Tuesday, April 22, 2008

కొంప ముంచిన మురళీకృష్ణ

ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టు ఇచ్చిన స్టే జర్నలిస్టులందరినీ నిరాశ పరచింది. ఈ స్టే కు ప్రధాన కారకుడైన రావు చెలికాని ప్రధానంగా జర్నలిస్టులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు? పరిశోధిస్తే ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. చెలికాని రావును ఉసి గొలిపి కేస్ పెట్టించింది ఈనాడు పత్రిక స్టాఫ్ రిపోర్టర్ మురళీకృష్ణ. నిబంధనల ప్రకారం ఐదేళ్ళ సర్వీస్ కూడా లేని మురళీకృష్ణ రాజమండ్రికి చెందిన కొన్ని చిన్న పత్రికల నుండి బోగస్ సర్వీస్ సర్టిఫికెట్లు దాఖలు చేసి దొరికి పోయాడు. అతని అప్లికేషన్ తిరస్కరణకు గురికావడం జీర్ణించుకోలేక మొత్తం ఇళ్ళ స్థలాల కేటాయింపు ప్రక్రియకే విఘాతం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. బ్లాగుల్లో 'పెద్దలా? గద్దలా?' కరపత్రం అతడు రాసిందేనట(?) మురళీకృష్ణ కొద్ది నెల క్రితం ఇదే బ్యానర్ తో ఈనాడులో భూ కుంభకోణం వార్తలు రాశాడట(?) చెలికాని రావు కోర్టుకు ఇచ్చిన పిర్యాదులో కొందరు జర్నలిస్టులకు సొంత ఇళ్ళు ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ స్థలాల కొసం దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఇందులోఅ చాలా వరకు ఈనాడు, ఈటీవీ ఉద్యోగులవి. ఈ ఫ్లాట్ల ఫోటోలన్నీ చెలికాని రావుకు మురళీకృష్ణ ఇచ్చాడట. అది సరే మరి చెలికాని రావు జర్నలిస్టులపై ఎందుకు పగబట్టాడు? మున్ముందు ఈ విషయాలన్నీ బయట పడతాయి..