

నిజాలు తెలుసుకోండి..
మార్చి 24న, 23 ఎడిషన్లతో ప్రారంభమైన ' సాక్షి ' దిన పత్రిక తెలుగు మీడియా చరిత్రను తిరగ రాసింది. అంతే కాదు ఒకేసారి అత్యధిక ఎడిషన్లతో ప్రారంభమైన దిన పత్రికగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. తక్కువ ధరతో, అన్ని పేజీలు రంగులతో, అత్యాధునిక అంతర్జాతీయ పేజీ లేఔట్ తో, సరికొత్త శీర్షికలతో వెలువడుతున్న సాక్షిని చూసి తోటి దిన పత్రికలు దిమ్మ తిరిగిపోయాయి. సాక్షి రాకకు కారణాలు ఏమున్నా సరి కొత్త రూపంలో తెలుగు వారి ముందుకు వచ్చిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. సాక్షి రాకతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలు తమ రూపాన్ని సమూలంగా మార్చుకోక తప్పదు. కాగా సాక్షిలో రంగులు ఎక్కువై విషయానికి ప్రాధాన్యత తగ్గుతోందనే విమర్షలు ఉన్నాయి. పొలిటికల్ రిపోర్టింగ్ వీక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ గాలిబుడగల్లాంటివే. కొత్తదనానికి పాఠకులు క్రమంగా అలవాటు పడటం ఖాయం. మరో వైపు సాక్షి కొన్ని చోట్ల మార్కెట్లోకి ఆలస్యంగా వస్తొంది. పత్రికను బుక్ చేసుకున్న పాఠకుల ఇళ్ళకు చేరటం లేదు. ఈ బాలారిష్టాల నుడి బయట పడాలని కొరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ సాక్షి
జెమిని టీవీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రమ దోపిడీకి మారు పేరైన జెమినిలో జీతాలు ' గొర్రె తోక బెత్తెడు ' లాంటివని అందరికి తెలుసు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పొలిస్తే జెమిని సిబ్బంది జీతాలు నాలుగో వంతు మాత్రమే. కొత్తగా వస్తున్న ఛానెళ్ళు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో జెమిని నుండి వలసలు నిత్యకృత్యంగా మారాయి. జరుగుతున్నా జెమిని గ్రూప్ ఛానెళ్ళను నిర్వహిస్తున్న ' సన్ ' యాజమాన్యంలో కనీస స్పందన లేదు. అసలు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు చెన్నై లోని సన్ యాజమాన్యానికి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ లో ఛానళ్ళరూపంలొ వందలాది కోట్లు ఆర్జించే సన్ యాజమాన్యం జెమిని ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు తట్టుకోలేక ఆప్పుల ఊబిలో కూరుకు పోతున్న ఉద్యోగులపై యాజమాన్యానికి కనికరం లేదా? ఉద్యోగులు వలస పోతున్న ప్రతిసారీ జీతాలు 50-100-200 రెట్లు పెరుగుతాయని జెమిని స్థానిక యాజమాన్యం పుకార్లు లేవదీస్తోంది. నిజమని నమ్మిన జెమిని ఉద్యోగులు ఇతర ఛానళ్ళలో వచ్చిన అవకాశాల్ని వదులుకొని, చివరకు అంతా మోసమని తెలుసుకొని విచారించటం సర్వ సాధారణమైంది. తాజాగా ఏప్రిల్,మేల్లో జీతాలు డబుల్ అవుతాయని నమ్మ బలుకుతున్నారు. స్థానిక యాజమాన్య వైఫల్యం వల్లే జెమిని సిబ్బందికి జీతాలు పెరగటం లేదని తెలుస్తోంది. పైరవీలకే పరిమితమైన జెమిని స్థానిక యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకల్ని ' చెన్నై ' దృష్టికి తీసుక పోవటంలో విఫలమవుతున్నారు. వీరికి సన్ సీ.ఎం.డి. కళానిధి మారన్ అపాయింట్మెంట్ దొరకదని జెమిని వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది జీతాలు తీసునే స్థానిక జెమిని ఎం.డి., జి.ఎం.లు తమ సిబ్బంది వేతనాల వెతల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాల్లో సరి కొత్త నాటకం మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సొసైటీలను కాదని జవహర్ లాల్ నెహ్రు పేరిట వెలిసిన కొందరు పైరవీ కారుల సొసైటీకి స్థలాన్ని ఇస్తుందట. అసలు ఈ సొసైటీకి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? జర్నలిస్టుల నేతలుగా చెలామని అవుతున్న కొందరు పైరవీకారులు ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి తాము ఏర్పాటు చేసిన సంకర సొసైటీకి మాత్రమే ఇళ్ళ స్థలాలు దక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులంతా తమ సొసైటీల సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి ఈ సంకర సొసైటీలో చేరాలట. దరఖాస్తు ఫారాలు కూడా కొందరికే లిమిటెడ్ గా ఇస్తారట. ఎవరీ వంశీ? ఎవరీ భాస్కర్? ఈ సంకర సొసైటీలో ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ సభ్యుల్ని చేర్పించేందుకు ఇండియా టీవీ శ్రీనివాస్ రెడ్డి , సాబేర్ ఎందుకు తాపత్రయ పడుతున్నారు? కేవలం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అక్రమార్కులపై కోపంతో మొత్తం జర్నలిస్టుల ప్రయోజనాలకే ఎందుకు ముప్పు తల పెడుతున్నారు? అసలు ముక్యమంత్రిగారు ఈ గోముఖ వ్యాఘ్రాల్ని ఎలా నమ్మారు? ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలను కాదని ఈ సంకర సొసైటీకి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇళ్ళ స్తలాలు ఇస్తోంది? రేపు ఎవరినా న్యాయస్థానంలో సవాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరిది బాధ్యత?