Sunday, March 30, 2008

సాక్షి విశ్వ రూపం

మార్చి 24న, 23 ఎడిషన్లతో ప్రారంభమైన ' సాక్షి ' దిన పత్రిక తెలుగు మీడియా చరిత్రను తిరగ రాసింది. అంతే కాదు ఒకేసారి అత్యధిక ఎడిషన్లతో ప్రారంభమైన దిన పత్రికగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. తక్కువ ధరతో, అన్ని పేజీలు రంగులతో, అత్యాధునిక అంతర్జాతీయ పేజీ లేఔట్ తో, సరికొత్త శీర్షికలతో వెలువడుతున్న సాక్షిని చూసి తోటి దిన పత్రికలు దిమ్మ తిరిగిపోయాయి. సాక్షి రాకకు కారణాలు ఏమున్నా సరి కొత్త రూపంలో తెలుగు వారి ముందుకు వచ్చిన ఈ పత్రికను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. సాక్షి రాకతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలు తమ రూపాన్ని సమూలంగా మార్చుకోక తప్పదు. కాగా సాక్షిలో రంగులు ఎక్కువై విషయానికి ప్రాధాన్యత తగ్గుతోందనే విమర్షలు ఉన్నాయి. పొలిటికల్ రిపోర్టింగ్ వీక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ గాలిబుడగల్లాంటివే. కొత్తదనానికి పాఠకులు క్రమంగా అలవాటు పడటం ఖాయం. మరో వైపు సాక్షి కొన్ని చోట్ల మార్కెట్లోకి ఆలస్యంగా వస్తొంది. పత్రికను బుక్ చేసుకున్న పాఠకుల ఇళ్ళకు చేరటం లేదు. ఈ బాలారిష్టాల నుడి బయట పడాలని కొరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ సాక్షి

మీడియా కామాంధుడు

సైకిల్ దొంగగా నేరమయ జీవితాన్ని ఆరంభించిన ఓ ఒంగోలు చిన్నోడు కెమెరా అసిస్టెంట్ గా ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగు పెట్టాడు. పుష్కర కాలంలోనే ఔట్ పుట్ ఎడిటర్ అయిపోయాడు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని కూడబెట్టాడు. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. హిచ్ కాక్ సినిమాను మించిన సస్పెన్స్ తో కొనసాగుతోంది. కామం ప్రకోపించిన ఈ చిన్నోడు ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు మొదలెట్టాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని కట్టుకున్న ధర్మపత్నికి ద్రోహం చేశాడు. విచ్చలవిడి లైంగిక సంబంధాలు కొనసాగించాడు(కొనసాగిస్తున్నాడు) కొందరిని పెళ్ళాడాడు. కొందరితో కలిసి జీవిస్తున్నాడు. ఏక కాలంలో తల్లీ కూతుర్లతో సంబంధం పెట్టు కున్నాడట(?) చిన్నోడి అకృత్యాలను, వేదింపులను భరించలేని భార్య పోలీసుల్ని, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. లక్షలాది రూపాలు వెదజల్లి చట్టం దృష్టినుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిన్నోడు. తాజాగా ప్రేమ పేరిట మరో న్యూస్ యాంకర్ని వలలో వేసుకొని పెళ్ళాడు. పాపం చిన్నోడి గత చరిత్ర ఆవిడకు తెలియదేమో.. చిన్నోడి లీలలు ఒక్కొకటి బయటకు రావడంతో ఇతగాడు పనిచేస్తున్న ఛానెల్ ఊద్యోగంలోంచి తీసేసింది. (ఇతగాడి గురించి ఎబౌట్ తెలుగు మీడియా ముందుగానే హెచ్చరించినా సదరు ఛానెల్ కళ్ళు మూసుకొని ఉద్యోగం ఇచ్చింది. అది వేరె కత లెండి) ప్రస్తుతం కనబడకుండా పోయిన చిన్నోడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈతడి గత చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్నోడి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయట. దురదృష్టవశాత్తు మన మీడియా అన్ని రకాల నేరగాళ్ళ అడ్డాగా మారిపోయిందనటానికి చిన్నోడి కథే సాక్షం. మెరుగైన సమాజ పూర్వ విద్యార్థి చిన్నోడు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాం..

