Tuesday, April 15, 2008

'ఏసియానెట్'లో చేరిన సతీష్ బాబు

జెమిని న్యూస్ చీఫ్ ఎడిటర్ పదవికి సతీష్ బాబు రాజీనామా ఇచ్చేశారు. ఇప్పుడాయన కొత్తగా రాబోయే ఏసియానెట్ వారి తెలుగు ఛానెల్ ' సితార ' లో చేరిపోయారు. సతీష్ బాబు జెమినిలో చేరెప్పుడే అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని మీడియా మిత్రులంతా ఊహించారు. అనుకున్నట్లే ఆయన పట్టుమని 6 నెలలు కూడా జెమినిలో ఇమడలేక పోయారు. ఇందుకు సతీష్ బాబును తప్పు పట్టలేం. జెమిని యాజమాన్యం విపరీత ధోరణులను ఆయన తట్టుకోలేక పోయారు. చాలీ చాలని జీతాలతో జెమిని నుండి వలస పోతున్న సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించడంలో యాజమాన్య నిర్లక్ష్యం సతీష్ బాబును ఇబ్బందికి గురిచేసిందని చెప్పుకుంటున్నారు. సిబ్బందిని, పరికరాలను ఇవ్వకుండా టార్గెట్లు పెట్టడం జెమినివారి ప్రత్యేకత. గత కొంత కాలంగా జెమిని యాజమాన్యానికి, సతీష్ బాబుకు మధ్య దూరం పెరిగింది. ఇందుకు సతీష్ బాబు వ్యవహారశైలి కూడా కారణం. ప్రతి విషయానికి తొందరపడి సిబ్బందిపై అరవడం, నచ్చనివారిని శంకరగిరి మాన్యాలను పంపడం సతీష్ బాబుకు అలవాటైన విద్య. బెస్టాప్ లక్ సతీష్ బాబు గారు.. ఏసియానెట్ లో అయినా కుదురుగా ఉండే వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాం..
కొత్త ఎడిటర్ ఎవరు?
సతీష్ బాబు తర్వాత ఎవరొస్తారన్నది జెమిని ముందున్న ప్రశ్న. జెమిని టీవీ ఎడిటర్, బ్యూరో చీఫ్, కోఆర్డినేటర్ పోస్టుల్లో పని చేయాలంటే జర్నలిస్టులకు భయం. ఈ పదవుల్లో ఉన్నవారందరినీ వేధించి సాగనంపడం జెమిని యాజమాన్యానికి వెన్నతో పెట్టిన విద్య. సాక్షాలు కావాలంటే రవిప్రకాష్, కందుల రమేష్, భావనారాయణ, మధు, మాధవ్, మునిరాజు లను అడిగి చూడండి.