Thursday, September 23, 2010

భారీ పెట్టుబడులతో కొత్త దిన పత్రిక

తెలుగులో భారీ పెట్టు బడులతో మరో కొత్త దిన పత్రిక రాబోతోంది. ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ పత్రికను తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పత్రిక హెడ్లు కూడా నిర్ణయమై పోయారు కూడా.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ ఈ పత్రికకు ఎడిటర్గా నిర్ణయం అయిపోయారు. మల్టీ కలర్తో ఇప్పుడు ఉన్న పత్రికల కన్నా ఎక్కువ పేజీలు , తక్కువ ధరతో రానున్న ఈ పత్రిక మీడియా వర్గాలో చర్చనీయంశం అయింది. కొత్త పత్రికలో జర్నలిస్టులకు జీతాలు కూడా భారీగానే ఉంటాయంటున్నారు. ఈనాడు, సాక్షి పత్రికలకు ఈ కొత్త పత్రిక గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఇన్నాయి. ప్రింట్ మీడియా జర్నలిస్టులకు ఇది నిజంగా 'శుభ వార్త'