Sunday, March 2, 2008

జెమినిలో ఏం జరుగుతోంది?

జెమిని టీవీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రమ దోపిడీకి మారు పేరైన జెమినిలో జీతాలు ' గొర్రె తోక బెత్తెడు ' లాంటివని అందరికి తెలుసు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పొలిస్తే జెమిని సిబ్బంది జీతాలు నాలుగో వంతు మాత్రమే. కొత్తగా వస్తున్న ఛానెళ్ళు భారీగా వేతనాలు ఆఫర్ చేస్తుండటంతో జెమిని నుండి వలసలు నిత్యకృత్యంగా మారాయి. జరుగుతున్నా జెమిని గ్రూప్ ఛానెళ్ళను నిర్వహిస్తున్న ' సన్ ' యాజమాన్యంలో కనీస స్పందన లేదు. అసలు హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు చెన్నై లోని సన్ యాజమాన్యానికి తెలుసా? ఆంధ్ర ప్రదేశ్ లో ఛానళ్ళరూపంలొ వందలాది కోట్లు ఆర్జించే సన్ యాజమాన్యం జెమిని ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వక పోవడానికి కారణం ఏమిటి? గ్రేటర్ హైదరాబాద్ లో పెరిగిన ఇళ్ళ అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు తట్టుకోలేక ఆప్పుల ఊబిలో కూరుకు పోతున్న ఉద్యోగులపై యాజమాన్యానికి కనికరం లేదా? ఉద్యోగులు వలస పోతున్న ప్రతిసారీ జీతాలు 50-100-200 రెట్లు పెరుగుతాయని జెమిని స్థానిక యాజమాన్యం పుకార్లు లేవదీస్తోంది. నిజమని నమ్మిన జెమిని ఉద్యోగులు ఇతర ఛానళ్ళలో వచ్చిన అవకాశాల్ని వదులుకొని, చివరకు అంతా మోసమని తెలుసుకొని విచారించటం సర్వ సాధారణమైంది. తాజాగా ఏప్రిల్,మేల్లో జీతాలు డబుల్ అవుతాయని నమ్మ బలుకుతున్నారు. స్థానిక యాజమాన్య వైఫల్యం వల్లే జెమిని సిబ్బందికి జీతాలు పెరగటం లేదని తెలుస్తోంది. పైరవీలకే పరిమితమైన జెమిని స్థానిక యాజమాన్యం ఉద్యోగుల ఆకలి కేకల్ని ' చెన్నై ' దృష్టికి తీసుక పోవటంలో విఫలమవుతున్నారు. వీరికి సన్ సీ.ఎం.డి. కళానిధి మారన్ అపాయింట్మెంట్ దొరకదని జెమిని వర్గాలు చెబుతున్నాయి. లక్షలాది జీతాలు తీసునే స్థానిక జెమిని ఎం.డి., జి.ఎం.లు తమ సిబ్బంది వేతనాల వెతల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు?
దీని అర్థమేమి తిరుమలేశా?

జెమిని నుండి మరో వారం రోజుల్లో 30కి పైగా ఉద్యోగులు ఏసియానెట్ తెలుగు ఛానెళ్ళో చేరి పోతున్నారు. ముంచుకొస్తున్న ముప్పును చూస్తూ కూడా హైదరాబాద్/చెన్నై యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోవటం లేదు. స్థానిక యాజమాన్యమే పనిగట్టుకోని వారిని పంపుతోదని అందరికీ తెలుసు. ఎందుకిలా?.. సమాధానానికై చూస్తూనే ఉండండి ఎబౌట్ తెలుగు మీడియా..

