Friday, May 23, 2008

శివ రామ ప్రసాద్ రాజీనామా.. టీవీ-5లో సంక్షొభం..

టీవీ-5 యాజమాన్య వైఖరికి విసిగిపోయిన శివ రామ ప్రసాద్ ఆ చానెల్ కు రాజీనామా చేశారు. గత కొద్ది నెలలుగా బి.ఆర్.నాయుడు, శివ రామ ప్రసాద్ ల నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. నాయుడు కొద్ది రోజులుగా శివ రామ ప్రసాద్ మాటకు విలువ ఇవ్వక పోగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఉద్యోగులను వెనుకేసుకు రావడం, ఎడిటోరియల్ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం శివ రామ ప్రసాద్ కు ఇబ్బందిగా మారిందని టీవీ-5 వర్గాలు చెబుతున్నాయి. బిజినెస్ బ్యూరో చీఫ్ వసంత్ విషయంలో తాజాగా జరిగిన గొడవే శివ రామ ప్రసాద్ రాజీనామాకు దారి తీసింది. నాయుడు పెత్తందారి ధోరణి పట్ల టీవీ-5లోని చాలా మంది జర్నలిస్టులు ఆగ్రహంతో ఉన్నారట. వారంతా ఇతర చానెల్లలో ఉద్యోగా కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఏ చానెల్ అయినా సింగిల్ స్టీరింగ్ తో నడవటం మంచిదని ఇందుమూలంగా తెలిసిన నీతి..

తెలుగు చానళ్ల తెగులు


తెలుగు చానళ్ల తెగులు చానళ్లలో చోటు చేసుకున్న విష పరిణామాలపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక చక్కని స్టోరీని ప్రచురించింది .

'సీటీవీ'లో ఆకలి కేకలు

హైదరాబాద్ లో కేబుల్ టీవీ ప్రసారాలు అందించే ప్రముఖ చానెల్ సీటీవీ (గతంలో ఇన్ కేబుల్) గత మూడు నెలలుగా తమ జర్నలిస్టులకు జీతాలు ఇవ్వడంలేదు. రెండు నెలలకో సారి జీతాలు.. అదీ అర కొరా ఇవ్వడం సీటీవీలో మామూలే. కానీ ఏకంగా మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడం సీటీవీ జర్నలిస్టులకు ఇబ్బంది కరంగా మారింది. జీతాలు ఇవ్వకపోవడంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, ఇంట్లోకి అవసరమైన వెచ్చాలు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నామని సీటీవీ సిబ్బంది వాపోతున్నారు. అసలు ఈ దుస్థితి ఏమిటి? సీటీవీ యజమాని చౌదరి ఏమైనా నష్టాల్లో ఉన్నడా? నమ్మడం కష్టమే.. సీటీవీ సంస్థ మంచి లాభల్లోనే ఉంది. పైగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్న పనులు చేసుకోవడంలో చౌదరి దిట్ట. తమ ఉద్యోగుల కష్ట సుఖాల్లో భూరి విరాళాలు ఇచ్చి ఆదుకుంటారని చౌదరి గారికి మంచి పేరుంది. చౌదరి గారు వెంటనే జీతాలు చెల్లించాలని, ఆకలి కేకల నుండి తమని రక్షించాలని సీటీవీ జర్నలిస్టులు కోరుతున్నారు.

Wednesday, May 14, 2008

ఆంధ్రభూమి దినపత్రిక 13-05-2008




Monday, May 12, 2008

జెమినిలో సమ్మె?

వేతనాల పెంపు విషయంలో తీవ్రంగా భంగపడ్డ జెమిని సిబ్బంది సమ్మెకు సిద్దమవుతున్నారు. జీతలు పెరుగుతాయని ఎంతగానో ఆశ పడ్డ జెమిని సిబ్బందికి సన్ యాజమాన్యం మొండి చేయి చూపింది. 100 శాతం.. కాదు 50 శాతం.. కాదు కాదు 30 శాతం అని వదంతులు సృష్టించి సిబ్బంది బయటకు వెళ్ళకుండా చేసిన జెమిని-సన్ యాజమాన్యం చివరకు 5 శాతమే జీతం పెంచాలని ప్రయత్నించగా ప్రతిఘటన ప్రారంభమైంది. దీనికి భయపడ్డ యాజమాన్యం జీతాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ళదీ ఇదే సమస్యట. ఇక జీతాలు పెరగవు.. పెరిగినా పెద్ద మార్పు ఉండదని గ్రహించిన సన్ గ్రూపులోని అన్ని ఛానెళ్ల సిబ్బంది సమ్మెకు దిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన జెమిని, జెమిని న్యూస్, తేజ సిబ్బంది కూడా సమ్మెకు సిద్ద మవుతున్నారు. సిబ్బంది మూకుమ్మడి సెలవు పెట్టడమో, లేదా ధర్నాకు దిగడమో, నల్ల బ్యడ్జీలు ధరించి విధులకు హాజరు కావడమో.. ఏ రూపంలో అయినా ఈ సమ్మె జరిగే అవకాశం ఉంది. అవసరమైతే కార్మిక సంఘాల మద్దతు తీసుకొని లేబర్ కోర్టును ఆశ్రయించాలని కొదరు సిబ్బంది ప్రణాలికలు తయారు చేస్తున్నారట.
అయినవారికి కంచాల్లో..
తన ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో సన్ వర్గాలను ఒప్పించడంలో విఫలమైన జెమిని ఎం.డి. కిరణ్ తన వారు అనుకున్న వారికి మాత్రం వ్యక్తిగతంగా నగదు ఇస్తున్నారని వినికిడి. ఇలా కొందరు ఉద్యోగులకు మాత్రమే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ ధోరణి ఉద్యోగుల మధ్య మనస్పర్ధలకు దారి తీస్తోంది. కొందరికి మాత్రమే ఇలా చెల్లించడంలోని ఆంతర్యం ఏమిటి? మిగతావారేం పాపం చేశారు? విభజించి పాలించడం అంటే ఇదేనా?

