Monday, October 12, 2009

వరదలో చానళ్ళ బురద..

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్ నగర్, క్రిష్ణా, గుంటూరు జిల్లాలు వరదల్లో మునగడం మన టీవీ చానళ్ళ దాహాన్ని తీర్చింది. అందరికన్నా తామే ముందు వరద వార్తలు ఇచ్చామని ప్రతీ చానల్ గొప్పలు చెబుకుంది. కొన్ని చానళ్ళయితే శ్రీశైలం డాం కొట్టుకు పోతోందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసి, తర్వాత నాళిక కర్చుకొని తమ వార్తలకు స్పందించే అధికారులు తక్షణ సహాయక చర్యలకు దిగారని సమర్ధించుకున్నాయి. కొందరు రిపోర్టలైతే పలానా ప్రాంతానికి అధికారుల కన్నా తామే ముందెళ్ళి ప్రజల్ని రక్షించామని వగలు పోయారు. మరికొందరైతే చేతుల్లో గొట్టాలు పట్టుకొని ప్రజల్ని రక్షించారట. రక్షించేటప్పుడు మధ్యలో ఈ గొట్టం ఎందుకని ఎవరూ అడగలేదేమో? కొన్ని టీవీ చానళ్ళు వరద బాధితులకోసం విరాళాలు, వస్తువులు, బట్టలు సేకరించాయి. భేష్.. మంచిదే. కాని అవన్నీ సక్రమంగా బాధితులకు చేరాల్సిన అవసరం ఉంది. మరికొన్ని చానళ్ళు వరద బాధితుల సహాయం కోసం నిధులు సేకరించి తమ కరువు.. అదేనండి అప్పులు తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జెమిని సంగతేంటి?..
రాష్ట్రంలో అన్ని మీడియా యాజమాన్యాలు తమకు తోచిన రీతిలో వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటే జెమిని టీవీ యజమానులు ఇది తమకు సంబంధించిన విషయం కాదని మిన్నకున్నారు. తమిళనాడులో సునామి వస్తే గ్రూప్ లోని అన్ని చానళ్ళ ఉద్యోగుల ఒకరోజు వేతనాలు కోసి విరాళం ఇచ్చిన సన్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ వరధ బాధితులను పట్టించుకోదా? భేష్.. జయహో..సారీ తమిళహో..

జర్నలిస్టులకు ఇక ఇళ్ళ స్థలాలు రానట్టే..

కోర్టు అనుకూలంగా ఎప్పుడు తీర్పు చెబుతుందా. ఇళ్ళ స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు చేదు వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి దుర్మరణం తరువాత ఈ అంశాన్ని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. కోర్ట్రు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స్థాపించిన సీఎం బీట్ రిపోర్టర్లు ఇప్పుడు అంత ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరో వైపు సొసైటీ నాయకులు తమను ఇళ్ళ స్థలా గురించి వాకబు చేసే జర్నలిస్టులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తాము అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ ఇచ్చిన డిపాజిట్ సంగతి ఏమిటని చాలా మంది జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారు. అడిగినవారికి డిపాజిట్లో కొత కట్ చేసుకొని ఇవ్వలనే అల్లోచనలో సొసైటీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.

' జెమినిన్యూస్ ' కొత్త బాస్ ఎవరు?

జెమినిన్యూస్ చాలా కాలంగా తలకాయ లేకుండానే నడుస్తోంది.. అదేనండీ హెడ్ అంటే బాస్ లేకుండా అనమాట. మధు వెళ్ళిపోయిన రెండేళ్ళకు సతీష్ బాబు జెమినిన్యూస్ ఎడిటర్ అయ్యారు. సతీష్ బాబు కూడా రిజైన్ చేసి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకూ కొత్త ఎడిటర్ నియామక జరగలేదు. బహుషా తక్కువ జీతం తీసుకుంటూ ఎండీ కిరణ్ తిట్లు తినేవారెవరూ దొరికి ఉండరు. తాజాగా సన్ గ్రూప్ ఎపీ సీఓఓ గా వచ్చిన సంజీవ రెడ్డి ఈ విషయంలో దృష్టి పెట్టారు. జీ టీవీలో తనకు పైరవీలు చేసి పెట్టిన క్రైం రిపోర్టర్ మహ్మద్ గౌసుద్దీన్ ను జెమిని న్యూస్ హెడ్ గా తీసుకు రావాలని సంజీవ రెడ్డి తహ తహ లాడుతున్నారట. ఇతడు ప్రవర్తణలో కరీం స్కూల్ విధ్యార్థే. అమ్మాయిల జీవితాలతో ఆటలాడే ఇతగాడిని తోటి రిపోర్టర్లు ముద్దుగా సెక్సుద్దీన్ అని పిలుస్తారట. కాగా సతీష్ బాబు కూడా మళ్ళీ జెమిని ఎడిటర్ గా వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Sunday, September 6, 2009