ఆ ఒక్క సొసైటీకే ఎందుకు ఇవ్వాలి?

ఇళ్ళ స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న ప్రయత్నాల్లో సరి కొత్త నాటకం మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సొసైటీలను కాదని జవహర్ లాల్ నెహ్రు పేరిట వెలిసిన కొందరు పైరవీ కారుల సొసైటీకి స్థలాన్ని ఇస్తుందట. అసలు ఈ సొసైటీకి మాత్రమే ఉన్న ప్రత్యేక అర్హత ఏమిటి? జర్నలిస్టుల నేతలుగా చెలామని అవుతున్న కొందరు పైరవీకారులు ముఖ్యమంత్రిని ప్రభావితం చేసి తాము ఏర్పాటు చేసిన సంకర సొసైటీకి మాత్రమే ఇళ్ళ స్థలాలు దక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీల్లోని సభ్యులంతా తమ సొసైటీల సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి ఈ సంకర సొసైటీలో చేరాలట. దరఖాస్తు ఫారాలు కూడా కొందరికే లిమిటెడ్ గా ఇస్తారట. ఎవరీ వంశీ? ఎవరీ భాస్కర్? ఈ సంకర సొసైటీలో ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీ సభ్యుల్ని చేర్పించేందుకు ఇండియా టీవీ శ్రీనివాస్ రెడ్డి , సాబేర్ ఎందుకు తాపత్రయ పడుతున్నారు? కేవలం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అక్రమార్కులపై కోపంతో మొత్తం జర్నలిస్టుల ప్రయోజనాలకే ఎందుకు ముప్పు తల పెడుతున్నారు? అసలు ముక్యమంత్రిగారు ఈ గోముఖ వ్యాఘ్రాల్ని ఎలా నమ్మారు? ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలను కాదని ఈ సంకర సొసైటీకి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇళ్ళ స్తలాలు ఇస్తోంది? రేపు ఎవరినా న్యాయస్థానంలో సవాలు చేస్తే జరగబోయే పరిణామాలకు ఎవరిది బాధ్యత?
తెలంగాణా కోణం
ఇళ్ళ స్థలాల కేటాయింపులో తమకు జరగబోతున్న అన్యాయాన్ని పసిగట్టిన తెలంగాణా జర్నలిస్టులు పోరాటానికి సిద్దం అవుతున్నారు. వీరికి టి.ఆర్.ఎస్. అభయ హస్థం కూడా లభించిందట. హైదరాబాద్లో చాలా ఏళ్ళుగా పని చేస్తున్న తమకు వలస జర్నలిస్టుల కారణంగా పొంచి ఉన్న ముప్పును వీరు పసిగట్టి ఇప్పుడే అప్రమత్తం అయ్యారు.

Friday, February 22, 2008

పారిపోయిన డెస్క్ ఇన్ ఛార్జ్

కనబడుటలేదు
పేరు: జె.రామక్రిష్ణ
వయసు: 55+
ఉద్యోగం: ఇటీవలి దాకా జెమినిలో డెస్క్ ఇన్ ఛార్జ్
ఆనవాలు: జుట్టుకి, మీసాలకి నల్ల రంగు, సోడాబుడ్డి కళ్ళద్దాలు. + లిక్కర్ కంపు
సదరు వ్యక్తి జీతం, అక్రిడేషన్ వచ్చినప్పటి నుండీ గత రెండు నెలలుగా కనబడుట లేదు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తచ్చాడుతుంటాడు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును.
అయ్యా రామక్రిష్ణా! మీరు కనబడక మీ ఆప్త మిత్రుడు సతీష్ బాబు బెంగ పెట్టుకున్నా, మేము మాత్రం సంతోషంగా ఉన్నాము. ఇక్కడి పని వత్తిడి, ఛీవాట్లు తట్టుకోలేక ఉద్యోగం వదిలేసి పారిపోయావని మాకు తెలుసు. మీరు ఎక్కడ ఉన్నా తిరిగి రానక్కరలేదు. కానీ మా దగ్గర తీసుకున్న అప్పులు తిప్పి పంపితే అదే పది వేలు. 24 గంటలు మత్తులో ఉండే నీవు 24 గంటల టీవీ ఛానెళ్ళో పని చేయలేవని మాకు తెలుసు. నీవు ఎలాగూ తాగుడు అలవాటు మానలేవని మాకు తెలుసు. ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఇకనైనా బుద్దిగా పని చేయి. తోటి ఉద్యోగుల పైన పితూరీలు చెప్పే అలవాటు వదులుకో.
ఇట్లు..
జెమిని జర్నలిస్టులు

