Friday, May 2, 2008

వార్త చీఫ్ ఎడిటర్ కొమ్మినేని?

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ' వార్త ' దినపత్రిక చీఫ్ ఎడిటర్ గా చేరబోతున్నారనే వార్త మీడియావర్గాల్లో వినిపిస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పత్ల గుర్రుగా ఉన్న గిరీష్ సంఘీ తన దినపత్రికను ఇతర పత్రికలకు ధీటుగా తీర్చి దిద్దటానికి కొమ్మినేనిని ఎడిటర్ గా రప్పించుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ప్రాధమిక చర్చలు కూడా జరిగాయట. ఈనాడు, ఆంధ్రజ్యోతి పతికల్లో ఒక వెలుగు వెలిగిన కొమ్మినేని అనవసరంగా ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చి చేతులు కాల్చుకున్నానే అని చాలా కాలంగా బాధ పడుతున్నారట. ప్రింట్ మీడియాలోకి తిరిగి రావాలని భావిస్తున్న కొమ్మినేనికి వార్త రూపంలో మంచి అవకాశం అభించనుంది. కొమ్మినేని ఒక దశలో చంద్రబాబు నాయుడు తేవాలని భవించిన ' అక్షర ' దిన పత్రిక ఎడిటర్ గా వెల్లుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. చివరకు బాబు గారు అక్షర యోచన విరమించుకున్నారుట(?) వార్త దిన పత్రికను అభివృద్ది పరచడానికి గిరీష్ సంఘీ కొత్త వియ్యంకుడు (అగ్రశ్రేణి హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ యజమాని) ఆసక్తిగా ఉన్నారట.