Saturday, May 3, 2008

జెమిని జీతాల పెరుగుదల 5 శాతమేనా?..

ఊహించినట్లే జెమిని సిబ్బంది వేతనాల పెరుగుదల విషయంలో మరోసారి దారుణంగా మోసపోయారు. సంవత్సర కాలంగా జీతాలు పెంచుతామంటూ ఊరించిన యాజమాన్యం తమ సిబ్బందిని ఘోరంగా అవమానించింది. జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు భారీగా వలసలు ప్రారంభం కావడంతో జీతాలు 50 నుండి 100 శాతం దాకా పెరుగుతాయని యాజమాన్యంలోని ప్రముఖులు ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని నమ్మిన సిబ్బంది ఇతర ఛానెళ్ళలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నారు. చెన్నై నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం జెమిని సిబ్బందికి కేవలం 5 శాతం జీతమే పెంచాలని సన్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ సమాచారం లీక్ కావడంతో జెమిని సిబ్బందిలో చాలా మంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఛానెళ్ళలో సిబ్బంది జీతాలు అడేఅనంగా ఉన్న విషయం తెలిందే. పెరిగిన నిత్యావసర వస్తువల ధరలు, గ్రేటర్ హైదరాబాద్లో రెండు, మూడింతలు అయిన ఇళ్ళ అద్దేలు చెల్లించలేక జెమిని సిబ్బంది నరకం అనుభవిస్తున్నారు. ఇవన్నీ జెమిని-సన్ యాజమాన్యాలకు తెలియవా? నిద్ర పోయే వారిని లేపవచ్చు, కాని నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం.. జెమినిలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఎం.డి కిరణ్, జి.ఎం. బాలకృష్ణన్ తినడాని తిండైనా లభించని దుస్థితిలో ఉన్న తమ సిబ్బందికి న్యాయమైన జీతాలు ఇప్పించడంలో విఫలమయ్యారు. మీరు బరిస్టా కాఫీ తాగగానే సరిపోదు.. మీ సిబ్బంది కనీసం కామత్ హోటల్లో అయినా కాఫీ తాగేలా జీతాలు ఇప్పించండి.
జీ-తెలుగు సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్

జీ నెట్ వర్క్ ' జీ-తెలుగు ' సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.50,000ల నుండి లక్ష దాకా లబ్ది చేకూరింది. అలాగే జీతాలు కూడా భారీగా పెరిగాయి. మాటీవీ కూడా తమ సిబ్బందికి 25 శాతం దాకా జీతాలు పెంచింది. ఈటీవీ, టీవీ-9, టీవీ-5, ఎన్-టీవీ ఛానెళ్ళు కూడా జీతాలు భారీగానే పెంచాయి.. పెంచుతున్నాయి.. ఇవన్నీ విన్నారా జెమిని యాజమాన్యం వారూ..