Friday, May 2, 2008

ఈటీవీలో ముగిసిన వెంకటకృష్ణ ఎపిసోడ్

ఈటీవీ-2 హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ వెంకటకృష్ణ కథ క్లైమాక్స్ కి చేరింది. వెంకటకృష్ణ ఆగడాలపై దర్యాప్తు జరిపిన ఈటీవీ యాజమాన్యం ఆయన్ని బ్యూరో ఛీఫ్ పదవి నుండి తొలగించి ముంబైకి బదిలీ చేసింది. అంటే తమరి సేవలిక చాలు దయచేయండి అని అర్థం. వెంకటకృష్ణ కంట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు నిరూపితమైంది. తన ప్రియురాలికి ఇళ్ళ స్థలం ఇప్పించడానికి పోర్జరీ లెటర్ సృష్టించిన బాగోతంపై రామోజీరావు సీరియసైనారట. ఇంతకాలం వెంకటకృష్ణను వెనుకేసుకు వచ్చిన మేనేజర్ ఇటీవలే రిజైన్ చేయటంతో ఆదుకునేవారే కరువయ్యారు పాపం. ఉసురు తగలటం అంటే ఇదే కాబోలు. వెంకటకృష్ణ లీలల్ని ఇటీవలే 'ఎబౌట్ తెలుగు మీడియా' బయట పెట్టడం అందరికీ తెలుసు. ఈటీవీ లోని వెంకటకృష్ణ బాధితులంతా ఈ వార్తను రామోజీరావు దృష్టికి తీసుకెళ్ళారు.ప్రస్తుతం వెంకటకృష్ణ ఈటీవీకి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నాడు. ఇతగాడికి టీవీ-5 యాజమాన్యం ఇన్ పుట్ ఎడిటర్ లేదా బ్యూరో చీఫ్ పోస్ట్ ఇవ్వలని ఉవ్విల్లూరుతోందిట. ఈటీవీ-2 బ్యూరో చీఫ్ పోస్టు సీనియర్ రిపోర్టర్ మురలికి ఇచ్చారు. అలాగే ఓవరాల్ మానిటరింగ్ బాధ్యతల్ని రఘుబాబుకి ఇచ్చారు. వెంకటకృష్ణ రాజీనామా తర్వాత ఈటీవీలోని అతని ప్రియ మిత్రుడు, గోడమీది పిల్లి లాంటి నారాయణ పరిస్థితి ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు అతనిపై కూడా అవినీతి ఆరోపణలు లెస్సగా ఉన్నాయి మరి. టీడీపీ బీట్ చూసే ఇతగాడు కులాన్ని అడ్డు పెట్టుకొని భారీగా పైరవీలు చేస్తాడు.