళి oది. పాపం వెంకటకృష్ణకు కష్ట కాలం మొదలైంది. అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ జాబితాను జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ పక్కన పెట్టింది.
సాక్షి విశ్వ రూపం

మీడియా కామాంధుడు
సైకిల్ దొంగగా నేరమయ జీవితాన్ని ఆరంభించిన ఓ ఒంగోలు చిన్నోడు కెమెరా అసిస్టెంట్ గా ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగు పెట్టాడు. పుష్కర కాలంలోనే ఔట్ పుట్ ఎడిటర్ అయిపోయాడు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. హిచ్ కాక్ సినిమాను మించిన సస్పెన్స్ తో కొనసాగుతోంది. కామం ప్రకోపించిన ఈ చిన్నోడు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు మొదలెట్టాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని కట్టుకున్న ధర్మపత్నికి ద్రోహం చేశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాలు కొనసాగించాడు(కొనసాగిస్తున్నాడు) కొందరిని పెళ్ళాడాడు. కొందరితో కలిసి జీవిస్తున్నాడు. ఏక కాలంలో తల్లీ కూతుర్లతో సంబంధం పెట్టు కున్నాడట(?) చిన్నోడి అకృత్యాలను, వేదింపులను భరించలేని భార్య పోలీసుల్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లక్షలాది రూపాలు వెదజల్లి చట్టం దృష్టినుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిన్నోడు. తాజాగా ప్రేమ పేరిట మరో న్యూస్ యాంకర్ని వలలో వేసుకొని పెళ్ళాడు. పాపం చిన్నోడి గత చరిత్ర ఆవిడకు తెలియదేమో.. చిన్నోడి లీలలు ఒక్కొకటి బయటకు రావడంతో ఇతగాడు పనిచేస్తున్న ఛానెల్ ఊద్యోగంలోంచి తీసేసింది. (ఇతగాడి గురించి ఎబౌట్ తెలుగు మీడియా ముందుగానే హెచ్చరించినా సదరు ఛానెల్ కళ్ళు మూసుకొని ఉద్యోగం ఇచ్చింది. అది వేరె కత లెండి) ప్రస్తుతం కనబడకుండా పోయిన చిన్నోడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈతడి గత చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్నోడి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయట. దురదృష్టవశాత్తు మన మీడియా అన్ని రకాల నేరగాళ్ళ అడ్డాగా మారిపోయిందనటానికి చిన్నోడి కథే సాక్షం. మెరుగైన సమాజ పూర్వ విద్యార్థి చిన్నోడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాం..
Sunday, March 2, 2008
జెమినిలో ఏం జరుగుతోంది?

దీని అర్థమేమి తిరుమలేశా?
జెమిని నుండి మరో వారం రోజుల్లో 30కి పైగా ఉద్యోగులు ఏసియానెట్ తెలుగు ఛానెళ్ళో చేరి పోతున్నారు. ముంచుకొస్తున్న ముప్పును చూస్తూ కూడా హైదరాబాద్/చెన్నై యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు. స్థానిక యాజమాన్యమే పనిగట్టుకోని వారిని పంపుతోదని అందరికీ తెలుసు. ఎందుకిలా?.. సమాధానానికై చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..
ఆ ఒక్క సొసైటీకే ఎందుకు ఇవ్వాలి?

తెలంగాణా కోణం
ఇళ్ళ స్థలాల కేటాయింపులో తమకు జరగబోతున్న అన్యాయాన్ని పసిగట్టిన తెలంగాణా జర్నలిస్టులు పోరాటానికి సిద్దం అవుతున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. అభయ హస్థం కూడా లభించిందట. హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా పని చేస్తున్న తమకు వలస జర్నలిస్టుల కారణంగా పొంచి ఉన్న ముప్పును వీరు పసిగట్టి ఇప్పుడే అప్రమత్తం అయ్యారు.
Friday, February 22, 2008
పారిపోయిన డెస్క్ ఇన్ ఛార్జ్

