Monday, May 12, 2008

జెమినిలో సమ్మె?

వేతనాల పెంపు విషయంలో తీవ్రంగా భంగపడ్డ జెమిని సిబ్బంది సమ్మెకు సిద్దమవుతున్నారు. జీతలు పెరుగుతాయని ఎంతగానో ఆశ పడ్డ జెమిని సిబ్బందికి సన్ యాజమాన్యం మొండి చేయి చూపింది. 100 శాతం.. కాదు 50 శాతం.. కాదు కాదు 30 శాతం అని వదంతులు సృష్టించి సిబ్బంది బయటకు వెళ్ళకుండా చేసిన జెమిని-సన్ యాజమాన్యం చివరకు 5 శాతమే జీతం పెంచాలని ప్రయత్నించగా ప్రతిఘటన ప్రారంభమైంది. దీనికి భయపడ్డ యాజమాన్యం జీతాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ళదీ ఇదే సమస్యట. ఇక జీతాలు పెరగవు.. పెరిగినా పెద్ద మార్పు ఉండదని గ్రహించిన సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ల సిబ్బంది సమ్మెకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన జెమిని, జెమిని న్యూస్, తేజ సిబ్బంది కూడా సమ్మెకు సిద్ద మవుతున్నారు. సిబ్బంది మూకుమ్మడి సెలవు పెట్టడమో, లేదా ధర్నాకు దిగడమో, నల్ల బ్యడ్జీలు ధరించి విధులకు హాజరు కావడమో.. ఏ రూపంలో అయినా ఈ సమ్మె జరిగే అవకాశం ఉంది. అవసరమైతే కార్మిక సంఘాల మద్దతు తీసుకొని లేబర్ కోర్టును ఆశ్రయించాలని కొదరు సిబ్బంది ప్రణాలికలు తయారు చేస్తున్నారట.
అయినవారికి కంచాల్లో..
తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సన్ వర్గాలను ఒప్పించడంలో విఫలమైన జెమిని ఎం.డి. కిరణ్ తన వారు అనుకున్న వారికి మాత్రం వ్యక్తిగతంగా నగదు ఇస్తున్నారని వినికిడి. ఇలా కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ధోరణి ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోంది. కొందరికి మాత్రమే ఇలా చెల్లించడంలోని ఆంతర్యం ఏమిటి? మిగతావారేం పాపం చేశారు? విభజించి పాలించడం అంటే ఇదేనా?