Wednesday, June 17, 2009
మా న్యూస్ మూత.. అదే దారిలో లోకల్..
తగ్గిన ఈనాడు,ఆంధ్రజ్యోతి
' సాక్షి ' అధికార దర్పం

అసెంబ్లీలో టీవీ ఛానెళ్ళపై ఆంక్షలు

పాపం రజనీ
ఎలక్ట్రానిక్ మీడియాలో 'సాలరీ బూం' రివర్స్ కావడతో జర్నలిస్టులకు తిరికి కష్టకాలం మొదలైంది. పెద్ద జీతగాళ్ళకు యాజమాన్యాలు కోత పెడుతున్నాయి. చిన్నజీతగాళ్ళని తరిమేస్తున్నాయి. సాలరీ ఎక్కువ ఇస్తున్నారనే ఆశతో 'మహా టీవీ'లో చేరిన రజనీ కాంత్ మున్నాళ్ళ మురిపెం పూర్తి చేసుకొని సొంత గూటికి రాక తప్ప లేదు. మహా టీవీ వారు జీతం తగ్గించటంతో చిన్నబుచ్చుకున్న రజని ఆ చానెల్ కి గుడ్ బై చెప్పేశారు. టీవీ9లో తిరిగి చేరిపోయారు. బుల్లి తెరపై రవిప్రకాష్ తర్వాత అంతటివాడిగా రజనీకాంత్ పేరు తెచ్చుకున్నాడు కాబట్టి టీవీ9కైనా మరెక్కడికైనా పోగలడు. కానీ మురళీ కృష్ణ, జకీర్ లకు టీవీ9 తప్ప వేరే గత్యంతరం లేదు. రజనీ తిరిగి రాక వీరికి రుచించడం లేదట. పాపం
Monday, June 1, 2009
ఉద్యోగాలు ఊడుతున్నా పట్టని ఎలక్ట్రానిక్ మీడియా సంఘం
మార్కెట్లో నెలకొన్న సంక్షోభం సాకుతో ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు తమ సిబ్బందిలో కోత పెడుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు రోడ్డు పాలయ్యాయి. జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడుతున్నా తనకేమి పట్టనట్లు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం వ్యవహరిస్తోంది. ఈ సంఘం నేతాశ్రీలు ఎవరైనా జర్నలిస్టును కొట్టినప్పుడు నామమాత్రపు ఆందోళనలు జరిపి మీడియాలో తమ ముఖాలు, పేర్లు చూసుకోవడం తప్ప మిగతా సమయంలో కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. వీరి దృష్టిలో జర్నలిస్టుల సంక్షేమం అంటే ఇంత వరకే. అన్యాయంగా ఉద్యోగాలు ఊడగొడుతున్న యాజమాన్యాలను ప్రశ్నించే ధైర్యం ఈ జర్నలిస్ట్ నేతలకు లేదు. పైరవీలకు మాత్రం ముందుంటారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘానికి ఏళ్ళ తరబడి ఎన్నికలు జరగనే లేదు. ఇంత వరకూ సభ్యత్వమే పూర్తికాలేదు. సభ్యులు లేకున్న కొనసాగుతున్న ఈ సంఘం కొద్ది మంది జర్నలిస్ట్ ప్రముఖుల కనుసన్నల్లో మెలుగుతోంది. ఇప్పటికైనా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘాన్ని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం సంఘానికి ఎన్నికలు జరపాలి
జెమినిని అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో దండుకున్న ఆర్కె
జెమిని న్యూస్ కు పట్టిన ఆర్.జె.ప్రొడక్షన్స్ చీడ ఇప్పట్లో తొలిగేలా లేదు. ప్రతి నెల ' ఆర్కె ' కాంట్రాక్ట్ కాల పరిమితి పెంచుతూ పోవడం జెమిని ఉద్యోగులకు అసంతృప్తిని కలిగిస్తోంది. ఆర్.కె. ప్రొడక్షన్స్ వారు ' జెమిని న్యూస్ 'లో కొన్ని బులిటన్లు స్లాట్ల రూపంలో తీసుకున్నాక ఆ చానెల్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఆలస్యంగా వచ్చే నాసిరకం వార్తలు, మొరటు యాంకర్లతో వచ్చే ఆర్కె బులటిన్ల కారణంగా జెమిని న్యూస్ ను చూసే వీక్షకులు మరింతగా తగ్గిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో జెమిని పేరు చెప్పుకొని ' ఆర్కే ప్రొడక్షన్స్ ' చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వార్తల సంగతి దేవుడెరుగు ఒక్కో అభ్యర్థి దగ్గర లక్షలాది రూపాయలను వసూలు చేశారట. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పిర్యాదులు. ' సూర్యుడి గుర్తు ' లోగో మైకులు పట్టుకొని జెమిని పేరు చెప్పుకొని తిరిగే ' ఆర్కె ' సిబ్బంది అడ్డగోలు వసూల్లతో రాజకీయ నాయకులు, వ్యాపారులు హడలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ' సన్ నెట్ వర్క్ ' యాజమాన్యం తమకేమీ పట్టనట్లు కుంభకర్ణుడి నిద్ర నటిస్తోంది. ఆర్కె ప్రొడక్షన్స్ వారు వారు ఇచ్చే ముడుపులు లెక్కించుకోవడంలో బిజీగా ఉన్న చెన్నై లోని సన్ గ్రూప్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ లో ఏమి జరుగుతోందో తెలుసుకునే తీరిక దొరకడంలేదు. జెమిని ప్రతిష్ట ఏమైతె వారికేం.. తమ జేబులు నిండితే చాలు.. ఈ విషయాలేవీ ' సన్ గ్రూప్ ' అధిపతులైన మారన్ సోదరులకు తెలుస్తున్నట్లు లేదు..
'ఎ టీవీ'.. ఇదేం టీవీ..

సాక్షి జర్నలిస్టుల పంట పండింది

ఎన్నికల ఫలితాలపై మీడియా హాపీ

Subscribe to:
Posts (Atom)