Monday, May 12, 2008

maaరింది.. బాగుంది..

ఇటీవలే మారిన మాటీవీ లోగో విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిల నిర్వహణలో మాటీవీ కొత్త పుంతలు తొక్కగలదని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. లోగో మార్చుకున్న మాటీవీ ఇప్పుడు వినూత్న కార్యక్రమాలు అందించటంపై దృష్టి పెట్టింది. మాటీవి త్వరలోనే జెమిని, ఈటీవీ ఛానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మారిన మాటీవీ లోగొ బానే ఉంది కానీ రంగులే మబ్బుగా ఉన్నాయి. వార్తా సేకరణకు వచ్చే రిపోర్టర్లు పట్టుకునే మైకుల లోగోలు మరీ పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇవి చిన్నగా మారిస్తే బాగుంటుంది.