Sunday, February 3, 2008

ఇ-మీడియా హౌసింగ్ సొసైటీలో బయటపడుతున్న అక్రమాలు

అందరు ఊహించినట్లే ఎలక్ట్రానిక్ మీడియా హౌసింగ్ సొసైటీలో అక్రమాలు బయటపడ్డాయి. కమిటీ సభ్యులందరి సమక్షంలో పకడ్బందీంగా స్క్రూటినీ జరిపిన తర్వాత జాబితా బయట పెట్టాక పోవడంపై వ్యక్తమైన అనుమానాలను ఎబౌట్ తెలుగు మీడియా గతంలోనే వెలుగులోకి తెచ్చింది. సొసైటీ డైరెక్టర్లు గట్టిగా నిలదీసి తిరుగుబాటు చేసేసరికి విధిలేక శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ సమావేశం పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరూ ఏకపక్షంగా ముఖ్యమంత్రికి సమర్పించిన జాబితాలో అధనంగా స్క్రూటినీ జరగని కొన్ని పేర్లు ఉండటం గమనించి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. స్క్రూటినీలో కేటాయించిన పాయింట్లు, సీనియారిటీని పక్కనపెట్టి జాబితా తయారు చేయటంతో చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సభ్యులకు చెప్పకుండా ముఖ్యమంత్రికి జాబితా ఎలా ఇచ్చారు? కో ఆర్డినేషన్ కమిటీతో ఏకపక్షంగా ఎలా ఒప్పందాలను కుదుర్చుకున్నారని అడిగితే శ్రీనివాస్ రెడ్డి, సాబేర్ కుంటిసాకులు చెప్పారట. జరిగిందేదో జరిగిపోయింది, కొత్త జాబితా తయారు చేద్దామని చెప్పిన వీరిద్దరు పెద్దమనుషులు ఇప్పటిదాకా ఆ పని చేయకపోవటంతో అనుమానాలు మరింత తీవ్రమైనాయి. ముఖ్యమంత్రికి ఇచ్చిన జాబితాలో జరిగిన అక్రమాలపై నిలదీసే సభ్యులను బెదిరిస్తున్నారని సమాచారం. సొసైటీలో జరుగుతున్న పరిణామాలను సభ్యులెవరికీ చెప్పకపోవటానికి కారణం ఏమిటి? ఇంతకీ జరిగిన అక్రమాలకు భాధ్యత ఎవరిది? శ్రీనివాస్ రెడ్డిదా? సాబేర్ దా?
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల సాధన కోసం వివిధ హౌసింగ్ సొసైటీలతో ఏర్పాటైన కో ఆర్డినేషన్ కమిటీ అసలు ఏ దిశగా పోతోంది. ఇన్ని సంఘాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కష్టం, అందరూ ఒకే సొసైటీగా ఏర్పడి రండి అని ముఖ్యమంత్రి చెప్పగానే గుడ్డిగా తల ఊపి వచ్చారట. ఇప్పటికే ఉన్న సొసైటీలను కాదని కొత్తగా ఏర్పడే సొసైటీకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఏలా సాధ్యం? ప్లాటు రాని వాడెవరైనా కోర్టుకెళ్ళితే ఏమవుతుంది ఆలోచించారా?