Sunday, March 2, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

జెమిని టీవీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రమ దోపిడీకి మారు పేరైన జెమినిలో జీతాలు ' గొర్రె తోక బెత్తెడు ' లాంటివని అందరికి తెలుసు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పొలిస్తే జెమిని సిబ్బంది జీతాలు నాలుగో వంతు మాత్రమే. కొత్తగా వస్తున్న ఛానెళ్ళు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో జెమిని నుండి వలసలు నిత్యకృత్యంగా మారాయి. జరుగుతున్నా జెమిని గ్రూప్ ఛానెళ్ళను నిర్వహిస్తున్న ' సన్ ' యాజమాన్యంలో కనీస స్పందన లేదు. అసలు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు చెన్నై లోని సన్ యాజమాన్యానికి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ లో ఛానళ్ళరూపంలొ వందలాది కోట్లు ఆర్జించే సన్ యాజమాన్యం జెమిని ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు తట్టుకోలేక ఆప్పుల ఊబిలో కూరుకు పోతున్న ఉద్యోగులపై యాజమాన్యానికి కనికరం లేదా? ఉద్యోగులు వలస పోతున్న ప్రతిసారీ జీతాలు 50-100-200 రెట్లు పెరుగుతాయని జెమిని స్థానిక యాజమాన్యం పుకార్లు లేవదీస్తోంది. నిజమని నమ్మిన జెమిని ఉద్యోగులు ఇతర ఛానళ్ళలో వచ్చిన అవకాశాల్ని వదులుకొని, చివరకు అంతా మోసమని తెలుసుకొని విచారించటం సర్వ సాధారణమైంది. తాజాగా ఏప్రిల్,మేల్లో జీతాలు డబుల్ అవుతాయని నమ్మ బలుకుతున్నారు. స్థానిక యాజమాన్య వైఫల్యం వల్లే జెమిని సిబ్బందికి జీతాలు పెరగటం లేదని తెలుస్తోంది. పైరవీలకే పరిమితమైన జెమిని స్థానిక యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకల్ని ' చెన్నై ' దృష్టికి తీసుక పోవటంలో విఫలమవుతున్నారు. వీరికి సన్ సీ.ఎం.డి. కళానిధి మారన్ అపాయింట్మెంట్ దొరకదని జెమిని వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది జీతాలు తీసునే స్థానిక జెమిని ఎం.డి., జి.ఎం.లు తమ సిబ్బంది వేతనాల వెతల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
దీని అర్థమేమి తిరుమలేశా?

జెమిని నుండి మరో వారం రోజుల్లో 30కి పైగా ఉద్యోగులు ఏసియానెట్ తెలుగు ఛానెళ్ళో చేరి పోతున్నారు. ముంచుకొస్తున్న ముప్పును చూస్తూ కూడా హైదరాబాద్/చెన్నై యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు. స్థానిక యాజమాన్యమే పనిగట్టుకోని వారిని పంపుతోదని అందరికీ తెలుసు. ఎందుకిలా?.. సమాధానానికై చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..