Tuesday, April 15, 2008

పాపం 'ఈవారం'

రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి 'ఈవారం' పత్రిక ఈ మధ్య బుక్ స్టాళ్ళలో కనబడుటలేదు. కారణం.. కమిషన్ చెల్లింపు విషయంలో కక్కుర్తి. ఫలితం.. ఈవారం పత్రిక అమ్మొద్దని బుక్ స్టాళ్ళ నిర్ణయం. కేవలం కాంగ్రెస్ అనుకూల వార్తలు, అందునా పార్టీలో ప్రత్యర్థులపై వ్యతిరేక వార్తలు.. ఇదీ ఈవారం ధోరణి. పి.జె.ఆర్. మరణించాక ఆయనకు నివాళిగా వ్యాసాన్ని కూడా ప్రచురించలేదు. చాలీ చాలని జీతాలు.. ఎవరికి అనుకూలంగా రాయాలో, ఎవరికి వ్యతిరేకంగా రాయాలో అర్థంకాక ఈవారంలో మొదటి నుండి ఉన్న జర్నలిస్టుల్లో దాదాపుగా అంతా మానేశారు. పత్రిక అడ్రస్సూ మారింది. పాపం ఈవారం .. వచ్చే వారానికైనా కోలుకుంటుందో లేదో?..