maaరింది.. బాగుంది..

ఇటీవలే మారిన మాటీవీ లోగో విషయంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిల నిర్వహణలో మాటీవీ కొత్త పుంతలు తొక్కగలదని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. లోగో మార్చుకున్న మాటీవీ ఇప్పుడు వినూత్న కార్యక్రమాలు అందించటంపై దృష్టి పెట్టింది. మాటీవి త్వరలోనే జెమిని, ఈటీవీ ఛానెళ్ళకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మారిన మాటీవీ లోగొ బానే ఉంది కానీ రంగులే మబ్బుగా ఉన్నాయి. వార్తా సేకరణకు వచ్చే రిపోర్టర్లు పట్టుకునే మైకుల లోగోలు మరీ పెద్దగా ఉండి ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇవి చిన్నగా మారిస్తే బాగుంటుంది.

ఆంధ్రభూమి దినపత్రిక 06-05-2008


Saturday, May 3, 2008

జెమిని జీతాల పెరుగుదల 5 శాతమేనా?..

ఊహించినట్లే జెమిని సిబ్బంది వేతనాల పెరుగుదల విషయంలో మరోసారి దారుణంగా మోసపోయారు. సంవత్సర కాలంగా జీతాలు పెంచుతామంటూ ఊరించిన యాజమాన్యం తమ సిబ్బందిని ఘోరంగా అవమానించింది. జెమిని నుండి ఇతర ఛానెళ్ళకు భారీగా వలసలు ప్రారంభం కావడంతో జీతాలు 50 నుండి 100 శాతం దాకా పెరుగుతాయని యాజమాన్యంలోని ప్రముఖులు ప్రచారం చేసారు. ఈ ప్రచారాన్ని నమ్మిన సిబ్బంది ఇతర ఛానెళ్ళలో వచ్చిన అవకాశాలను కూడా వదులుకున్నారు. చెన్నై నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం జెమిని సిబ్బందికి కేవలం 5 శాతం జీతమే పెంచాలని సన్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ సమాచారం లీక్ కావడంతో జెమిని సిబ్బందిలో చాలా మంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇతర తెలుగు ఛానెళ్ళతో పోలిస్తే జెమిని ఛానెళ్ళలో సిబ్బంది జీతాలు అడేఅనంగా ఉన్న విషయం తెలిందే. పెరిగిన నిత్యావసర వస్తువల ధరలు, గ్రేటర్ హైదరాబాద్లో రెండు, మూడింతలు అయిన ఇళ్ళ అద్దేలు చెల్లించలేక జెమిని సిబ్బంది నరకం అనుభవిస్తున్నారు. ఇవన్నీ జెమిని-సన్ యాజమాన్యాలకు తెలియవా? నిద్ర పోయే వారిని లేపవచ్చు, కాని నిద్ర నటించే వారిని ఏమీ చేయలేం.. జెమినిలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఎం.డి కిరణ్, జి.ఎం. బాలకృష్ణన్ తినడాని తిండైనా లభించని దుస్థితిలో ఉన్న తమ సిబ్బందికి న్యాయమైన జీతాలు ఇప్పించడంలో విఫలమయ్యారు. మీరు బరిస్టా కాఫీ తాగగానే సరిపోదు.. మీ సిబ్బంది కనీసం కామత్ హోటల్లో అయినా కాఫీ తాగేలా జీతాలు ఇప్పించండి.
జీ-తెలుగు సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్

జీ నెట్ వర్క్ ' జీ-తెలుగు ' సిబ్బందికి భారీ ఇన్సెంటివ్స్ ఇచ్చింది. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.50,000ల నుండి లక్ష దాకా లబ్ది చేకూరింది. అలాగే జీతాలు కూడా భారీగా పెరిగాయి. మాటీవీ కూడా తమ సిబ్బందికి 25 శాతం దాకా జీతాలు పెంచింది. ఈటీవీ, టీవీ-9, టీవీ-5, ఎన్-టీవీ ఛానెళ్ళు కూడా జీతాలు భారీగానే పెంచాయి.. పెంచుతున్నాయి.. ఇవన్నీ విన్నారా జెమిని యాజమాన్యం వారూ..