పేరు: జె.రామక్రిష్ణ
వయసు: 55+
ఉద్యోగం: ఇటీవలి దాకా జెమినిలో డెస్క్ ఇన్ ఛార్జ్
ఆనవాలు: జుట్టుకి, మీసాలకి నల్ల రంగు, సోడాబుడ్డి కళ్ళద్దాలు. + లిక్కర్ కంపు
సదరు వ్యక్తి జీతం, అక్రిడేషన్ వచ్చినప్పటి నుండీ గత రెండు నెలలుగా కనబడుట లేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తచ్చాడుతుంటాడు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.
అయ్యా రామక్రిష్ణా! మీరు కనబడక మీ ఆప్త మిత్రుడు సతీష్ బాబు బెంగ పెట్టుకున్నా, మేము మాత్రం సంతోషంగా ఉన్నాము. ఇక్కడి పని వత్తిడి, ఛీవాట్లు తట్టుకోలేక ఉద్యోగం వదిలేసి పారిపోయావని మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా తిరిగి రానక్కరలేదు. కానీ మా దగ్గర తీసుకున్న అప్పులు తిప్పి పంపితే అదే పది వేలు. 24 గంటలు మత్తులో ఉండే నీవు 24 గంటల టీవీ ఛానెళ్ళో పని చేయలేవని మాకు తెలుసు. నీవు ఎలాగూ తాగుడు అలవాటు మానలేవని మాకు తెలుసు. ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఇకనైనా బుద్దిగా పని చేయి. తోటి ఉద్యోగుల పైన పితూరీలు చెప్పే అలవాటు వదులుకో.
ఇట్లు..
జెమిని జర్నలిస్టులు
Sunday, February 3, 2008
ఇ-మీడియా హౌసింగ్ సొసైటీలో బయటపడుతున్న అక్రమాలు
అందరు ఊహించినట్లే ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో అక్రమాలు బయటపడ్డాయి. కమిటీ సభ్యులందరి సమక్షంలో పకడ్బందీంగా స్క్రూటినీ జరిపిన తర్వాత జాబితా బయట పెట్టాక పోవడంపై వ్యక్తమైన అనుమానాలను ఎబౌట్ తెలుగు మీడియా గతంలోనే వెలుగులోకి తెచ్చింది. సొసైటీ డైరెక్టర్లు గట్టిగా నిలదీసి తిరుగుబాటు చేసేసరికి విధిలేక శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ సమావేశం పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి సమర్పించిన జాబితాలో అధనంగా స్క్రూటినీ జరగని కొన్ని పేర్లు ఉండటం గమనించి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్క్రూటినీలో కేటాయించిన పాయింట్లు, సీనియారిటీని పక్కనపెట్టి జాబితా తయారు చేయటంతో చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సభ్యులకు చెప్పకుండా ముఖ్యమంత్రికి జాబితా ఎలా ఇచ్చారు? కో ఆర్డినేషన్ కమిటీతో ఏకపక్షంగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకున్నారని అడిగితే శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ కుంటిసాకులు చెప్పారట. జరిగిందేదో జరిగిపోయింది, కొత్త జాబితా తయారు చేద్దామని చెప్పిన వీరిద్దరు పెద్దమనుషులు ఇప్పటిదాకా ఆ పని చేయకపోవటంతో అనుమానాలు మరింత తీవ్రమైనాయి. ముఖ్యమంత్రికి ఇచ్చిన జాబితాలో జరిగిన అక్రమాలపై నిలదీసే సభ్యులను బెదిరిస్తున్నారని సమాచారం. సొసైటీలో జరుగుతున్న పరిణామాలను సభ్యులెవరికీ చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఇంతకీ జరిగిన అక్రమాలకు భాధ్యత ఎవరిది? శ్రీనివాస్ రెడ్డిదా? సాబేర్ దా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?
Sunday, January 27, 2008
ఏమిటీ రాతలు?..

Subscribe to:
Posts (Atom)