మీడియా మిత్రుడికి జోహార్!
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి అస్తమయం తెలుగు ప్రజలందరికీ విచారాన్ని కలిగించింది. రాజశేఖర రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా పని చేశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కోర్టు కేసు కారణంగా ఇది కార్యరూపం దాల్చక వై.ఎస్.ను కోల్పోవడం బాధారం. జర్నలిస్టులకు మెడిక్లైం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పుణ్యమే.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఎబౌట్ తెలుగు మీడియా ఘనంగా నివాళులర్పిస్తోంది.

APEMJUను కబలించేందుకు APUWJకుట్ర

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అస్థిత్వం ప్రమాదంలో పడింది. ఈ సంఘాన్ని విలీనం చేసుకునేందుకు ' ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ' పావులు కదిపింది. ఈ మేరకు APEMJU ముందు ప్రతిపాదన కూడా పెట్టిందిభావిస్తోంది. తాము APUWJలో విలీనం అయితే స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోతామని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన పడుపున్నారు. తన దాయాది APWJFపై ఆదిక్యత సాధించేందుకే APEMJUను విలీనం చేసుకోవాలని APUWJభావిస్తోంది. ఈ కుట్ర లోని ఆంతర్యం తెలియని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గుడ్డిగా విలీనాని పచ్చ జెండా ఊపాలని ప్రయత్నిస్తున్నారు.
' ధనార్జన ' రాజకీయం
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ లో ముసలం మొదలైంది. సంఘం అధ్యక్షునిగా ఉన్న హరి ప్రసాద్ కు తెలియకుండానే తాను కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు చందు జనార్ధన్ ఐ అండ్ పీఅర్ కు ఒక లేఖ రాయడం ద్వారా ప్రకటించుకున్నాడు. ఈయన గారి కార్యవర్గంలో సాబేర్ ఉపాధ్యక్షునిగా, క్రాంతి కిరణ్ కార్యదర్శిగా ఉన్నారు. జనార్ధన్, సాబేర్, క్రాంతిల కుట్ర వెనుక APUWJహస్తం ఉందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అనైక్యతను సాకుగా చూపి తమలో విలీనం చేసుకోవాలన్నదే APUWJఎత్తుగడ. ఈ విషయమై ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చందు జనార్ధన్ ని నిలదీద్దామని ప్రయత్నించగా మొహం చాటేసి పారిపోగా, సాబేర్ మీటింగ్ ఏ డుమ్మా కొట్టాడు. గతంలో కూడా ఈ మహానుభావుల కారణంగానే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం నిలువునా చీలిపోయింది. ఇప్పటికే ధనార్జన్.. సారీ జనార్ధన్, యూనియన్ అధ్యక్షున్నంటూ చందాలు పోగేస్తున్నాడట.

జెమినిలో మూడు స్థంబాలాట

సన్ నెట్ వర్క్ లోని తెలుగు టీవీ చానెళ్ళకు సీవోవో గా సంజీవ రెడ్డి జాయిన్ అయ్యారు. గతంలో జీ తెలుగు సీఈవోగా పని చేసిన సంజీవ రెడ్డి ఆ చానల్లో ఎన్నో వినూత్న ప్రోగ్రాంలు ప్రవేశ పెట్టి జెమినికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన పని తీరును మెచ్చిన సన్ యాజమాన్యం తన గ్రూప్ లోని తెలుగు చానళ్ళకు సీవోవో పోస్టును ఆఫర్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జెమినిలో మూడు స్థంబాలాట మొదలైంది. ఇప్పటికే మేనేజింగ్ డైరెటర్, జనరల్ మేనేజర్ ఆధిక్యతా పోరులో నలిగిపోతున్న జెమిని సిబ్బందికి తాజాగా వచ్చిన చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ అధనపు భారంగా మారారట. ఈయన జీతం నెలకు ఐదు లక్షలేనట. తమ గొర్రె తోకంత జీతాలు పెంచరు కానీ లక్షలాది జీతాలకు కొత్త కొత్త అధికారులను తెచ్చి తమ నెత్తిన పెడతారని జెమిని ఉద్యోగులు సన్ యాజమాన్యంపై రుసరుస లాడుతున్నారు.