ఆంధ్రభూమి దినపత్రిక 03-05-2008


Friday, May 2, 2008

వార్త చీఫ్ ఎడిటర్ కొమ్మినేని?

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ' వార్త ' దినపత్రిక చీఫ్ ఎడిటర్ గా చేరబోతున్నారనే వార్త మీడియావర్గాల్లో వినిపిస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ పత్ల గుర్రుగా ఉన్న గిరీష్ సంఘీ తన దినపత్రికను ఇతర పత్రికలకు ధీటుగా తీర్చి దిద్దటానికి కొమ్మినేనిని ఎడిటర్ గా రప్పించుకునే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ప్రాధమిక చర్చలు కూడా జరిగాయట. ఈనాడు, ఆంధ్రజ్యోతి పతికల్లో ఒక వెలుగు వెలిగిన కొమ్మినేని అనవసరంగా ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చి చేతులు కాల్చుకున్నానే అని చాలా కాలంగా బాధ పడుతున్నారట. ప్రింట్ మీడియాలోకి తిరిగి రావాలని భావిస్తున్న కొమ్మినేనికి వార్త రూపంలో మంచి అవకాశం అభించనుంది. కొమ్మినేని ఒక దశలో చంద్రబాబు నాయుడు తేవాలని భవించిన ' అక్షర ' దిన పత్రిక ఎడిటర్ గా వెల్లుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. చివరకు బాబు గారు అక్షర యోచన విరమించుకున్నారుట(?) వార్త దిన పత్రికను అభివృద్ది పరచడానికి గిరీష్ సంఘీ కొత్త వియ్యంకుడు (అగ్రశ్రేణి హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ యజమాని) ఆసక్తిగా ఉన్నారట.

ఈటీవీలో ముగిసిన వెంకటకృష్ణ ఎపిసోడ్

ఈటీవీ-2 హైదరాబాద్ బ్యూరో ఛీఫ్ వెంకటకృష్ణ కథ క్లైమాక్స్ కి చేరింది. వెంకటకృష్ణ ఆగడాలపై దర్యాప్తు జరిపిన ఈటీవీ యాజమాన్యం ఆయన్ని బ్యూరో ఛీఫ్ పదవి నుండి తొలగించి ముంబైకి బదిలీ చేసింది. అంటే తమరి సేవలిక చాలు దయచేయండి అని అర్థం. వెంకటకృష్ణ కంట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు నిరూపితమైంది. తన ప్రియురాలికి ఇళ్ళ స్థలం ఇప్పించడానికి పోర్జరీ లెటర్ సృష్టించిన బాగోతంపై రామోజీరావు సీరియసైనారట. ఇంతకాలం వెంకటకృష్ణను వెనుకేసుకు వచ్చిన మేనేజర్ ఇటీవలే రిజైన్ చేయటంతో ఆదుకునేవారే కరువయ్యారు పాపం. ఉసురు తగలటం అంటే ఇదే కాబోలు. వెంకటకృష్ణ లీలల్ని ఇటీవలే 'ఎబౌట్ తెలుగు మీడియా' బయట పెట్టడం అందరికీ తెలుసు. ఈటీవీ లోని వెంకటకృష్ణ బాధితులంతా ఈ వార్తను రామోజీరావు దృష్టికి తీసుకెళ్ళారు.ప్రస్తుతం వెంకటకృష్ణ ఈటీవీకి రాజీనామా ఇచ్చే యోచనలో ఉన్నాడు. ఇతగాడికి టీవీ-5 యాజమాన్యం ఇన్ పుట్ ఎడిటర్ లేదా బ్యూరో చీఫ్ పోస్ట్ ఇవ్వలని ఉవ్విల్లూరుతోందిట. ఈటీవీ-2 బ్యూరో చీఫ్ పోస్టు సీనియర్ రిపోర్టర్ మురలికి ఇచ్చారు. అలాగే ఓవరాల్ మానిటరింగ్ బాధ్యతల్ని రఘుబాబుకి ఇచ్చారు. వెంకటకృష్ణ రాజీనామా తర్వాత ఈటీవీలోని అతని ప్రియ మిత్రుడు, గోడమీది పిల్లి లాంటి నారాయణ పరిస్థితి ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు అతనిపై కూడా అవినీతి ఆరోపణలు లెస్సగా ఉన్నాయి మరి. టీడీపీ బీట్ చూసే ఇతగాడు కులాన్ని అడ్డు పెట్టుకొని భారీగా పైరవీలు చేస్తాడు.

ఆంధ్రభూమి దినపత్రిక 29-04-2008