Monday, October 12, 2009

జర్నలిస్టులకు ఇక ఇళ్ళ స్థలాలు రానట్టే..

కోర్టు అనుకూలంగా ఎప్పుడు తీర్పు చెబుతుందా. ఇళ్ళ స్థలాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు చేదు వార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి దుర్మరణం తరువాత ఈ అంశాన్ని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. కోర్ట్రు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి హయాంలో జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ స్థాపించిన సీఎం బీట్ రిపోర్టర్లు ఇప్పుడు అంత ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరో వైపు సొసైటీ నాయకులు తమను ఇళ్ళ స్థలా గురించి వాకబు చేసే జర్నలిస్టులకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తాము అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ ఇచ్చిన డిపాజిట్ సంగతి ఏమిటని చాలా మంది జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారు. అడిగినవారికి డిపాజిట్లో కొత కట్ చేసుకొని ఇవ్వలనే అల్లోచనలో సొసైటీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.