Wednesday, June 17, 2009
మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..
తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి
' సాక్షి ' అధికార దర్పం
ముఖ్యమంత్రిగా రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టాక ఆయన కుటుంబానికి చెందిన సక్షి టీవీ, దిన పత్రికలకు ప్రభుత్వంలో రాచ మర్యాదలు లభిస్తున్నాయి. ఇతర మీడియా ప్రతినిధులకు ఇది కంటగింపుగా మారిది. అధికారులు సాక్షి సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తూఅ మిగతా మీడియా సిబ్బందిని చిన్న చూపు చూస్తున్నారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లోకి సాక్షికి తప్ప ఇతర మీడియాకు ప్రవేశం లేదు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయిలో నిబంధనలకు సాక్షి కెమెరామెన్ ను ప్రత్యేకంగా తీసుకెళ్ళుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని సమావేశమందిరంలోకి స్పీకర్ ఎన్నిక సందర్భంగా సాక్షి కెమెరామెన్ ను తప్ప ఇతరులను అనుమతించ లేదు. ఏమిటీ వివక్ష అని ఇతర మీడియా సిబ్బంది గొంతు చించుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు.
అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు
రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టించిన ఉత్సాహంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంతోంది. అసెంబ్లీలో మీడియాకి ముక్కుతాడు వేయాలన్నది ఇందులో ఒక నిర్ణయం. ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన టీవీ చానెళ్ళ హడావుడి అసెంబ్లీకి ఇబ్బంది కరంగా మారింది. ఉలక్ట్రానిక్ మీడియా వారు స్వీయ క్రమ శిక్షణ పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి, గుంపుగా కెమరాలతో మీద పడుతూ చిరాకు కలిగిస్తున్నారట. మీడియాలు నియంత్రించడమే ఇందుకు ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా మీడియా పాసులకు కోత పెట్టడంతో పాటు, వీరందరినీ పబ్లిక్ గార్డెన్ కు పరిమితం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం జర్నలిస్టులకే కాకుండా నేతాజీలకు కూడా ఇబ్బందికరమే.. గొట్టాల ముందు వాగందే వారికి పూఅట గడవదు కదా?..
పాపం రజనీ
ఎలక్ట్రానిక్ మీడియాలో 'సాలరీ బూం' రివర్స్ కావడతో జర్నలిస్టులకు తిరికి కష్టకాలం మొదలైంది. పెద్ద జీతగాళ్ళకు యాజమాన్యాలు కోత పెడుతున్నాయి. చిన్నజీతగాళ్ళని తరిమేస్తున్నాయి. సాలరీ ఎక్కువ ఇస్తున్నారనే ఆశతో 'మహా టీవీ'లో చేరిన రజనీ కాంత్ మున్నాళ్ళ మురిపెం పూర్తి చేసుకొని సొంత గూటికి రాక తప్ప లేదు. మహా టీవీ వారు జీతం తగ్గించటంతో చిన్నబుచ్చుకున్న రజని ఆ చానెల్ కి గుడ్ బై చెప్పేశారు. టీవీ9లో తిరిగి చేరిపోయారు. బుల్లి తెరపై రవిప్రకాష్ తర్వాత అంతటివాడిగా రజనీకాంత్ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి టీవీ9కైనా మరెక్కడికైనా పోగలడు. కానీ మురళీ కృష్ణ, జకీర్ లకు టీవీ9 తప్ప వేరే గత్యంతరం లేదు. రజనీ తిరిగి రాక వీరికి రుచించడం లేదట. పాపం
Monday, June 1, 2009
ఉద్యోగాలు ఊడుతున్నా పట్టని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం
మార్కెట్లో నెలకొన్న సంక్షోభం సాకుతో ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సిబ్బందిలో కోత పెడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు రోడ్డు పాలయ్యాయి. జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నా తనకేమి పట్టనట్లు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం వ్యవహరిస్తోంది. ఈ సంఘం నేతాశ్రీలు ఎవరైనా జర్నలిస్టును కొట్టినప్పుడు నామమాత్రపు ఆందోళనలు జరిపి మీడియాలో తమ ముఖాలు, పేర్లు చూసుకోవడం తప్ప మిగతా సమయంలో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. వీరి దృష్టిలో జర్నలిస్టుల సంక్షేమం అంటే ఇంత వరకే. అన్యాయంగా ఉద్యోగాలు ఊడగొడుతున్న యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం ఈ జర్నలిస్ట్ నేతలకు లేదు. పైరవీలకు మాత్రం ముందుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘానికి ఏళ్ళ తరబడి ఎన్నికలు జరగనే లేదు. ఇంత వరకూ సభ్యత్వమే పూర్తికాలేదు. సభ్యులు లేకున్న కొనసాగుతున్న ఈ సంఘం కొద్ది మంది జర్నలిస్ట్ ప్రముఖుల కనుసన్నల్లో మెలుగుతోంది. ఇప్పటికైనా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం సంఘానికి ఎన్నికలు జరపాలి
Subscribe to:
Posts (Atom)
