Friday, January 29, 2010

జర్నలిస్టులకు గుణపాఠం

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎలాంటి పరిశోధన లేకుండా ఒక చానెల్ మరో చానెల్ను చూసి గుడ్డిగా వార్తలు ప్రసారం చేయడం అందరికీ తెలిసిందే. ఎక్కడో రష్యాలో ఉన్న ఒక నిషేధిత పత్రికకు చెందిన పొర్టల్ రాజశేఖర రెడ్డి మరణంపై అల్లిన కల్పిత వార్తను గుడ్డిగా ప్రసారం చేయడం ద్వారా రాష్ట్రంలొ విధ్వంసానికి కారణమైన మన టీవీ చానెళ్ళను చూసి ప్రజలు అసహ్యించుకున్నారు. ఇందులో తప్పెవరిదైనా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఖండించాల్సిందే. ఈ సంఘటనలో అసలు కారకులను గుర్తించకుండా కేవలం జర్నలిస్టులపైనే కేసులు పెట్టడం అన్యాయమే.