Tuesday, April 22, 2008

ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్లే అయిందా?

ఇళ్ళ స్థలాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొoదరు ప్రింట్ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టి నాలుగేళ్ళే అవుతోంది కదా.. అప్పుడే మీకు ఇళ్ళ స్థలాలు కావాలా అని ప్రశ్నించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన అజ్ణానం. నిజానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా 1995-96లో ప్రారంభమైంది(దూరదర్శన్ తెలుగు వార్తల్ని మినహాయిస్తే. దూరదర్శన్ ను కలుపుకుంటే మూడు దశాబ్దాల చరిత్ర అవుతుంది). 1995-96లో సిటీకేబుల్ వార్తలు ప్రారంభమయ్యాయి. దీని క్రెడిట్ ఆనాటి సిటీకేబుల్ న్యూస్ డైరెక్టర్, ప్రస్తుత టీవీ-9 సి.ఇ.వో. రవిప్రకాశ్ కు దక్కుతుంది. ఆ తర్వాత జెమిని, ఈటీవీలు శాటిలైట్ ఛానెళ్ళుగా వచ్చాయి. జెమిని, ఈటీవీల్లో వార్తలు ప్రారంభం కాని రోజుల్లో సిటీకేబుల్ వార్తలకు ఎంతో ప్రాముఖ్యం ఉండేది. సిటీకేబుల్ టీం వచ్చే వరకు ప్రెస్ మీట్లు ప్రారంభమయ్యేవి కాదు. ఈ చరిత్ర టీవీ-9, ఈటీవీ-2 చానెళ్ళలో పనిచేసే పిల్ల కాకులకు తెలిసినట్లు లేదు. తమ ఛానెళ్ళ పుట్టుకతోనే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా పుట్టిందని వారు వాదిస్తారు. నూతిలోని కప్పలారా వాస్తవాలు తెలుసుకోండి.