Sunday, March 2, 2008

ఆ ఒక్క సొసైటీకే ఎందుకు ఇవ్వాలి?

ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాల్లో సరి కొత్త నాటకం మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సొసైటీలను కాదని జవహర్ లాల్ నెహ్రు పేరిట వెలిసిన కొందరు పైరవీ కారుల సొసైటీకి స్థలాన్ని ఇస్తుందట. అసలు ఈ సొసైటీకి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? జర్నలిస్టుల నేతలుగా చెలామని అవుతున్న కొందరు పైరవీకారులు ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి తాము ఏర్పాటు చేసిన సంకర సొసైటీకి మాత్రమే ఇళ్ళ స్థలాలు దక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులంతా తమ సొసైటీల సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి ఈ సంకర సొసైటీలో చేరాలట. దరఖాస్తు ఫారాలు కూడా కొందరికే లిమిటెడ్ గా ఇస్తారట. ఎవరీ వంశీ? ఎవరీ భాస్కర్? ఈ సంకర సొసైటీలో ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ సభ్యుల్ని చేర్పించేందుకు ఇండియా టీవీ శ్రీనివాస్ రెడ్డి , సాబేర్ ఎందుకు తాపత్రయ పడుతున్నారు? కేవలం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అక్రమార్కులపై కోపంతో మొత్తం జర్నలిస్టుల ప్రయోజనాలకే ఎందుకు ముప్పు తల పెడుతున్నారు? అసలు ముక్యమంత్రిగారు ఈ గోముఖ వ్యాఘ్రాల్ని ఎలా నమ్మారు? ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలను కాదని ఈ సంకర సొసైటీకి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇళ్ళ స్తలాలు ఇస్తోంది? రేపు ఎవరినా న్యాయస్థానంలో సవాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరిది బాధ్యత?
తెలంగాణా కోణం
ఇళ్ళ స్థలాల కేటాయింపులో తమకు జరగబోతున్న అన్యాయాన్ని పసిగట్టిన తెలంగాణా జర్నలిస్టులు పోరాటానికి సిద్దం అవుతున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. అభయ హస్థం కూడా లభించిందట. హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా పని చేస్తున్న తమకు వలస జర్నలిస్టుల కారణంగా పొంచి ఉన్న ముప్పును వీరు పసిగట్టి ఇప్పుడే అప్రమత్తం అయ్యారు.